13, సెప్టెంబర్ 2026, ఆదివారం

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వాళ్ళకీ దూరంగా ఉన్నామన్న బాధని పోగొట్టుకోవడానికి నెలనెలా సంగీత కచేరీలు ఏర్పాటు చేసేవాడు. 2003 లో కర్ణాటక పశ్చిమ కోస్తాలోని కర్కల గ్రామంలో .. తుఫానుకి ఓ బడి కూలిపోవడం .. అక్కడి ప్రధానోపాధ్యాయుడు తమకు సాయం చేయమని అడగడం .. అతన్ని ఆలోచనలో పడేసింది. నేను మాత్రమే కాదు సిలికాన్ వ్యాలీకి వచ్చిన నాలాంటి తొలి తరం ఐటీ నిపుణులందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారమే.. అవి ఇలా కుప్ప కూలిపోతున్న దైన్యం మా గుండెల్ని పిండేసింది. అలా నా మిత్రులతో కలిసి కర్కలలోని బడిని పాతిక లక్షల రూపాయలతో బాగు చేసి ఇచ్చాం. అప్పటి నుంచి ఏటా ఒక పాఠశాలను బాగు చేయాలన్న లక్ష్యంతోనే నేనూ నా మిత్రులం 40 మందిమి కలిసి " ఒన్ స్కూల్ ఎట్ ఏ టైం " ( ఓ శాట్ ) ను స్థాపించాము.. అని గుర్తు చేసుకుంటాడు భట్. ఏడాదికి ఒక్క స్కూల్ నే బాగు చేయాలనుకుని మొదలైన సంస్థ ఇప్పుడు ఏటా 30 బడుల్ని తీర్చి దిద్దుతోంది. ఇప్పటిదాకా 150 బడుల్ని బాగు చేసింది. 

ఇలా పని చేస్తుంది..

ఈ మధ్య తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని ముత్తంగి గ్రామంలో ఓ జడ్పీ స్కూలును తీర్చి దిద్దేందుకోసం భూమి పూజ నిర్వహించింది ఓ శాట్ సంస్థ. అది జరుగుతున్న చోటకే క్వాల్కం కంపెనీలో ఓ ఐటీ నిపుణుడు వచ్చాడట . వచ్చీ రాగానే 10 లక్షల రూపాయలకు చెక్ ఇచ్చి .. ఈ పనులకి నా విరాళంగా ఉంచండి.. అని చెప్పాడట. తన పేరు ఎక్కడా బయటకు రాకూడదనీ చెప్పి వెళ్ళాడట. ఓ శాట్ సంస్థ పైన దాతలకు ఉన్న నమ్మకానికి ఇదో ఉదాహరణ. ఇలా ప్రతి ప్రాజెక్టుకి సాయపడే సాంకేతిక నిపుణులూ,ఎన్నారైల సాయంతోనే ఈ సంస్థ ఎన్నో గ్రామీణ బడుల్ని పునరుద్ధరిస్తోంది. ఆ సరస్వతి నిలయాలను ఎంతో మంది అజ్ఞాత దాతల నిస్వార్థ గుణానికీ, సేవా తత్పరతకు సాక్ష్యంగా నిలుపుతుంది.

12, సెప్టెంబర్ 2026, శనివారం

తెలుగు రాష్ట్రాల్లో సీ ఆర్ ఫౌండేషన్ సేవలు

 కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్ లో నూతన కార్యవర్గం సభ్యులతో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు కే నారాయణ మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాలు విస్తరిస్తామని తెలిపారు. కడప ,గుంటూరు ప్రాంతాల్లో భవనాలు, భూములు, విరాళంగా లభించాయని అక్కడ వృద్ధాశ్రమాలు నిర్మించే ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. కడపలోని వృద్ధాశ్రమం ఇప్పటికే ప్రారంభమైందని అలాగే అమరావతిలో ఏపీ ప్రభుత్వం మూడు ఎకరాల భూమిని కేటాయించడానికి అంగీకరించిందని స్థలం ఖరారు కావాల్సిందని వెల్లడించారు. 

సి ఆర్ పాలి క్లినిక్ గ్రామీణ ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరేలా టెలి మెడిసిన్ ద్వారా సేవలను విస్తరించాలని, పేదలు, అవసరమైన వారి కోసం డయాలసస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని  యోచిస్తోందన్నారు. ఎన్ ఆర్ ఆర్ రీసెర్చ్ సెంటర్ ద్వారా పాఠశాల పిల్లల కోసం నెలవారీ కార్యకలాపాలు నిర్వహించడంతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించినట్లు నారాయణ వివరించారు. సిఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో 22 ఏళ్లుగా ఉంటున్న సుబ్బలక్ష్మి తన మరణానంతరం ఫౌండేషన్కు 25 లక్షల రూపాయల విరాలం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సిఆర్ ఫౌండేషన్ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, కే రజని ,పిడికిటి సంధ్య కుమారి, ప్రధాన కార్యదర్శిగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు, కార్యదర్శులుగా కంభంపాటి అజయ్ కుమార్, మహమ్మద్ యూసఫ్, ఏ రామానాయుడు, బి చెన్నకేశవరావు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా 25 మందిని నియమించారు. 

ఉచితంగా.. నిపుణుల సలహా..

 ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకూ స్త్రీ పురుష భేదం లేకుండా ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలలో ఒత్తిళ్లకు లోనవుతూ జీవిస్తున్నారు. తీవ్ర నిరాశ, ఆందోళనలకు గురవుతున్నారు. పర్యవసానంగా ఆత్మహత్య ఆలోచనలు చేస్తూ, క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. 

ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నపుడు మనం చేయాల్సింది నిపుణుల సలహా తీసుకోవడమే.అదృష్టవశాత్తూ మనకు సహృదయులైన నిపుణులు ,ప్రభుత్వ వర్గాలు ఉచితంగా సలహా,మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ఆ వివరాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ,నలుగురికి తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాలు..

మీకు గానీ, మీకు తెలిసిన వారు గానీ తీవ్ర మానసిక ఒత్తిడి తో బాధపడుతుంటే , ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే , సాయం కోసం వెంటనే.. 

ప్రభుత్వ హెల్ప్ లైన్..1800-599-009,

టెలీ మానస్..14416,

రోషిణి ట్రస్ట్ .. 040-66202000,

వన్ లైఫ్ హెల్ప్ లైన్..7893078930,

నంబర్లలో సంప్రదించ వచ్చు. నిపుణుల సలహా ఉచితంగా లభిస్తుంది.

11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఉచిత వైద్యం@ అరుంధతి హాస్పిటల్.

 గండి మైసమ్మ , దుండిగల్ దారిలో ఉన్న అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ లో కేవలం టెస్టులే కాదు, రూపాయి ఖర్చు లేకుండా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తారు. 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 2023 లో ఈ హాస్పిటల్ ఏర్పాటైంది. ఖరీదైన సర్జరీలు ఉచితంగా చేస్తూ , రోగులకు రాయితీపై మందులు ఇస్తున్నారు. 

మల్కాజ్ గిరి MLA డా. మర్రి రాజశేఖర్ రెడ్డి తన తల్లి అరుంధతి పేరు మీద మర్రి రాజశేఖర్ ఫౌండేషన్ ద్వారా ఈ ఆసుపత్రి ని స్థాపించారు. NABH గుర్తింపు 350 కి పైగా బెడ్ లు సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో ఉచిత OPD తో పాటు రోగులకు ఉచితంగా బెడ్ లు మూడు పూటలా ఉచిత పోషకాహార భోజనం అందిస్తున్నారు. 

వీటితో పాటు ఎక్స్ రే, 24/7 సీటీ స్కాన్, ECG, అల్ట్రా సౌండ్ , రక్తం, మూత్ర పరీక్షలు వంటివన్నీ పూర్తిగా ఉచితంగా చేస్తారు. మేజర్ సర్జరీలు కూడా ఉచితంగా చేస్తారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల కోసం ఉచిత బస్సులు కూడా నడుపుతున్నారు. ఈ ప్రాంగణంలోనే మెడికల్ కాలేజీ కూడా నడుస్తుంది. 

మరిన్ని సమగ్ర వివరాలకు 8055667888 హెల్ప్ లైన్ లో సంప్రదించ వచ్చు. 

ఆర్ వీ ఎం చారిటబుల్ హాస్పిటల్

 సికింద్రాబాద్ నుండి సిద్దిపేట వెళ్ళే దారిలో , 

రాజీవ్ రహదారి,

శామీర్ పేట్ దాటిన తర్వాత,

వంటిమామిడి విలేజ్ ,

నుండి లక్ష్మక్క పల్లి గ్రామం దగ్గర ఈ హాస్పిటల్ ఉంది.దాదాపు ప్రతీ రోజూ 1200 నుండి 1500 వరకు రోగులు వస్తుంటారు. అన్ని రకాల చికిత్సలు ఉచితంగా చేస్తారు. ఉచిత భోజనం ఉంటుంది. సీఈఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, డా యాకయ్య గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుస్తుంది అని తెలిపారు. 

6, సెప్టెంబర్ 2026, ఆదివారం

డా రమేశ్ టెండూల్కర్ మెమోరియల్ ఫెలోషిప్

 యువర్ డాక్టర్లకు అండగా నిలవాలని క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నిర్ణయించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా యువ డాక్టర్లకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు .తన తండ్రి దివంగత ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ జ్ఞాపకార్థము" ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ మెమోరియల్ ఫెలోషిప్"  ను ప్రారంభించారు. దీని ద్వారా వైద్య రంగంలో పై చదువులు చదవాలనుకునే యువ వైద్యులకు సచిన్ టెండూల్కర్ ఆర్థిక సహాయం అందించనున్నారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ మరియు హెల్త్ కేర్ సంస్థ అయిన ఇంగా హెల్త్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఒక ఎండి చేసిన యువ డాక్టర్కు ఈ ఫెలోషిప్ కింద ఆర్థిక సహాయం లభిస్తుంది.

 ఎంపికైన వైద్యుడికి శ్రీనగర్లో క్లెఫ్ట్ అండ్ క్రానియోఫేషియల్ విభాగంలో ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ పొందే అవకాశం కల్పిస్తారు. ఈ ప్రోగ్రాం విజయవంతంగా పూర్తి చేసిన వారికి సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ నుంచి సర్టిఫికెట్ అందజేస్తారు. ఇది కేవలం ఒక ఫెలోషిప్ మాత్రమే కాదని, విద్యా అవకాశాలను సృష్టిస్తుందని ఆ అవకాశం ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగపడినప్పుడే దానికి నిజమైన అర్థం ఉంటుందని నాన్న బలంగా నమ్మేవారని సచిన్ చెప్పుకొచ్చారు. ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకే ఈ ప్రయత్నం అని తెలిపారు .ఈ సదుపాయం ద్వారా క్లిష్టమైన వైద్య విభాగాలలో యువ డాక్టర్లను ప్రోత్సహించడంతోపాటు, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలోని పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి అని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 




5, సెప్టెంబర్ 2026, శనివారం

ఎయిర్ టెల్ కస్టమర్లకు.. సూపర్ డ్యూలింగో ఫ్రీ

 లాంగ్వేజ్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ డ్యూలింగో 37.6 కోట్ల మంది ఎయిర్ టెల్ కస్టమర్లకు ఏడాదిపాటు తమ సేవలను ఉచితంగా ఇస్తామని తెలిపారు. మొబైల్, వైఫై, DTH వినియోగదారులు ఎయిర్ టెల్ యాప్ ద్వారా ఈ ప్రీమియం ఫీచర్ ను ఉచితంగా పొందవచ్చు. 

యాప్ ద్వారా ఏ ఐ ఆధారిత రియల్ టైమ్ స్పీకింగ్ ప్రాక్టీస్ ,అడ్వాన్స్డ్ లెర్నింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. హిందీ, బెంగాలీ, తెలుగు , తమిళం, ఉర్దూ తో పాటు తాజాగా పంజాబీ నుంచి ఇంగ్లీష్ నేర్చుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చారు. 40 కి పైగా భాషలతో పాటు మ్యాథ్స్, మ్యూజిక్, చెస్ నేర్చుకునేందుకు డ్యూలింగో ఉపయోగపడుతుంది. 

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...