కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోఎస్ కాలనీలో ఈ నెల 10వ తేదీన ఉచిత మెగా ఆయుష్ ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు 14వ వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి హర్షిత తెలిపారు .ప్రజా పాలనా, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయుష్ దినోత్సవం వేడుకలు ఎన్జీవోఎస్ కాలనీలో ఆయుష్ కార్యాలయం ఆవరణలో ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు .
ఈ సందర్భంగా హోమియోపతి ,ఆయుర్వేదం ,యునాని పరీక్షలు ఉచితంగా జరపనున్నట్లు తెలిపారు. ఉదయం 6:30 నుండి 7 గంటల 30 నిమిషాల వరకు యోగా నిర్వహణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కామారెడ్డి పట్టణ ప్రజలు ,పరిసర ప్రాంతాల ప్రజలు, 14వ వార్డు ప్రజలు హోమియోపతి ,యునాని, ఆయుర్వేద పరీక్షలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య అధికారులు హాజరవుతారని తెలిపారు .
ఈ కార్యక్రమంలో హోమియోపతి, ఆయుర్వేద, యునాని యోగ డాక్టర్స్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ జునైద్ బేగం, డాక్టర్ విజయ, డాక్టర్ దేవయ్య, ఫార్మసిస్ట్ కిషోర్ ,యోగ మాస్టర్ బాల్ లింగం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment