సోనూ సూద్ ఉచిత అంబులెన్స్ ల పంపిణీ, ఉచిత ఆటోల పంపిణీ, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులలో ఉచిత నిత్యాన్నదానం.
అంబులెన్స్ ని స్వచ్ఛందంగా ప్రధానం చేయడం అంటే ప్రాణాలను రక్షించడం లాంటిదేనని నటుడు సోనుసూదన్నారు. ఆదివారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద సోను సూద్ మరియు మాల్యవీ కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు" ఉచితంగా ఆటోలను "పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి ,అమ్మడవాకుల గ్రామాలకు ఉచితంగా అంబులెన్స్ ,నగరంలోని దమ్మాయిగూడ, చిలుకానగర్ ప్రాంతాల నిరుపేద ఆటో కార్మికులకు ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన అంబులెన్స్ను స్వయంగా నడిపి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ సంకిరెడ్డిపల్లి, మరియు అమ్మడవాకుల గ్రామ ప్రజలు సోనుసూద్" ఉచిత అంబులెన్స్ ను "వినియోగించుకొని సురక్షితంగా ఉండాలని కోరారు .జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఆటో కార్మికులకు "ఉచితంగా ఆటోలను" అందించడం అంటే కుటుంబాలను నిలబెట్టడం వంటిదని సొసైటీ వ్యవస్థాపకులు కొండ కృష్ణమ్మను అభినందించారు సోనూ సూద్. కొండ కృష్ణమ్మ మాట్లాడుతూ 2004లో ప్రారంభించిన ఈ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికీ గాంధీ, నిలోఫర్ ఆసుపత్రి లలో నిత్యాన్నదానం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment