రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ చేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించమని ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వల్ల ప్లాస్టిక్ తో నిర్మితమైన వస్తువులు వాడడం వల్ల ఆరోగ్యం పాడవాడమే కాకుండా భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నామని ఆయన తెలిపారు ఏ రూపంలో కూడా ప్లాస్టిక్ నిర్మితమైన వస్తువులు వాడకూడదని అలాగే మనకు రోజు వారి కార్యక్రమంలో ఉపయోగించే బస్తాలు వాడాలని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకుండా కాటన్ తో తయారు చేసిన బ్యాగులు వాడడం వల్ల పర్యావరణాన్ని రక్షించడమే కాదు మనతోపాటు జీవిస్తున్న పశువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు మనం ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటే ఇలాంటి కాటన్ బ్యాగులను ఉపయోగించి మనకు అవసరమైన కూరగాయలు ఇతర వస్తువులను గాని తీసుకెళ్లాలని ఆయన కోరారు ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని గంజిలో గల కూరగాయల సంతలో రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచితంగా కాటన్ బ్యాగులు వినియోగదారులకు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు తప్పకుండా అందరూ ఈ చిన్న మార్పుతో నిత్యజీవితంలో కాటన్ బ్యాగు ల వాడి భవిష్యత్ తరానికి ఆరోగ్యకరమైన పర్యావరణం అందించాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్ గిరీష్ కుమార్ గంగుల విజయ్ రమేష్ సుధాకర్ సంపత్ రాజశేఖర్ శిరీష్ కుమార్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
వదిరాజా భట్ @ ఓ శాట్..
వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...
-
భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పురం లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మేధా చారిటబుల్ ట్రస...
-
డిచ్పల్లి SBI ఉచిత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం .. 08461-295428 డిచ్ పల్లి లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో 2026-27 ఆర్...
-
నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి