Friday, 8 May 2026

రెడ్డీస్ ఫౌండేషన్ వారి ఉచిత మట్టి పరీక్షలు

 వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి పరీక్షల కార్యక్రమం కొనసాగుతోంది. 

ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్గల్ మండలంలో కారేపల్లి గ్రామంలో స్థానిక రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ రైతులు తమ పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం సమర్పించాలని సూచించారు.

ఈ పరీక్షల ద్వారా మట్టిలోని ముఖ్య పోషకాలైన నత్రజని పొటాషియం ఫాస్ఫరస్ లతోపాటు సూక్ష్మ పోషకాల స్థాయిని శాస్త్రీయంగా విశ్లేషించి, పంటలకు తగిన ఎరువుల వినియోగంపై మార్గదర్శకాలు అందిస్తారని తెలిపారు. అధిక ఎరువుల వినియోగం వల్ల మట్టి సారం తగ్గుతున్న నేపథ్యంలో సరైన మట్టి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు దిగుబడులు పెంచుకోవచ్చని నిపుణులు వివరించారు.

అలాగే భూమికి అనుకూలమైన పంటల ఎంపిక, భూమి సంరక్షణకు అవసరమైన సూచనలు కూడా రైతులకు అందించబడతాయని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పొలాల భూసారాన్ని పెంచుకోవాలని కోరారు.

మరిన్ని వివరాల కోసం కమ్యూనిటీ ఫెసిలిటేటర్ నక్క హరీష్ ను 8008768238 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

No comments:

Post a Comment

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...