Wednesday, 27 May 2026

ఉచిత ఫిజియోథెరపీ చికిత్స

 భిక్కనూరు మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మంగళవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులకు వైద్యుడు నవీన్ సాయి ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయిస్తే మానసిక ఉపేశమానం కలుగుతుందన్నారు. ప్రతి మంగళ, గురువారం భవిత కేంద్రంలో ఈ ఉచిత ఫిజియోథెరపీ శిబిరం ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఐఆర్పి మహేందర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



వివేక్ సంస్కార్ వేసవి శిక్షణ శిబిరం

 నిజామాబాద్ లోని గంగస్థాన్లోని వివేకానంద ఆడిటోరియంలో రామకృష్ణ సేవా సమితి వారు వివేక్ సంస్కార వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సును సంస్థ తరఫున మంగళవారం ఏర్పాటు చేశారు .వక్తలు మాట్లాడుతూ బాలల హక్కులు ,సంరక్షణ ,చట్టాలపై అవగాహన కల్పించారు . సెల్ఫోన్ వ్యసనం అనర్థాల గురించి  వివరించారు. చిన్నారులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని న్యాయ సేవా సంస్థ చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాది రాజకుమార్ సుబేదార్ సూచించారు.

శుభకార్యాలకు ఉచిత స్టీల్ ప్లేట్లు గ్లాసులు

 పాలిథిన్ ప్లేట్ల వాడకంతో ఆరోగ్యం తో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన కొన్ని గ్రామాల పాలకవర్గాలు పాలిథిన్ ప్లేట్లపై యుద్ధం ప్రకటించాయి. కేవలం నిషేధం ఉత్తర్వులకే పరిమితం కాకుండా ఆచరణాత్మక దిశగా అడుగులు వే స్తున్నారు. గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు నడుం బిగించాయి. ప్రత్యామ్నాయంగా స్టీల్ ప్లేట్లు వాడటానికి శ్రీకారం చుట్టాయి. ఆలయాలలో శుభకార్యాల లో సామూహిక భోజనాలకు స్టీల్ ప్లేట్లనే వాడుతున్నారు. వందల మంది జనం భోజనం చేసేలా ఈ ప్లేట్లను విరాళంగా అందిస్తూ దాతలు సైతం సహకరిస్తున్నారు. ఈ స్ఫూర్తి ఉద్యమంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో విస్తరిస్తుంది. 

కమ్మర్పల్లిలోని పాటి హనుమాన్ ఆలయం  ఉంది. కొన్ని ఏళ్లుగా ఇక్కడ ప్రతి శనివారం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నార . పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని భోజనం చేస్తారు. వీరంతా ఉపయోగించిన ప్లేట్లతో ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాటు ఆరోగ్యానికి ప్రమాదమని గ్రహించిన ఆలయ నిర్వాహకులు స్టీల్ ప్లేట్లను వినియోగించాలని నిర్ణయించారు. భక్తులు సైతం పెద్ద సంఖ్యలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ఆలయానికి విరాళంగా అందించి సహకరించారు. ఈ స్ఫూర్తి గ్రామంలో జరిగే జాతరలు శ్రీరామ నవమి, వినాయక చవితి ఉత్సవాలలో కొనసాగింది .ప్రస్తుతం ఊరిలో ఉత్సవం ఏదైనా స్టీల్ ప్లేట్ల వాడకం పక్కాగా అమలు అవుతుంది. తాజాగా శుక్రవారం దేవి ఆలయం వద్ద సైతం స్టీల్ ప్లేట్లే వాడాలని గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానించింది .భక్తులు పెద్ద ఎత్తున ప్లేట్లు ,గ్లాసులు విరాళంగా అందించారు. ఈ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని పక్క గ్రామాలు కమ్మర్పల్లి స్టీల్ ప్లేట్లను తీసుకెళ్లి తమ గ్రామాల ఉత్సవాలలో ఉపయోగించుకుని తిరిగి ఇచ్చేస్తున్నారు.


ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో 500 స్టీల్ ప్లేట్లు ,250 గ్లాసులు కొనుగోలు చేశారు .గ్రామంలో జరిగే వేడుకలు ఇతర కార్యక్రమాలలో ఉపయోగించుకోవాలని తీర్మానం చేశారు. గ్రామ మహిళా సమాఖ్యలకు అందజేసి అందుబాటులో ఉంచారు. ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించడంతో క్రమంగా వారిలో మార్పు మొదలైంది. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో సైతం ప్లాస్టిక్ వాడొద్దని పాలకవర్గం తీర్మానించింది .వాడకం క్రమంగా తగ్గుముఖం పట్టింది.

ఉచితంగా అందించారు..

శుభకార్యాలు ఇతర కార్యక్రమాలలో ప్లాస్టిక్ వస్తువులు వాడకాన్ని తగ్గించాలని అనుకున్నారు నందిపేట సర్పంచి సిలిండర్ లింగం. వెంటనే సమస్య పరిష్కారానికి కార్యాచరణ మొదలుపెట్టారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా స్టీల్ వస్తువులు వాడాలని సూచించారు. ఇందుకు తన సొంత ఖర్చులతో ఐదువేల స్టీల్ ప్లేట్లు 5000 గ్లాసులు కొనుగోలు చేసి గ్రామానికి "ఉచితంగా "అందించారు. 

సొంత డబ్బుతో కొనుగోలు..ఉచితంగా పంపిణీ 

 నవీపేటకు చెందిన నాంపల్లి వసంత్ అతడు స్నేహితులు రమేష్, శిరినాగిరి కలిసి సొంత డబ్బుతో 500 స్టీల్ ప్లాన్యాలు 400 గ్లాసులు కొనుగోలు చేశారు. వీటిని ఇప్పటివరకు 13 వివాహాలు 30 శుభకార్యాలకు ఉచితంగా అందించారు. గత ఏడాది వసంత్ తన కూతురు వివాహ వేడుకను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించారు.




లింగేశ్వర ఆశ్రమంలో శిక్షణ

 నిజామాబాద్ మండలం మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో ఉచిత  సంస్కృతి బోధన శిక్షణ శిబిరాన్ని ఆశ్రమ పీఠాధిపతి బాలయోగి కృష్ణ మహారాజ్ మంగళవారం ప్రారంభించారు .జిల్లాలోని నలుమూలల నుంచి విద్యార్థులు శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. మొదటి రోజు పిల్లలు ధ్యానం, యోగ పై శిక్షణ పొందారు. వేదమంత్రాలు ,యజ్ఞ శ్లోకాలు ,సంస్కృతి విశిష్టతను వివరించారు .మన సంస్కృతి పై విద్యార్థి దశ నుంచి పిల్లల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఈ శిబిరం కొనసాగుతున్నట్లు కృష్ణ మహారాజ్ పేర్కొన్నారు.



బీర్కూర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం

 


కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు " ఉచిత కంటి పరీక్షలు " నిర్వహించారు. మోతి బిందు ఉన్న 11 మందిని బోధన్ లయన్స్ క్లబ్ దవాఖానకు తరలించినట్లు వైద్యుడు సతీష్ తెలిపారు. వీరికి అక్కడ " ఉచితంగా మోతి బిందు శస్త్ర చికిత్స "చేయించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ సభ్యులు సాయి కృష్ణ, భరత్ తదితరులు పాల్గొన్నారు.



Tuesday, 26 May 2026

ఉచిత కుట్టు మగ్గం వర్క్ బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ

 కుట్టు ,మగ్గం వర్క్, బ్యూటిషన్ కోర్సులలో ఉచిత శిక్షణ పొందేందుకు నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతులు ,మహిళలకు ఎస్బిఐ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్బిఐ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు .జూన్ 1 నుంచి కోర్సులు ప్రారంభమవుతాయని అన్నారు .ఎంపికైన వారికి 30 రోజుల పాటు" ఉచితంగా వసతి కల్పించి భోజనం " అందిస్తామన్నారు .ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి పూర్తి వివరాలతో నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు .ఆధార్ కార్డు, నాలుగు ఫోటోలు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్త పుస్తకం తో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను తీసుకొని రావాలని తెలిపారు.

Monday, 25 May 2026

ఆర్మూర్ లో ఉచిత శిక్షణ

 


మామూలు రోజుల్లో సెల్ ఫోన్ దొరికితే చాలు పిల్లలు పట్టుకుంటారు ఇక వేసవి సెలవుల్లో అయితే సెల్ ఫోన్ టీవీ తదితర వాటికి అతుక్కుపోతారు. ఈ వేసవి సెలవులు మాత్రమే వినూత్నంగా సాగుతున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలతో పాటు ప్రైవేటు సమ్మర్ క్యాంపులు సైతం విద్యార్థులతో కిట కిట లాడుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల బియ్యం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మోడల్ స్కూల్ కస్తూర్బా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు మొత్తం 90 మంది రోజు హాజరవుతున్నట్లు హెచ్ ఎం తెలిపారు డ్రాయింగ్ హార్ట్ అండ్ క్రాఫ్ట్ సంగీతం యోగ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు వేసవి సెలవులను పిల్లలు వృధా చేయకుండా శిక్షణ పొందడం ప తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...