Saturday, 9 May 2026

కరాటే శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోండి

 


కరాటే నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న ఐదు నుండి 14 ఏళ్లలోపు విద్యార్థులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్యాలయం వెనుక నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొని కరాటే నేర్చుకొని సద్వినియోగం చేసుకోవాలని కరాటే మాస్టర్ దీకొండ సాత్విక్ తెలిపారు యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరం జూన్ 7 వరకు ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి 7 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు పూర్తి వివరాలకు 88858 28460 ఫోన్ నెంబర్ ల సంప్రదించాలని కోరారు.




అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 



అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. బాన్స్వాడ మండలంలోని ఇబ్రహీంపేట్ లో ఏర్పాటు చసిన అంబలి కేంద్రము మరియు చలివేంద్రమును గ్రామస్తులు బాటసారిలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ పార్టీ నాయకుడు ఉద్దర రాజ్ కుమార్ అన్నారు శుక్రవారం ఆయన గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు తో కలిసి అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఉచిత అంబలి కేంద్రం మరియు చలివేంద్రమును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

 వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి..సిరికొండలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో విద్యార్థులకు నిర్వహించనున్న వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ జి రాజేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈనెల 11 నుంచి 25 వరకు నిర్వహించనున్న వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. ప్రభుత్వం వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మండలంలోని పి ఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను 15 రోజులపాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు అయిన వెల్లడించారు. విద్యార్థులకు క్రాఫ్ట్ ,కరాటే ,స్పోర్ట్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ డ్రాయింగ్, డాన్స్, సంగీతం, యోగ ,ఆటలు, నృత్యం, చిత్రలేఖనం, సృజనాత్మక అభివృద్ధి తదితర అంశాలలో శిక్షణ కొరకు శిక్షణ శిబిరాల నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు వేసవి శిక్షణ తరగతులకు హాజరు కావాలనుకునే విద్యార్థులు క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపల సూచించారు. 9290559309 మరియు 9490771237 నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు.

ఏర్కెట్ల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉచిత సమ్మర్ క్యాంప్ ఫోన్ నెంబర్..9848512511

బాల్కొండ లో ఉచిత మగ్గం వర్క్ పై శిక్షణ

 బాల్కొండ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వర్క్ పై మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు ఏపిఎం గగారం తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన శిక్షణ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్ మాట్లాడుతూ ఉచిత శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకొని నేర్చుకున్న నైపుణ్యంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పి ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. వ్యాపారానికి అవసరమైన రుణ సదుపాయాలు అందిస్తామని ఏపీఎం గంగారం చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహించి నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి మండల సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప శిక్షకురాలు కీర్తన సంతోషి సీసీల వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

Friday, 8 May 2026

రెడ్డీస్ ఫౌండేషన్ వారి ఉచిత మట్టి పరీక్షలు

 వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి పరీక్షల కార్యక్రమం కొనసాగుతోంది. 

ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్గల్ మండలంలో కారేపల్లి గ్రామంలో స్థానిక రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ రైతులు తమ పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం సమర్పించాలని సూచించారు.

ఈ పరీక్షల ద్వారా మట్టిలోని ముఖ్య పోషకాలైన నత్రజని పొటాషియం ఫాస్ఫరస్ లతోపాటు సూక్ష్మ పోషకాల స్థాయిని శాస్త్రీయంగా విశ్లేషించి, పంటలకు తగిన ఎరువుల వినియోగంపై మార్గదర్శకాలు అందిస్తారని తెలిపారు. అధిక ఎరువుల వినియోగం వల్ల మట్టి సారం తగ్గుతున్న నేపథ్యంలో సరైన మట్టి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు దిగుబడులు పెంచుకోవచ్చని నిపుణులు వివరించారు.

అలాగే భూమికి అనుకూలమైన పంటల ఎంపిక, భూమి సంరక్షణకు అవసరమైన సూచనలు కూడా రైతులకు అందించబడతాయని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పొలాల భూసారాన్ని పెంచుకోవాలని కోరారు.

మరిన్ని వివరాల కోసం కమ్యూనిటీ ఫెసిలిటేటర్ నక్క హరీష్ ను 8008768238 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

వైదిక గణితంలో ఉచిత శిక్షణ

 వైదిక గణితంలో ఉచిత శిక్షణ.. మరియు ఫ్రీ సమ్మర్ క్యాంప్..



కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ లో గల శ్లోక పాఠశాల బ్రాంచి 2 లో ఉచిత వైదిక గణిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల సీఈఓ జాలిగామ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం జరగనుంది అన్నారు. 9 నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు .శిబిరాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



సంస్థాన్ నారాయణపూర్ లో ఉచిత శిక్షణ

 సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగ, టైక్వాండో ,వాలీబాల్ వంటి క్రీడలలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి చక్కని అవకాశం లభిస్తుంది. యోగ వలన విద్యార్థులకు ఆరోగ్యం ఏకాగ్రత పెరుగుతాయని ,టైక్వాండో శిక్షణ ద్వారా తమ ఆత్మ రక్షణ లభిస్తుందని నిర్వాహకులు తెలుపుతున్నారు. 

శిక్షణ సమయం.. 

ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు.. మరల సాయంత్రం 5:00 నుండి 6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 6 గంటలకు వ్యాయామంలో మెలకువలు నేర్పి యోగాలో శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వాలీబాల్ శిక్షణ ఇస్తున్నారు .సాయంత్రం అరగంట పాటు టైక్వాండో ద్వారా ఆత్మ రక్షణలో మెలకువలు నేర్పి, అరగంట పాటు పెద్దలపట్ల నడుచుకోవాల్సిన పద్ధతులను, స్ఫూర్తి దాతల జీవిత విశేషాలను బోధిస్తున్నారు..

పౌష్టికాహారం.. 

శిక్షణ సమయంలో ప్రతిరోజు ఒక కోడిగుడ్డు, ఒక అరటి పండును అందజేస్తున్నారు. ప్రతిరోజు తీసుకోవలసిన ఆహారం గురించి చక్కని అవగాహన కల్పిస్తున్నారు. 

నాలుగు సంవత్సరాలుగా శిక్షణ..

 జిల్లా యువజన క్రీడా శాఖ, సంస్థాన్ నారాయణపూర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులను నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. బాలగోని యాదయ్య సలహాతో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు చిలువేరు సైదులు ఉచిత  శిక్షణ మొదలుపెట్టారు. గ్రామానికి చెందిన శికిల మెట్ల ప్రభాకర్, శ్రవణ్ ,బత్తుల మురళి, ధనుష్, యశ్వంత్ రవి ,సురేష్ సహకారంతో శిక్షణ కొనసాగుతుంది. విద్యార్థులకు గుర్రం కృష్ణ ,మల్లేష్ ,భరత్ అనే మాస్టర్లు టైక్వాండోలో శిక్షణ ఇస్తున్నారు. 

గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము వేసవి సెలవులలో విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలు కాకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచనతో యోగా వాలీబాల్ ఆత్మ రక్షణ కోసం టైక్వాండోస్ శిక్షణ ఇస్తున్నాము పెద్దల పట్ల సమాజం పట్ల నడుచుకోవాల్సిన పద్ధతులను తెలియజేస్తున్నాము భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులు నారాయణపురం నుండి తయారు కావాలన్నదే లక్ష్యం అని స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ చిలువేరు సైదులు అన్నారు.

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...