Monday, 4 May 2026

ఉచిత న్యాయము.. భారత దేశంలో ఇలా

 భారతదేశంలో ఉచిత న్యాయ సహాయము ఇలా పొందవచ్చు..

ఉచిత న్యాయము.. ఉచిత న్యాయం అనేది ప్రజల హక్కు. దీనికొరకై లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవలు వినియోగించుకోవాలి .బాధితులు న్యాయస్థానాలను ఇప్పుడు ఆశ్రయించడం చాలా సులభతరం .న్యాయ సహాయమే కాదు ,పరిహారం పంపిణీ సేవలు కూడా పొందవచ్చు. లోక్ అదాలతల నిర్వహణలో నంబర్ వన్ గా టి ఎస్ ఎల్ ఎస్ ఏ. బంధాలు తెగిపోకుండా మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారము. 

ఉచితంగా న్యాయ సహాయం పొందడం అనేది ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఇదే చెబుతోంది .కోర్టు పేరు చెబితే చదువుకున్న వారు, ఆర్థికంగా కొద్దో గొప్ప ఉన్నవారు కూడా హడలిపోతారు. కోర్టుల పోరాటం అంటే ఖరీదైన వ్యవహారమే. మరి నిరుపేదలు నిస్సహాయులు అభాగ్యులు అనాధలు ఏం చేయాలి? ఎలా న్యాయం పొందాలి దీనికోసం ఉద్భవించినవి లీగల్ సర్వీసెస్ అథారిటీలు వివక్ష లేకుండా న్యాయం అందరికీ సమానంగా అందాలనేది దీని మూల సూత్రము న్యాయవ్యవస్థను ఉపయోగించుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారికి అథారిటీ సహాయం అందిస్తుంది. పేదలకు ఉచిత న్యాయ సలహానే కాదు న్యాయవాదిని అందిస్తుంది అంతేకాదు పలు పథకాలు అందజేస్తుంది నవంబర్ 9వ తేదీన లీగల్ సర్వీసెస్ అథారిటీ డే గా జరుపుకుంటారు 

నేషనల్ అథారిటీ.. 

చట్టాల పైన అవగాహన లేమి తో అనగారిన, బలహీన వర్గాలకు సరైన న్యాయం అందడం లేదని సుప్రీంకోర్టు భావించింది. ఉచిత న్యాయ సేవలను అందించడానికి, వివాదాల సామరస్య పూర్వక పరిష్కారానికి లోక్ అదాలత్ ల నిర్వహణ కోసం 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం ప్రకారం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ /నల్సా ఏర్పాటు చేసింది నల్సా పాట్రన్ ఇన్ చీఫ్ గా భారత ప్రధాన న్యాయమూర్తి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి వ్యవహరిస్తారు.

రాష్ట్ర అథారిటీ ..

ప్రతి రాష్ట్రంలో నల్సా విధానాలు, ఆదేశాలను అమలు చేయడానికి, ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి ,లోక్ అదాలతులను నిర్వహించడానికి రాష్ట్ర న్యాయ సేవల అథారిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి పాట్రన్ ఇన్ చీఫ్ గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి వ్యవహరిస్తారు. జిల్లా న్యాయ సేవల అథారిటీకి జిల్లా న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు.

ఉచిత సేవలు ఎవరికి అంటే..

ఎస్సీ, ఎస్టీలు, మానవ అక్రమ రవాణా బాధితులు, మహిళా లేదా చిన్నారులు, మానసిక రోగులు ,దివ్యాంగులు ,ప్రకృతి విపత్తులు, జాతి హింస, కుల హింస, వరదలు, కరువు ,భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు లాంటి వాటిలో అనుకోని పరిస్థితుల్లో బాధితులు, పరిశ్రమలలో కార్మికులు, బాల నేరస్తులు ,మానవ అక్రమ రవాణా బాధితులుగా పోలీసు కస్టడీలో ఉన్నవారు.. వీరందరూ ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు.

అథారిటీ ఏం చేస్తుంది అంటే..

ఉచిత న్యాయ సహాయం ,లోక్ అదాలత్ నిర్వహణ, నల్సా పథకాల అమలు, బాధితులకు పరిహారం అందజేత, మీడియేషన్, ఉచితంగా న్యాయవాది ఏర్పాటు .


నల్సా కార్యాలయ అడ్రస్..


నల్సా ,భారత సుప్రీంకోర్టు, తిలక్ మార్క్,

 న్యూఢిల్లీ 1100 01 ,

హెల్ప్ లైన్ నెంబర్ 15100.


సిటిజన్ల కోసం..  

నల్సా కేంద్రం.. జై సల్మేర్ హౌస్, 26 మాన్సింగ్  రోడ్, న్యూఢిల్లీ 1100 11.

రాష్ట్ర అథారిటీ పరిధిలోని మొత్తం ప్యానెల్ లాయర్లు.. 252 ,

వీరిలో పురుషులు ..157 ,మహిళలు.. 75

 వీరి కాల పరిమితి మూడేళ్లు.

ప్రజాసేవకే అథారిటీ.. కక్షిదారులకు ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలతో పాటు మధ్యవర్తిత్వం ద్వారా అథారిటీ పరిష్కారం చూపిస్తుంది. నల్సా ద్వారా టీజీఎల్ఎస్ ఏ  అందించే ఈ సేవలు, పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల చెంతకే పలు పథకాలు చేరేలా వలంటీర్లు మీ వద్దకే వస్తున్నారు. మధ్యవర్తిత్వంతో న్యాయం సత్వరం దక్కుతుంది. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సేవలను తెలుసుకొని సహాయం పొందవచ్చు .మీకోసమే అథారిటీ అన్నది గుర్తుంచుకోండి.

మరిన్ని వివరాలకు tslsa.telangana.gov.in  వెబ్ సైట్  సందర్శించవచ్చు.

No comments:

Post a Comment

ఉచిత డిజిటల్ సహకార కోర్సులు

 తెలుగు తో సహా 8 భాషలలో సహకార డిజిటల్ వీడియో కోర్సులు.160 కి పైగా కోర్సులను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర సహకార శాఖ.. సహకార రంగానికి సంబంధించి...