భిక్కనూరు మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మంగళవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులకు వైద్యుడు నవీన్ సాయి ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయిస్తే మానసిక ఉపేశమానం కలుగుతుందన్నారు. ,"ప్రతి మంగళ, గురువారం " భవిత కేంద్రంలో ఈ "ఉచిత ఫిజియోథెరపీ శిబిరం " ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఈఆర్పి మహేందర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
27, మే 2026, బుధవారం
శుభకార్యాలకు ఉచిత స్టీల్ ప్లేట్లు గ్లాసులు
పాలిథిన్ ప్లేట్ల వాడకంతో ఆరోగ్యం తో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన కొన్ని గ్రామాల పాలకవర్గాలు పాలిథిన్ ప్లేట్లపై యుద్ధం ప్రకటించాయి. కేవలం నిషేధం ఉత్తర్వులకే పరిమితం కాకుండా ఆచరణాత్మక దిశగా అడుగులు వే స్తున్నారు. గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు నడుం బిగించాయి. ప్రత్యామ్నాయంగా స్టీల్ ప్లేట్లు వాడటానికి శ్రీకారం చుట్టాయి. ఆలయాలలో శుభకార్యాల లో సామూహిక భోజనాలకు స్టీల్ ప్లేట్లనే వాడుతున్నారు. వందల మంది జనం భోజనం చేసేలా ఈ ప్లేట్లను విరాళంగా అందిస్తూ దాతలు సైతం సహకరిస్తున్నారు. ఈ స్ఫూర్తి ఉద్యమంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో విస్తరిస్తుంది.
కమ్మర్పల్లిలోని పాటి హనుమాన్ ఆలయం ఉంది. కొన్ని ఏళ్లుగా ఇక్కడ ప్రతి శనివారం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నార . పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని భోజనం చేస్తారు. వీరంతా ఉపయోగించిన ప్లేట్లతో ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాటు ఆరోగ్యానికి ప్రమాదమని గ్రహించిన ఆలయ నిర్వాహకులు స్టీల్ ప్లేట్లను వినియోగించాలని నిర్ణయించారు. భక్తులు సైతం పెద్ద సంఖ్యలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ఆలయానికి విరాళంగా అందించి సహకరించారు. ఈ స్ఫూర్తి గ్రామంలో జరిగే జాతరలు శ్రీరామ నవమి, వినాయక చవితి ఉత్సవాలలో కొనసాగింది .ప్రస్తుతం ఊరిలో ఉత్సవం ఏదైనా స్టీల్ ప్లేట్ల వాడకం పక్కాగా అమలు అవుతుంది. తాజాగా శుక్రవారం దేవి ఆలయం వద్ద సైతం స్టీల్ ప్లేట్లే వాడాలని గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానించింది .భక్తులు పెద్ద ఎత్తున ప్లేట్లు ,గ్లాసులు విరాళంగా అందించారు. ఈ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని పక్క గ్రామాలు కమ్మర్పల్లి స్టీల్ ప్లేట్లను తీసుకెళ్లి తమ గ్రామాల ఉత్సవాలలో ఉపయోగించుకుని తిరిగి ఇచ్చేస్తున్నారు.
25, మే 2026, సోమవారం
RIDO NGO ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం
నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆర్ ఐ డి వో ఎన్ జి ఓ ఆధ్వర్యంలో శనివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది .దంత సమస్యలతో బాధపడుతున్న పలువురికి " ఉచితంగా వైద్య పరీక్షలు " నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్ ముఖ్య అతిథి గా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. గౌతమ్ నగర్ కార్పొరేటర్ శివ చరణ్, నరేందర్ ,సీనియర్ న్యాయవాది మురళీధర్ రావు తదితరులు పాల్గొని నిర్వహకులను అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆర్ఐడిఓ ఎన్జీవో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అని అన్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు" ఉచిత వైద్య సేవలు " అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించే కార్యక్రమాలు" ఉచిత వైద్య శిబిరాలు " మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమం విజయానికి సహకరిస్తున్న వైద్యులు, అతిథులు మరియు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
24, మే 2026, ఆదివారం
ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు పొడిగింపు
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI మై ఆధార్ పోర్టల్ లో ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్ డేట్ గడువు ను పొడిగించింది. ఆధార్ కార్డు దారులు ఇప్పుడు తమ గుర్తింపు,చిరునామా ఆధార పత్రాలను ఎలాంటి ఫీజు లేకుండా 2027 జూన్ 14 వరకు అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకుంటున్న ఆధార్ కార్డు దరుల నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో ఉంచుకొని ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
ఆధార్ కార్డుదారులు కొత్త ఆధార్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ కొత్త యాప్ లో సురక్షితమైన ఆధార్ క్యూఆర్ ఆధారిత ఆధార్ షేరింగ్, మెరుగైన ప్రైవసీ నియంత్రణలు, ఆధార్ సేవలకు సులభమైన యాక్సెస్ వంటి ఫీచర్లు ఉన్నాయని UIDAI వివరించింది.
5-17 ఏళ్ల వారికి ఆధార్ సవరణ ఉచితం
ఐదు నుంచి 17 ఏళ్ల వయసు గల వారికి మొదటిసారి ఆధార్ కార్డులో వివరాలను ఆధార్ కేంద్రాలలో సవరణ చేసుకుంటే ఎటువంటి రుసుము చెల్లించే అవసరం లేదని UIDAI హైదరాబాద్ రీజినల్ అధికారులు తెలిపారు.
ఐదేళ్లు నిండిన తర్వాత చేసే సవరణలో పిల్లల బయోమెట్రిక్, ఐరిస్ తీసుకుంటారని తెలిపారు. సాధారణంగా ఐదు నుంచి ఏడు ఏళ్లు మరియు 15 నుంచి 17 ఏళ్లు మధ్య వయసు గల వారికి మాత్రమే నమోదు కేంద్రాలలో మొదటిసారి వివరాల సవరణలను ఉచితంగా చేస్తారు .కానీ ఈసారి ఐదు నుంచి 17 ఏళ్ల వయసు గల వారందరికీ సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా సవరణ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఆధార్ కార్డులో చిరునామా తదితర వివరాలను ఆన్లైన్లో ఉచితంగా సవరించుకునే అవకాశం ఈ ఏడాది జూన్ 14 వరకు ఉండగా దీనిని మరొక ఏడాది పొడిగించినట్లు తెలిపారు.
పాయల్ ఫౌండేషన్.. ఉచిత అన్న దానం
పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత అన్నదానం ..
బేల సబ్ మార్కెట్ యార్డులో పంటలను అమ్ముకోవడానికి వస్తున్న రైతులకు పాయల్ ఫౌండేషన్ ఉచితంగా అన్నదానం చేస్తూ ఆదుకుంటుంది. మార్కెట్ యార్డ్ కి వచ్చిన రైతులకు అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమని పాయల్ శంకర్ ఫౌండేషన్ నిర్వాహకులు అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వారు తెలిపారు. మార్కెట్ యార్డ్ అధికారులు రైతులకు గన్ని బ్యాగులు, చల్లటి మంచినీటి వసతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇంద్రశేఖర్, భూపతి రెడ్డి ,నవీన్ ,దత్త నిక్కం,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
19, మే 2026, మంగళవారం
ఉచితంగా మామిడి మొక్కల పంపిణీ
వేసవి అనగానే మనకు టక్కున గుర్తు వచ్చేవి మామిడి పండ్లు. అందరూ పండ్లను తిన్న తర్వాత టెంకలను బయటపడేస్తుంటారు. అయితే బయటపడవేసే ఈ టెంకలను సేకరిస్తూ రైతులకు ఆదాయ మార్గాన్ని చూపుతున్నాడు కోల్ కతా కు చెందిన జస్మిత్ సింగ్. వైద్య శాస్త్రం చదివిన ఆయన , ఆంత్ర ప్రేన్యూర్ గా కూడా పని చేసిన ఆయనను నీరు లేక వరి పొలాలు ఎండిపోయి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్న కొన్ని సంఘటనలు కలచి వేసాయి. అప్పుడే నీటి అవసరం ఎక్కువగా లేని ఎక్కువ కాలం ఆదాయం పొందే దిశగా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. అలా వచ్చింది మామిడి టెంక లను సేకరించాలనే ఒక ఆలోచన.
దాంతో ప్రతి ఏటా వేసవి ప్రారంభంలో "మామిడి టెంకలను పారేయకండి, వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టాక నాకు పంపించండి "అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడ నుండో పార్శిల్ల ద్వారా వచ్చిన టెంకలను దీని కోసమే సొంతంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలుగా పెంచుతున్నాడు .ఆ తర్వాత వాటిని " రైతులకు ఉచితంగా "పంచుతున్నాడు. అవి పెరిగి పెద్దయ్యాక రైతులకు ఆదాయ వనరుగా మారడంతో పాటు పచ్చదనం పెంపొంది పర్యావరణానికి మేలు జరుగుతుందని అంటారు డాక్టర్ జస్మిత్ సింగ్.
వదిరాజా భట్ @ ఓ శాట్..
వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...
-
భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పురం లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మేధా చారిటబుల్ ట్రస...
-
డిచ్పల్లి SBI ఉచిత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం .. 08461-295428 డిచ్ పల్లి లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో 2026-27 ఆర్...
-
నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...



