Wednesday, 8 April 2026

నేడు పెద్ద మల్లారెడ్డి లో వైద్య శిబిరం

 భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో బుధవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆర్వీఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సర్పంచ్ సాయ గౌడ్ ,ఉప సర్పంచ్ చైతన్య మంగళవారం తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరంలో ఆర్విఎం ఆసుపత్రి వైద్యులు వివిధ రకాల రోగాలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తారని అన్నారు. 

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శాస్త్ర చికిత్సలు ,ఇతర మెరుగైన వైద్యం కావాల్సిన వారిని గురువారం ప్రత్యేక వాహనంలో ఆర్విఎం ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచిత వైద్యం అందిస్తారని తెలిపారు.


No comments:

Post a Comment

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...