మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 18 తేదీ న ఉచిత జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ హిమజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. MSN కెమికల్ కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో జాబ్ మేళా కొనసాగుతుందని ఆమె చెప్పారు.
ఇంటర్ MPC,ఇంటర్ BI PC,ఒకేషనల్ MLT కోర్సులు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
కళాశాల లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత జాబ్ మేళా కొనసాగుతుందని ఆమె చెప్పారు.విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.
17 నుండి 21 ఏళ్ల వయసు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంపెనీ ఆకర్షణీయమైన వేతనం చెల్లిస్తుందని ఆమె తెలిపారు.
No comments:
Post a Comment