ఐదు నుంచి 17 ఏళ్ల వయసు గల వారికి మొదటిసారి ఆధార్ కార్డులో వివరాలను ఆధార్ కేంద్రాలలో సవరణ చేసుకుంటే ఎటువంటి రుసుము చెల్లించే అవసరం లేదని UIDAI హైదరాబాద్ రీజినల్ అధికారులు తెలిపారు.
ఐదేళ్లు నిండిన తర్వాత చేసే సవరణలో పిల్లల బయోమెట్రిక్, ఐరిస్ తీసుకుంటారని తెలిపారు. సాధారణంగా ఐదు నుంచి ఏడు ఏళ్లు మరియు 15 నుంచి 17 ఏళ్లు మధ్య వయసు గల వారికి మాత్రమే నమోదు కేంద్రాలలో మొదటిసారి వివరాల సవరణలను ఉచితంగా చేస్తారు .కానీ ఈసారి ఐదు నుంచి 17 ఏళ్ల వయసు గల వారందరికీ సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా సవరణ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఆధార్ కార్డులో చిరునామా తదితర వివరాలను ఆన్లైన్లో ఉచితంగా సవరించుకునే అవకాశం ఈ ఏడాది జూన్ 14 వరకు ఉండగా దీనిని మరొక ఏడాది పొడిగించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment