Sunday, 7 June 2026

స్పోకెన్ ఇంగ్లీష్ 7 రోజుల ఫ్రీ ట్రయల్

 స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి 7 రోజులు ఉచితంగా క్లాసులు వినే అవకాశం .7 రోజులు ఉచితంగా విన్న తర్వాత నచ్చితేనే కోర్స్ లో చేరవచ్చు.

స్పోకెన్ ఇంగ్లీష్ నిపుణురాలు ఐన భూక్యా గౌతమి గారు " జీరో టు హీరో " అనే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ను రూపొందించారు.దీనిని gyan tv యాప్ లో అందుబాటులో ఉంచారు. కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకునే వారికి 7 రోజులు ఉచితంగా క్లాసులు వినే అవకాశం కల్పించారు. కోర్స్ నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు.లేకపోతే మానేయవచ్చు.

Saturday, 6 June 2026

ఉచిత కేన్సర్ పరీక్షలు@ కదిలే బస్ లో

 కేన్సర్ స్క్రీనింగ్ టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు, మహిళల కోసం ఉచితంగా 20వేల రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు, కేన్సర్ ఉన్నట్టు తెలిస్తే 50% ఖర్చు తగ్గించే వైద్యము, రేపటి నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి ప్రారంభం. 



మనకు తెలియకుండానే చెప్పకుండా నీరులా వ్యాపిస్తున్న వ్యాధులలో క్యాన్సర్ ప్రధానమైనది శరీరంలో కణ వ్యవస్థ పనితీరు అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది అయితే కేన్సర్ వస్తే ఇక అంతేనా అని దీనికి మందు లేదని చాలామంది భయపడుతుంటారు. కానీ క్యాన్సర్ ను ప్రారంభంలోనే గుర్తిస్తే నియంత్రించొచ్చు, ప్రారంభ దశలోనే గుర్తించేందుకు వైద్య పరికరాలతో ప్రత్యేక బస్సును అందుబాటులోకి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు తీసుకొచ్చారు ఈ బస్సు ద్వారా పల్లెలలో పట్టణాల్లో మహిళలకు స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు కేన్సర్ ఉన్నట్టు తెలిస్తే ప్రముఖ కేన్సర్ ఆసుపత్రుల్లో 50% మేరా ఖర్చు రాయితీతో వైద్యం చేయించాను అన్నారు అందులో భాగంగా ఆదివారం నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలు ఉన్నారు 

ఉచితంగా వైద్య పరీక్షలు.. బీడీఎల్ వారి సౌజన్యంతో బస్సు శిశిర ఆస్పత్రి వారి సహకారంతో వైద్య పరీక్షల సామాగ్రిని సమకూర్చారు ఆ తర్వాత ఉచిత కాన్సర్  స్క్రీనింగ్ టెస్టింగ్ సెంటర్ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చారు ఇటీవల ఈ బస్సును లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారు ప్రారంభించారు హైదరాబాద్ కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సింధు, ఆంకో సర్జన్ డాక్టర్ స్రవం తేజ నేతృత్వంలో పరీక్షలు నిర్వహించనున్నారు ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు నుంచి 20వేల రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు ఉచితంగా అందించనున్నారు మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 45 మండలాలు 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి లోని 9 డివిజ డివిజన్ లలో క్యాన్సర్ టెస్టింగ్ బస్ సంచరించనున్నది. ఎక్కడికి వెళ్లినా ముందుగా అక్కడ ప్రజలకు సమాచారం అందిస్తారు మహిళలకు బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ టెస్టులు ఉచితంగా చేస్తారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కేన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరగా కోలుకుంటారని మహిళలు ఎక్కువగా బ్రష్టు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఈ బస్సు లోక్ లోక్భ సభ నియోజకవర్గంలో అంతటా సంచరిస్తుందని అక్కడే టెస్టు నిర్వహించే రిపోర్టులు అందజేస్తారని మహిళలందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఎంపీ మాధవిని రఘునందన్ రావు గారు కోరారు.

ముగిసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం

 కామారెడ్డి జిల్లాలోని గర్గోలు గ్రామంలో పీపుల్ ఫర్ ఇండియా ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది శిక్షణ పొందిన వారికి ద్రోపత్రాలను సంస్థ ఉపాధ్యక్షుడు అరవింద్ అందించారు విద్యార్థినిలకు ఐదు కుట్టుమిషన్లు మగ్గం పరికరాలు దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిడిపిఓ స్రవంతి ఎన్జీవో అందిస్తున్న సేవలను అభినందించాలి కార్యక్రమంలో ఏసీజీ బలరాం ఎంఈవోలు ఎల్లయ్య ఆనందరావు శిక్షకులు నవీన్ చైతన్య లావణ్య తదితరులు పాల్గొన్నారు.

ఉచిత స్టీల్ ప్లేట్ల పంపిణీ

 బాన్స్వాడ మండలంలోని దేశాయిపేట గ్రామానికి చెందిన తపస్సు జిల్లా అధ్యక్షుడు బోనీకర్ సంతోష్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా గ్రామానికి ఉపయోగపడేలా 100 స్టీల్ ప్లేట్లను గ్రామ సర్పంచ్ భూమిక జ్యోతి కి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో జరిగే శుభకార్యాలు సామాజిక కార్యక్రమాలకు ఈ ఉచిత స్టీల్ ప్లేట్లను వినియోగించాలన్నారు అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ దోహదపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలను సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు సేవా కార్యక్రమాలు మరిన్ని మున్ముందు చేపట్టాలని కోరారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామస్వామి జయ వీరప్ప డాక్టర్ రవి కమార్ సంతోష్ పటేల్ గాండ్ల శ్రీనివాస్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

కరక్ వాడిలో మెడికవర్ హాస్పిటల్స్ ఉచిత మెగా వైద్య శిబిరం

 గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలని లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో కరక్ వాడి అనే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో మెడికవర్ వైద్య బృందం గ్రామ ప్రజలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మరియు ఆరోగ్య సమస్యలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందించింది. రక్తపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు ,కీళ్ల నొప్పులు, నరాల సంబంధిత సమస్యలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. అవసరమైన వారికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మెరుగైన చికిత్స అవసరమైన రోగులను మెడికవర్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనారోగ్యాలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేద మరియు గ్రామీణ ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీష్ చంద్రబోస్, పలమనాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్, నర్సింగ్ సిబ్బంది, గ్రామపంచాయతీ ప్రతినిధులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ఉచిత  వైద్య శిబిరంలో 300 మందికి పైగా గ్రామస్తులు వైద్య సేవలను వినియోగించుకుని లబ్ధి పొందారు.

సంస్కృత భాష పై ఉచిత అవగాహన శిబిరం

 సంస్కృత భాష పై ప్రాథమిక పరిజ్ఞానం కల్పించడానికి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు వారి ఆధ్వర్యంలో ఈ నెల 9 10 మరియు 11 తేదీలలో సరళ సంస్కృత భాష అవగాహన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షులు శశికాంత్ పులకరిని కార్యదర్శి రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు సంస్కృత భాష నేర్చుకోవడానికి అవసరమైన పుస్తకాలు నోట్ బుక్స్ పెన్నులు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు శిక్షణ శిబిరం బోర్గాలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుందని విద్యార్థులు మహిళలు భాషాభిమానులు ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9494 392393 ఫోన్ నెంబర్లో సంప్రదించాల్సిన సూచించారు.

మరోసారి 300 మందికి ఉచిత వీసాలు

 యూఏఈ లోని ADNH, స్థానిక GTM సంస్థల ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ మేళా.. జూన్ 12 న సిరిసిల్ల, జగిత్యాలల్లో,13 న నిజామాబాద్, ఆర్మూర్ లలో ఇంటర్వ్యూ ల నిర్వహణ.

యూఏఈ లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు మరోసారి ఉచిత వీసాలను ఇప్పించేందుకు యూఏఈ కి చెందిన ADNH, మన దేశానికి చెందిన GTM సంస్థలు ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ మెంట్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.క్లీనింగ్ విభాగంలో 300 మందికి ఉచిత వీసాలు ఇచ్చేందుకు ఈ నెల 12 తేదీ న సిరిసిల్ల, జగిత్యాలల్లో,13 న నిజామాబాద్ ఆర్మూర్ లలో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.21 ఏళ్ల వయసు నిండి 40 సంవత్సరాలలోపు వారు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు.

ఎంపికైన వారికి "ఉచితంగా వీసాలు "ఇచ్చి విమానం ఛార్జీలను సైతం కంపెనీ యే భరించనుంది. భారత కరెన్సీలో నెలకు 24 వేల రూపాయలు వేతనం చెల్లిస్తూ,నివాసం,భోజనం సదుపాయాలను ADNH కంపెనీ కల్పిస్తుంది.

వివరాల కోసం .. క్రింది ఫోన్ నెంబర్లలో సంప్రదించాలి.

సిరిసిల్ల 83320 17122, జగిత్యాల 83320 42299, నిజామాబాద్ 86868 60999 , ఆర్మూర్ 83320 13999 నంబర్ లలో సంప్రదించాలని తెలిపారు.

ఈ సందర్భంగా GTM సంస్థ చైర్మన్ సతీష్ రావు మాట్లాడుతూ ఉచిత వీసాలు అందించే అవకాశం తమకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వలస వెళ్ళే వారిపై నయాపైసా భారం పడకుండా అన్ని వసతులు ఉచితంగా కల్పించడం తమ ప్రత్యేకత అని అన్నారు.నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...