కరాటే, కర్రసాము, యోగా.. ఉచిత శిక్షణ
పిల్లలు సెలవులను వృధా చేయకుండా ఆత్మ రక్షణకు తోడ్పడేలా బాన్సువాడ మడలంలో గోజే వేద్ ఆర్యన్ అనే యువకుడు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాడు. స్థానిక ఆర్య సమాజ్ ప్రాంగణంలో కరాటే, కర్ర సాము, యోగ పై శిక్షణ ఇస్తున్నారు. తొలిత 12 మంది మాత్రమే రాగా ప్రస్తుతం 40 మంది చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. ఆర్య సమాజ్ ప్రాంగణంలో కరాటే మాస్టర్ గోజే వేద్ ఆర్యన్( బ్లాక్ బెల్ట్ )ఆధ్వర్యంలో కర్రసాము, కరాటే ,యోగ పై ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లల ఆసక్తికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడు కావడంతో శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది.

