Monday, 25 May 2026

RIDO NGO ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం

 నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆర్ ఐ డి వో ఎన్ జి ఓ ఆధ్వర్యంలో శనివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది .దంత సమస్యలతో బాధపడుతున్న పలువురికి  " ఉచితంగా వైద్య పరీక్షలు " నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్ ముఖ్య అతిథి గా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. గౌతమ్ నగర్ కార్పొరేటర్ శివ చరణ్, నరేందర్ ,సీనియర్ న్యాయవాది మురళీధర్ రావు తదితరులు పాల్గొని నిర్వహకులను అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆర్ఐడిఓ ఎన్జీవో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అని అన్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు" ఉచిత వైద్య సేవలు " అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించే కార్యక్రమాలు" ఉచిత వైద్య శిబిరాలు " మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమం విజయానికి సహకరిస్తున్న వైద్యులు, అతిథులు మరియు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...