Saturday, 6 June 2026

మరోసారి 300 మందికి ఉచిత వీసాలు

 యూఏఈ లోని ADNH, స్థానిక GTM సంస్థల ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ మేళా.. జూన్ 12 న సిరిసిల్ల, జగిత్యాలల్లో,13 న నిజామాబాద్, ఆర్మూర్ లలో ఇంటర్వ్యూ ల నిర్వహణ.

యూఏఈ లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు మరోసారి ఉచిత వీసాలను ఇప్పించేందుకు యూఏఈ కి చెందిన ADNH, మన దేశానికి చెందిన GTM సంస్థలు ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ మెంట్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.క్లీనింగ్ విభాగంలో 300 మందికి ఉచిత వీసాలు ఇచ్చేందుకు ఈ నెల 12 తేదీ న సిరిసిల్ల, జగిత్యాలల్లో,13 న నిజామాబాద్ ఆర్మూర్ లలో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.21 ఏళ్ల వయసు నిండి 40 సంవత్సరాలలోపు వారు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు.

ఎంపికైన వారికి "ఉచితంగా వీసాలు "ఇచ్చి విమానం ఛార్జీలను సైతం కంపెనీ యే భరించనుంది. భారత కరెన్సీలో నెలకు 24 వేల రూపాయలు వేతనం చెల్లిస్తూ,నివాసం,భోజనం సదుపాయాలను ADNH కంపెనీ కల్పిస్తుంది.

వివరాల కోసం .. క్రింది ఫోన్ నెంబర్లలో సంప్రదించాలి.

సిరిసిల్ల 83320 17122, జగిత్యాల 83320 42299, నిజామాబాద్ 86868 60999 , ఆర్మూర్ 83320 13999 నంబర్ లలో సంప్రదించాలని తెలిపారు.

ఈ సందర్భంగా GTM సంస్థ చైర్మన్ సతీష్ రావు మాట్లాడుతూ ఉచిత వీసాలు అందించే అవకాశం తమకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వలస వెళ్ళే వారిపై నయాపైసా భారం పడకుండా అన్ని వసతులు ఉచితంగా కల్పించడం తమ ప్రత్యేకత అని అన్నారు.నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..

Friday, 5 June 2026

కీళ్ల ఆరోగ్యంపై ఉచిత పుస్తకం

 


మారిన జీవనశైలి శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో కూడా కీళ్ల సమస్యలు పెరుగుతున్నాయి వీటి పట్ల ఒక మంచి అవగాహన అందించే ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒక కీలకమైన ప్రజారోగ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు.

"ది హ్యూమన్ బోన్ జాయింట్స్ ఎక్స్ ప్లెయిన్డ్ "అనే పేరుతో రూపొందించిన ఈ ఉచిత పుస్తకాన్ని బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్స్ లో గురు వారం విడుదల చేశారు. స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. నీలం వి రమణారెడ్డి 25 సంవత్సరాల సుదీర్ఘ క్లినికల్ , రోబోటిక్ అనుభవంతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఆయన చికిత్స ద్వారా నొప్పుల నుండి విముక్తి పొంది తిరిగి సాధారణ జీవితం గడుపుతున్న ముగ్గురు లబ్ధిదారులు అయిన రోగులే ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉచిత పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం..

కీళ్ల కండరాల పని తీరును , కీళ్లు ఎందుకు శబ్దాలు చేస్తాయనే విషయాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.

బరువు నియంత్రణ,ఒమేగా 3 , ఆహార నియమాలు, కూర్చునే పద్ధతులు, మరియు ఈత,సైక్లింగ్ వంటి వ్యాయామాల గురించి నిపుణులు సలహాలు అందించారు. వేళ్ళు తిరగడం వల్ల ఆర్థరైటిస్ రాదనే నిజాలను స్పష్టం చేస్తూ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల మన్నిక పై ఉన్న భయాలను తొలగించారు..

రోబోటిక్ శస్త్ర చికిత్సలు, వేగంగా కోలుకోవడంలో కృత్రిమ మేధ పాత్రను వివరించారు.జీవించడం అంటే కదలడం..మీరు ఎప్పటికీ చేయించుకోవాల్సిన అవసరం రాని శస్త్ర చికిత్స యే ఎల్లప్పుడూ అత్యుత్తమమైనది అని డా రమణా రెడ్డి పేర్కొన్నారు.

Tuesday, 2 June 2026

ఆత్మ రక్షణ విద్యల్లో. ఉచిత శిక్షణ

 కరాటే, కర్రసాము, యోగా.. ఉచిత శిక్షణ 



పిల్లలు సెలవులను వృధా చేయకుండా ఆత్మ రక్షణకు తోడ్పడేలా బాన్సువాడ మడలంలో గోజే వేద్ ఆర్యన్ అనే యువకుడు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాడు. స్థానిక ఆర్య సమాజ్ ప్రాంగణంలో కరాటే, కర్ర సాము, యోగ పై శిక్షణ ఇస్తున్నారు. తొలిత 12 మంది మాత్రమే రాగా ప్రస్తుతం 40 మంది చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. ఆర్య సమాజ్ ప్రాంగణంలో కరాటే మాస్టర్ గోజే  వేద్ ఆర్యన్( బ్లాక్ బెల్ట్ )ఆధ్వర్యంలో కర్రసాము, కరాటే ,యోగ పై ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లల ఆసక్తికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడు కావడంతో శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది.




Sunday, 31 May 2026

హైదరాబాద్ లో ఉచిత ఫిజియోథెరపీ చికిత్స

 


చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల  నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వాత కదల్లేని వారికి సంజీవనిలాంటిది ఫిజియోథెరపీ చికిత్స. చాలా వ్యాధులలో అవసరమయ్యే ఫిజియోథెరపీ ని క్రమం తప్పకుండా రోగులకు అందజేస్తే రోగాలు పెరగకుండా వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంది.ఐతే చాలా మందికి ఈ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల,చికిత్స అందుబాటులో లేకపోవడం వల్ల,ఖర్చు ఎక్కువగా ఉండడం లాంటి కారణాలతో ఫిజియోథెరపీ కి దూరంగా ఉంటుంటారు.అలా రోగాలు తగ్గకపోవడం ,సమస్యలు పెరగడం జరుగుతుంటాయి.

అందుబాటులో ఆధునిక మందులు ఎన్ని ఉన్నా,కొన్నింటికి ఫిజియోథెరపీ చికిత్స తప్పనిసరి.కానీ ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న పని.ఐతే పేదలకు ఉపయోగపడే ఉద్దేశం తో ఈ ఖరీదైన సేవలను ఉచితంగా అందిస్తోంది ఒక స్వచ్ఛంద సంస్థ.

కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ కు చెందిన కొలసాని హరీష్ అనే వ్యక్తి చికాగోలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా స్థిర పడ్డారు. మంచి జీతంతో జీవితం విలాస వంతంగా గడుస్తున్నప్పటికీ సంతృప్తి చెందలేదు. తను పుట్టిన మాతృ భూమికి ఏదైనా చేయాలని తపించాడు. ఆ తపన లో నుండి పుట్టినదే ఈ ఉచిత ఫిజియోథెరపీ అందించాలనే ఆలోచన.అలా 2012 లో " ఎన్ ఆర్ ఐ సేవా ఫౌండేషన్ "అనే ఎన్జీవో ను స్థాపించారు ఆయన.

మొదట మురికి వాడల్లో వైద్య శిబిరాలు నిర్వహించాడు.మంచానికి పరిమితమైన వారికి" మొబైల్ అంబులెన్స్ " ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో పేదల దీన స్థితిని, ఆర్థిక ఇబ్బందులను గమనించాడు.వారికి ఫిజియోథెరపీ చికిత్స ను పెద్ద ఎత్తున అందించాలని సంకల్పించాడు. ఈ విషయంలో తన సన్నిహితులతో సంప్రదిస్తే ..ఇప్పటికే చాలా చేస్తున్నావు, ఇది అవసరమా అని నిరాశకు గురి చేశారు వారు.

కానీ ప్రసాద్ గారు వెనుకడుగు వేయకుండా 2013లో వివేకానంద నగర్ లో ఒక ఫిజియోథెరపీ కేంద్రాన్ని ప్రారంభించారు. డ్రైనీ డీలింగ్, అల్ట్రా సౌండ్,టెన్స్, ఇంటరా వెర్షన్ ఫెరెన్షియల్ థెరపీ, మజిల్ స్టిమ్యులేటర్,ట్రాక్షన్ పారాఫిన్ వ్యాక్స్, ఐ ఆర్ ఆర్ ల్యాంప్, ఫిజియో బాల్, ల్యాడర్ వంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచాడు. కార్పొరేట్ కు ధీటుగా సేవలు అందిస్తుండడంతో సమాజం నుంచి మంచి స్పందన లభించింది.2017 లో మోతీ నగర్ లో మరో కేంద్రాన్ని స్థాపించాడు. కాళ్ళ నొప్పులు, వేళ్ళ నొప్పులు అంటూ వచ్చిన వారిని ఎవరినీ ఊరికే వెనక్కి పంపించరు.రోగులు ఎక్కడి వారైనా, ప్రిస్క్రిషన్ రాసింది ప్రభుత్వ వైద్యుడా, ప్రైవేట్ వైద్యుడా అని చూడకుండా.. ప్రిస్క్రిప్షన్ ఉంటే చాలు , కేంద్రంలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు.సమస్యను బట్టి ఎన్ని రోజులైన ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఈ రెండు కేంద్రాలకు కలిపి ప్రతి రోజూ దాదాపు 250 నుండి 300 వరకు రోగులు వస్తుంటారు. హైద్రాబాద్ నుండే కాకుండా , రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల నుంచి రోగులు వరుస కడుతున్నారు.

తన తల్లికి అనారోగ్యంతో ఫిజియోథెరపీ చికిత్స అందించడంలో ఎదురైన ఇబ్బందులను గమనించి, ఫిజియోథెరపీ చికిత్స ప్రాధాన్యత గుర్తించి ఈ ఎన్జీవో స్థాపించినట్లు హరీష్ తెలిపారు.ఇప్పటివరకు 14 లక్షలకు పైగా రోగులకు చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు.ఇందుకోసం నెలకు దాదాపు 2 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉచిత కుట్టు మిషన్లు పంపిణి

 


నిజామాబాద్ నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో వెనుకబడిన మహిళల సాధికారత కొరకు స్థానిక అభ్యాస పాఠశాలలో రోటరీ ఆసరా కార్యక్రమం ద్వారా ఉచితంగా 60 కుట్టుమిషన్లను అలాగే వీటితో పాటు 50 గ్యాస్ ఇస్త్రీ పెట్టెలు అందజేశారు. వికలాంగుల కోసం ఐదుగురికి ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగిందని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహ రావు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమందరం ఒక మహత్తర సేవ కార్యక్రమానికి సాక్షులుగా నిలుస్తున్నామని ,ఆసరా పేరుతో నిర్వహిస్తున్న ఈ మెగా సర్వీస్ ఈవెంట్ ద్వారా సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు 60 కుట్టు యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .ఇది ఒక సహాయం మాత్రమే కాదు అనేక కుటుంబాలకు ఆత్మవిశ్వాసాన్ని ఉపాధిని మంచి భవిష్యత్తును అందించే ఒక గొప్ప ప్రయత్నం తెలిపారు. మహిళా సాధికారత అనేది సమాజాభివృద్ధికి మూల స్తంభం అని పేర్కొన్నారు. మహిళ ఆర్థికంగా బలపడితే వారి కుటుంబం బలపడుతుందని దానితో పాటు సమాజం అభివృద్ధి చెందు తుందని ,ఈ ఆలోచనలతో ముందుకు సాగుతున్న రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సభ్యులందరూ అభినందనీయులు తెలిపారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ వి రాంప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్ ఐ డి 3150, గౌరవ అతిథులుగా ఆర్టీవో కే రాజేంద్ర కుమార్ నిజామాబాద్ పి డి జి రమేష్ వంగాల ,రొటేరియన్ హరిప్రసాద్, రొటేరియన్ కె ఎస్ ఆర్  ప్రసాద్ ,రొటేరియన్ జైపాల్ రెడ్డి పాల్గొనగా ,ప్రాజెక్టు చైర్మన్గా రొటేరియన్ డాక్టర్ పి విష్ణు బాబు, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ రొటీరియల్ రంజిత్ సింగ్ ఠాకూర్  పాల్గొన్నారు అని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు మరియు రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ అధ్యక్షులు కళ్యాణ్ చక్రవర్తి సంగులూరు లు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సెక్రెటరీ లక్ష్మీ విసిరెడ్డి ,రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సెక్రటరీ గంజి రమేష్, కోశాధికారి పాల్తి రచిత్ కుమార్ ,రొటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బీబీపేటలో ఉచిత వైద్య శిబిరం



 కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ ఘనపూర్ మరియు మేడ్చల్ వారి సౌజన్యంతో శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య శిబిరం విజయవంతం అయ్యిందని సర్పంచ్ సాధ్విక, ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ ,పాలకవర్గ సభ్యులు తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా మెడిసిటీ హాస్పిటల్ ఘనపూర్ మరియు మేడ్చల్  వైద్యులు వెంకటాద్రి ,రాకేష్ ,రాఘవేంద్ర ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరానికి హాజరైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడంతోపాటు కంటి పరీక్షలు , చెవి ముక్కు గొంతు, వరిబీజం ,బీజ కుట్టు, గడ్డలు , కంతులు థైరాయిడ్ గడ్డలు,  గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబాన్నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళనొప్పులు, నడుము నొప్పులు, నరాల సమస్యలు,  కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు ప్రమాదంలో వేసిన రాడ్స్ తీయడంతో పాటు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా వైద్యం అందిస్తాం అని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 104 మంది రోగులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారని 60 మందికి వివిధ రకాల శాస్త్ర చికిత్సల అవసరమని గుర్తించామని తెలిపారు .ఆదివారం బీబీపేట పంచాయతీ ఆవరణలో మెడిసిటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్న రోగులు ఉదయం 8 గంటలకు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని ఉచిత బస్సులో మెడిసిటి హాస్పిటల్ కు తీసుకు వెళ్లి శస్త్ర చికిత్సలతో పాటు " మందులను సైతం ఉచితంగా" అందజేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాధ్విక,  ఉప సర్పంచ్ ప్రశాంత్ తో పాటు పాలకవర్గ సభ్యులు ,పంచాయతీ కార్యదర్శి రమేష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మెడిసిటి హాస్పిటల్ వైద్యులు వెంకటాద్రి ,రాకేష్ ,రాఘవేంద్ర తో పాటు సిబ్బంది, రోగులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ముత్తూట్ ఫైనాన్స్ ఉచిత వైద్య శిబిరం

 


ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని భీముగల్ మున్సిపల్ చైర్మన్ నాగమణి అన్నారు. శనివారం భీంగల్ కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చైర్మన్ ప్రారంభించారు. శిబిరం రీజినల్ నిజామాబాద్ జిల్లా మేనేజర్ బొమ్మ మహేష్ బాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం ప్రజలకు ఉచిత సేవ చేయడం మంచి కార్యక్రమం అన్నారు. పట్టణ ప్రజలకు ఉచిత వైద్య శిబిరంతో పాటు 150 మందికి ఏడాదికి సరిపడా మందులను ఉచితంగా పంపిణీ చేశారు దళిత శిబిరం ఏర్పాటు చేసిన ఫైనాన్సువారికి పట్టణ ప్రజల తరఫున చైర్మన్ మరియు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతోటి ఫైనాన్స్ వారు ఆధ్వర్యంలో చైర్మన్ దంపతులకు శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్, హరి నారాయణ, ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ క్లస్టర్ మేనేజర్ శ్రీకాంత్, మార్కెటింగ్ మేనేజర్ రఘు, బ్రాంచ్ మేనేజర్ బండి మహేష్ సిబ్బంది వినయ్ ,విగ్నేష్ , వర్ష తదితరులు పాల్గొన్నారు.



మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...