Showing posts with label ఫ్రీ ఎడ్యుకేషన్. Show all posts
Showing posts with label ఫ్రీ ఎడ్యుకేషన్. Show all posts

Wednesday, 10 June 2026

జర్మన్ భాషా శిక్షణ ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు

 నిరుద్యోగ యువతీ యువకులకు జర్మన్ భాష లో శిక్షణ ఇప్పించడం ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం టాస్క్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి చంద్రయ్య, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, టాస్క్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ,  టామ్ కామ్ మేనేజర్ నాగభారతిలతో కలిసి ఆయన మాట్లాడారు.  అవకాశాలను పొందడంలో, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహిస్తామని అన్నారు . ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపాధి అవకాశాలు ఉన్నా యని ముఖ్యంగా జర్మనీలో నైపుణ్యం కలిగిన యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్న జర్మనీలో నర్సింగ్, సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో లక్షలాది ఉద్యోగాలలో ఖాళీలు ఉన్నాయని ,తెలంగాణ యువత అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ అందిస్తుందని తెలిపారు. ఉద్యోగం ఎక్కడ లభిస్తే అక్కడికి వెళ్లి పని చేసే దృక్పథం యువత అలవర్చుకోవాలని అన్నారు. పారిశ్రామికవేత్తగా పనిచేసిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ మార్కెట్ ఉన్న ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించడం వలన వేలాది మందికి ఉపాధి కల్పించగలిగామని అన్నారు. స్థానికతకే పరిమితం కాకుండా అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్లాలని యువతకు సూచించారు. జర్మనీలో వారానికి కేవలం 32 నుంచి 35 గంటల పని సమయం మాత్రమే ఉంటుందని మిగతా సమయంలో ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, జర్మనీలో నెలకు రెండు లక్షల 50 వేల రూపాయలు ఆపైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు ఏజెన్సీల మోసాలకు గురి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన టాస్క్ ద్వారా శిక్షణ పొంది విదేశీ ఉద్యోగాలను పొందాలని తెలిపారు .ఇప్పటికే ఈ కార్యక్రమానికి 112 మంది యువత నమోదు చేసుకున్నారని, వారందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ  అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం టామ్ కామ్ సంస్థకు 90 కోట్ల రూపాయలు అందించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రెండువేల రూపాయల స్టయిఫండ్ అందిస్తుందని, అదేవిధంగా జర్మన్ భాష శిక్షణ పొందుతున్న అభ్యర్థులలో 80 శాతం హాజర నమోదు చేసుకున్న వారికి కాకా వెంకటస్వామి ట్రస్ట్ తరఫున అదనంగా నెలకు ₹1000  స్టైపండ్ అందజేస్తామని తెలిపారు .యువతలో క్రమశిక్షణ, పట్టుదల , లక్ష్య సాధన పై దృష్టి ఉండాలని, జర్మన్ భాష నేర్చుకోవడానికి  ప్రతిరోజు సాధన చేయాలని సూచించారు. మందమర్రిలో ప్రారంభమైన ఈ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రతివారం తాను స్వయంగా శిక్షణ కేంద్రాన్ని సందర్శించి అభ్యర్థులతో కలిసి జర్మనీ భాష నేర్చుకుంటానని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. అంతకుముందు క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జర్మన్ భాషా శిక్షణలో బి2 సర్టిఫికేషన్ పూర్తి చేసిన మరియన్ పాసల్, హుబా ఫాతిమా లకు ఆఫర్ లెటర్లు అందజేశారు.

మన దేశానికి ఏడాదికి 90 వేల వీసాలు ఇచ్చేందుకు జర్మనీ సిద్ధంగా ఉందనీ, జర్మనీ వీసా లో 50% సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. శిక్షణ కేంద్రంలో 4 నెలల్లో జర్మనీ భాష నేర్పిస్తారని చెప్పారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాలలో అవకాశాలకు భాషా పరిజ్ఞానం తప్పనిసరి అని ,జర్మనీలో పనిచేయాలనుకునే వారికి ఆ భాష ఒక శక్తివంతమైన సాధనం అని తెలిపారు..



Monday, 8 June 2026

ఉచిత జర్మనీ శిక్షణ తరగతులు

 యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు విస్తరించేదుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉచిత జర్మనీ భాష శిక్షణ క్యాంపును నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికా రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈనెల 10న ఉదయం మందమర్రిలోని సింగరేణి ఇల్లందు క్లబ్లో శిక్షణ తరగతులను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి తిధి వెంకటస్వామి ప్రారంభించనున్నట్లు చెప్పారు మంత్రి ఆదేశాలతో జర్మనీతో పాటు యూరోపియన్ దేశాల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన భాషా నైపుణ్యాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు విదేశీ ఉపాధి అవకాశాలపై ఆసక్తి కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Saturday, 6 June 2026

సంస్కృత భాష పై ఉచిత అవగాహన శిబిరం

 సంస్కృత భాష పై ప్రాథమిక పరిజ్ఞానం కల్పించడానికి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు వారి ఆధ్వర్యంలో ఈ నెల 9 10 మరియు 11 తేదీలలో సరళ సంస్కృత భాష అవగాహన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షులు శశికాంత్ పులకరిని కార్యదర్శి రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు సంస్కృత భాష నేర్చుకోవడానికి అవసరమైన పుస్తకాలు నోట్ బుక్స్ పెన్నులు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు శిక్షణ శిబిరం బోర్గాలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుందని విద్యార్థులు మహిళలు భాషాభిమానులు ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9494 392393 ఫోన్ నెంబర్లో సంప్రదించాల్సిన సూచించారు.

Tuesday, 19 May 2026

21 నుండి ఏఐపై ఉచిత శిక్షణ

 21 నుండి ఏఐపై ,ఎమర్జింగ్ టెక్నాలజీ పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోని యువతకు ఏఐ ,ఎమర్జింగ్ టెక్నాలజీలు, స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలలో నాలుగు రోజుల పటు సదస్సులు నిర్వహించనున్నట్లు బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.

ఈనెల 21 నుండి జూన్ 11 వరకు జిల్లాలలో కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. సైదాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ ప్రధాన కార్యాలయంలో ఈనెల 21 నుంచి 26 వరకు సదస్సు ఉంటుందని ఆయన వివరించారు. జిల్లాల వారీగా షెడ్యూల్ను ప్రకటించామని 12 జిల్లాల్లోని స్టడీ సర్కిల్లోఇవి కొనసాగుతాయన్నారు.

బధిరులకు ఉచితంగా

 బదిరులకు చదువుతోపాటు అన్ని రకాల నైపుణ్యాలను ఉచితంగా నేర్పించి తీర్చిదిద్దే సరస్వతి నిలయం నాగుబడి రంగయ్య అచ్చమ్మ బదిరుల పాఠశాల. బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని నాగులపాలెం గ్రామంలో ఉన్న ఈ పాఠశాలను ప్రవాసాంధ్రుడైన డా.నాగుబడి సుబ్బారావు గారు నిర్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన వైద్య విద్య చదివి అమెరికాలో యూరాలజిస్ట్ గా స్థిరపడ్డారు. ఆయన సోదరి బధిరురాలు . ఆమెలాంటి వారికి ఉపయోగపడేలా ఏదైనా చేయమని తండ్రి కోరడంతో 18 కోట్ల రూపాయలు హెచ్చించి ఈ పాఠశాలను స్థాపించారు.



అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వాళ్లకు విద్యతోపాటు వసతి ,పుస్తకాలు ,దుస్తులు ఇలా అన్నింటినీ అందిస్తుంది ఈ స్కూలు ట్రస్ట్.చదువుతో పాటు కుట్టుపని , సబ్బులు, చాక్ పీస్ ల తయారీని నేర్పిస్తూ ఆటలలోనూ ప్రోత్సహిస్తున్నారు..

Monday, 18 May 2026

గిరిజన విద్యార్థులకు ఉచిత విద్య

 దాతృత్వంతోన ఆదర్శ సమాజ నిర్మాణం .. ఆర్బీ వి ఆర్ ఆర్ ఈ ఎస్ ఎస్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, జె ఎస్ ఎస్ఎన్ రెడ్డి.



అచ్యుత సమంత ప్రారంభించిన ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఉద్యమం 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది పంచుకోవడంలోనే ఆనందం అనే సందేశంతో మే 11 నుండి 17 వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ కోఆర్డినేటర్ పి రాజా రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం అబిడ్స్ లోని రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నీని సొసైటీ సెక్రటరీ ప్రొఫెసర్ జి గోపాల్ జాయింట్ సెక్రటరీ ఎస్ఎన్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ వారోత్సవాలలో భాగంగా వాలీబాల్ కిట్ల పంపిణీ రక్తదాన శిబిరాలు పేద విద్యార్థులకు బోధనా సామాగ్రి అందజేత ఆహార పంపిణీ మొక్కలు నాటడం ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టారు యువతలో సేవాభావం నాయకత్వ లక్షణాలు క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు ప్రస్తుతం 200 కు పైగా దేశాలకు విస్తరించిన ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఉద్యమం దాతృత్వాన్ని జీవన విధానంగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ సమాజంలో సమానత్వం మానవత్వం పెంపొందించడంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్ రెడ్డి జానకి రడ్డి తో పాటు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు 


Friday, 15 May 2026

ప్రవేశం లభిస్తే ఉచిత కార్పొరేట్ విద్యా

 ఆదర్శలో ప్రవేశాలకు 20వ తేదీ వరకు గడువు..

గ్రామీణ ప్రాంతాలలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ స్థాయి విద్యను" ఉచితంగా" అందించేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసింది. ఇక్కడ చదివిన విద్యార్థులు వివిధ రంగాలలో ప్రతిభ కనబరుస్తుండడంతో ఏటా వీటిలో ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 

16 జూనియర్ కళాశాలలు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 ఆదర్శ పాఠశాలలు, కళాశాలలు కొనసాగుతున్నాయి. ఒక్కో కళాశాలలో 160 సీట్లు ఉన్నాయి. పదవ తరగతిలో వచ్చిన మార్పుల ఆధారంగా ఇంటర్మీడియట్ విద్యలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ బైపీసీ సీఈసీ ఏఈసి గ్రూపులలో ఒక్కో విభాగంలో 40 సీట్లలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు .ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2560 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి mec స్థానంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఏఈసి( అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ గ్రూప్) ను ప్రవేశపెట్టారు. ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి ,అర్హత ఉన్న విద్యార్థులు ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. 

ఆదర్శ జూనియర్ కళాశాలలో అందజేస్తున్న "ఉచిత కార్పొరేట్ స్థాయి విద్య "ను అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అనుభవం ఉన్న అధ్యాపకులు బోధించడం వలన ఏటా ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతున్నాయని, బాలికలకు వసతి సౌకర్యం కూడా ఉందని ఎల్లారెడ్డి ఆదర్శ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తోట గాంధీ తెలిపారు.

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...