Wednesday, 8 April 2026

ఉచితంగా వాటర్ ఫిల్టర్ అందజేత

 బిచ్కుంద మాజీ సర్పంచ్ మైపతి సిద్ధిరాం గారి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మహిపతి శ్రీనివాస్ గణేష్ మందిరం ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ ఉచితంగా అందజేశారు. 

సుమారు 41 రూపాయల వేల విలువ చేసే వాటర్ ఫిల్టర్ ను మంగళవారం బిగించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు

ఆటోమొబైల్ కోర్సులో ఉచిత శిక్షణ

 ఈవీ టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ..


యాదాద్రి భువనగిరి జిల్లా ,భూదాన్ పోచంపల్లి మండలం, జలాల్పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభవృద్ధి శాఖ ఆధ్వర్యంలో, రెండు నెలల కాలవ్యవధి గల ఆటోమొబైల్ ఈవీ టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు .

 ఎస్ఎస్సి విద్యార్హత కలిగి ఉండాలని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటోలతో ఈ నెల 15వ తేదీ లోపు సంస్థలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

 ఎంపికైన అభ్యర్థులకు శిక్షణకాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పించబడుతుందని, శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పారు.

 ఇతర వివరాలకు 80 19626324 మరియు 9032399 530 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

నిరుపేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

 నిరుపేద ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సహాయం అందించే అవకాశం ఉన్నట్లు డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి  టి.నాగరాణి గారు పేర్కొన్నారు.

కామారెడ్డి కరగారాన్ని తనిఖీ చేసి ఖైదీలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఖైదీల మానవ హక్కుల పరిరక్షణ ,న్యాయ సహాయం పొందే హక్కు, కేసుల పురోగతి తదితర అంశాలపై ఆమె మాట్లాడారు. అనంతరం కారాగారా వంటగది, కార్యాలయము, ఖైదీల గదులను తనిఖీ చేశారు.

9 న ఉచిత జాబ్ మేళా @ బిచ్కుంద డిగ్రీ కళాశాల లో

 బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఐక్యూసీ మరియు టాస్క్ ల ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉచిత జాబ్ మేళా ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు డిగ్రీ కళాశాల వర్గాలు తెలిపాయి.

శ్రీ విజయ బయో ఫెర్టలైజర్స్ కంపెనీ తరఫున సేల్స్ ఎగ్జిక్యూటివ్, గ్రూప్ లీడర్, టీమ్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు.

దీనితోపాటు ముత్తూట్ ఫైనాన్స్ ఇంటర్ షిప్ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయని తెలిపారు. సెలెక్ట్ అయిన వారికి ఆరు నెలల అనంతరం జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయికి ప్రమోట్ చేస్తారని తెలిపారు. ఇంటర్ డిగ్రీ పాసైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9908785718, 970 11 555 12, 970 40 44 029 మరియు 9492 7955 24 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మహిళలకు ఉచిత ప్రదర్శన

 పార్థ గోపాల్ హీరో గా నటిస్తున్న, సూర్య జీ యాదవ్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం " డైమండ్ డెకాయిట్ "

ఈ నెల 10 తేదీన విడుదలవుతోంది.. మేఘన కథా నాయిక గా నటించింది.తాజాగా ట్రైలర్ ను వీక్షించి దర్శకుడు కే.రాఘవేంద్ర రావు చిత్ర బృందం ను అభినందించారు.

ఈ ప్రత్యేక సందర్భంలో చిత్ర బృందం మహిళా ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో మొదటి రోజు 4 షో లు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. పూర్తిగా కడప జిల్లాలోనే చిత్రీకరించిన తొలి చిత్రం మాదే కావడం మాకు గర్వ కారణం అన్నారు సూర్య.

మహిళలు అధిక సంఖ్యలో వచ్చి చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు..


Saturday, 4 April 2026

ఉచిత వైద్య శిబిరం @ రెంజల్

 ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెంజల్ జిల్లాపరిషత్ పాఠశాల లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నాయకుడు నల్ల నవీన్ కుమార్ తెలిపారు.

 రెంజల్ మండలం, పరిసర ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇట్టి వైద్య శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని ,ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.

 ఇట్టి మెగా వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ,మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. శుక్రవారం నాడు ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు .

ఈ కార్యక్రమంలో కాలేవార్ సంజీవ్, సాయి ప్రకాష్, సాయి కమార్ ,సంజయ్, గంగరాజు, ప్రకాశ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

14 న ఉచిత మెగా రక్త దాన శిబిరం..

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట తెలిపారు. కామారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు .శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు.

కామారెడ్డి లోని కర్షక్ బీఈడీ కళాశాల లో కామారెడ్డి రక్త దాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి సహకారంతో  తలస్సేమియ  వ్యాధి గ్రస్తులను ఆదుకునేందుకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 కార్యక్రమ సమన్వయకర్త బాలు, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, ప్రతినిధులు సంఘయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...