మెదక్ జిల్లాలో ని యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించడం కోసం ఉచిత మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఏప్రిల్ 2 వ తేదీన మెదక్ ప్రైవేట్ ఐటిఐ ప్రాంగణంలో సబ్ స్టేషన్ ఎదురుగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1-30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైద్రాబాద్ అపోలో ఫార్మసీ లో పని చేయుటకు డి. ఫార్మసీ, బి ఫార్మసీ , ఎం ఫార్మసీ అర్హత ఉన్న వారు అర్హులని అన్నారు.వయసు 18 నుండి 35 మధ్య ఉండాలని ,జీతం 20 వేలవరకు లభిస్తుందని తెలిపారు.25 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు కలవన్నారు.17 వేల వరకు జీతంతో 20 ట్రైనీ ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు.
టెన్త్,ఇంటర్,డిగ్రీ అర్హతలతో 25 ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..
బీబీఏ, బీఎస్సీ కెమిస్ట్రీ,న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, అర్హతలతో 5 ప్రొడక్ట్ అడ్వైజర్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..
టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు ..12 వేల వరకు జీతంతో..
ఆసక్తి,అర్హతలు గల వారు,అనుభవం, ఫ్రెషర్స్ కూడా తగిన విద్యార్హతల సర్టిఫికెట్లు తీసుకొని జాబ్ మేళా కు రావాలని సూచించారు.
మిగతా వివరాలకు 8247656356 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
No comments:
Post a Comment