రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ చేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించమని ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వల్ల ప్లాస్టిక్ తో నిర్మితమైన వస్తువులు వాడడం వల్ల ఆరోగ్యం పాడవాడమే కాకుండా భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నామని ఆయన తెలిపారు ఏ రూపంలో కూడా ప్లాస్టిక్ నిర్మితమైన వస్తువులు వాడకూడదని అలాగే మనకు రోజు వారి కార్యక్రమంలో ఉపయోగించే బస్తాలు వాడాలని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకుండా కాటన్ తో తయారు చేసిన బ్యాగులు వాడడం వల్ల పర్యావరణాన్ని రక్షించడమే కాదు మనతోపాటు జీవిస్తున్న పశువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు మనం ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటే ఇలాంటి కాటన్ బ్యాగులను ఉపయోగించి మనకు అవసరమైన కూరగాయలు ఇతర వస్తువులను గాని తీసుకెళ్లాలని ఆయన కోరారు ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని గంజిలో గల కూరగాయల సంతలో రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచితంగా కాటన్ బ్యాగులు వినియోగదారులకు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు తప్పకుండా అందరూ ఈ చిన్న మార్పుతో నిత్యజీవితంలో కాటన్ బ్యాగు ల వాడి భవిష్యత్ తరానికి ఆరోగ్యకరమైన పర్యావరణం అందించాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్ గిరీష్ కుమార్ గంగుల విజయ్ రమేష్ సుధాకర్ సంపత్ రాజశేఖర్ శిరీష్ కుమార్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
No comments:
Post a Comment