భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో బుధవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆర్వీఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సర్పంచ్ సాయ గౌడ్ ,ఉప సర్పంచ్ చైతన్య మంగళవారం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరంలో ఆర్విఎం ఆసుపత్రి వైద్యులు వివిధ రకాల రోగాలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తారని అన్నారు.
ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శాస్త్ర చికిత్సలు ,ఇతర మెరుగైన వైద్యం కావాల్సిన వారిని గురువారం ప్రత్యేక వాహనంలో ఆర్విఎం ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచిత వైద్యం అందిస్తారని తెలిపారు.
No comments:
Post a Comment