కామారెడ్డి జిల్లా లోని నిరుద్యోగ యువతి యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 18 తేదీన ఉచిత జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనీ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ కంపెనీ అయిన గూగుల్ పే లో ఉద్యోగాలు ఉన్నాయన్నారు.18-35 ఏళ్ల వయసు ఉన్న యువతీ యువకులు కామారెడ్డి కలెక్టరేట్ లోని రూమ్ నంబర్ 121 లో ఉదయం 10.30 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మౌఖిక పరీక్షలకు హాజరు కావాలని కోరారు.
అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికెట్ ల నకలు తీసుకొని రావాలని సూచించారు.
No comments:
Post a Comment