20, ఆగస్టు 2026, గురువారం

ఫ్లైబ్రరీ.. ఉచిత గ్రంథాలయం @ ఎయిర్ పోర్ట్

 విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత విమానం కోసం ఎదురు చూడడం కొందరికి బోర్ గ అనిపిస్తుంది. ఫోన్లో స్క్రోల్ చేస్తూ సమయం గడిపిన కొద్దిసేపటికి విసుగు వస్తుంది. అదే మంచి పుస్తకం చేతిలో ఉంటే.. చదవాలని ఉండి రోజువారి జీవితంలో సమయం దొరకని పుస్తకాన్ని ప్రశాంతంగా చదివే అవకాశం వస్తే, అంతకంటే ఆనందం మరొకటి ఉండదు అని చెప్పవచ్చు.

 ఈ ఆలోచనతోనే కొన్ని విమానాశ్రయాలలో ఫ్లైబ్రరీలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లైబ్రరీ అంటే" విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఉచిత గ్రంథాలయం". విమానం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు తమకు నచ్చిన పుస్తకాన్ని తీసుకొని చదవవచ్చు. విమానం వచ్చేసినా చదవడం పూర్తి కాకపోతే ఆ పుస్తకాన్ని వెంట తీసుకెళ్లి ప్రయాణంలో కూడా చదువుకోవచ్చు. అనంతరం వారు దిగిన విమానాశ్రయంలోని ఫ్లైబ్రరీలో దానిని ఇచ్చి వెళ్లిపోవచ్చు .

భువనేశ్వర్ లో మొదలైంది..

 ఈ తరహా ప్రయోగానికి భువనేశ్వర్ లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదిక అయింది. 2025 లో "టేక్ ఏ బుక్ " అనే నినాదంతో లైబ్రరీని ప్రారంభించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయంలో ఇంగ్లీష్, హిందీ, ఒడియా భాషలలో సుమారు 600 పుస్తకాలు అందుబాటులో ఉంచారు. బాలల పుస్తకాలు, నవలలు, మేగజైన్లు  తదితర విభాగాలకు చెందిన పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. డిపార్చర్ ,అరైవల్ ప్రాంతాలలో పుస్తకాల అరలని ఏర్పాటు చేశారు. ఇందులో పుస్తకాల నిర్వహణ ,అరలని సర్దడం వంటి పనులలో వాలంటీర్లు సహకరిస్తున్నారు. ఇక ఈ ఆలోచనకు ఇతర విమానాశ్రయాలలోనూ ఆదరణ లభిస్తోంది. తాజాగా ప్రయాగరాజ్ విమానాశ్రయంలోను ఫ్లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాలను విరాళంగాను ఇవ్వవచ్చు .. ఈ ఫ్లైబ్రరీల ఏర్పాటు కేవలం సమయాన్ని సద్వినియోగం చేయాలని ఆలోచనతో రూపుదిద్దుకున్న కార్యక్రమం. ప్రయాణికుల మీద నమ్మకం, సమాజ భాగస్వామ్యం పై ఆధారపడి పని చేస్తుంది. పుస్తకాలను తీసుకున్న వారు తిరిగి ఇచ్చే విషయంలో స్వీయ బాధ్యతతో వ్యవహరించాలి. ఈ ఫ్లైబ్రరీల కోసం పుస్తకాలను విరాళంగా కూడా ఇవ్వవచ్చు అని నిర్వాహకులు కోరుతున్నారు. 



19, ఆగస్టు 2026, బుధవారం

ప్రతి నెలా.. ఉచిత జాబ్ మేళా @ నిజామాబాద్

 నిరుద్యోగుల కోసం ఇక నుంచి" ప్రతి నెలా ఉచిత జాబ్ మేళా" నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ వేల్పుల విజేత తెలిపారు. గత నెల నిర్వహించిన మెగా జాబ్ మేళా లో 4620 మంది టామ్ కామ్ లో నమోదు కాగా 120 మంది జర్మనీ లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. 

వారందరూ జర్మనీ భాష నేర్చుకోవడానికి " ఫ్రీ కోచింగ్ సెంటర్" ను ఏర్పాటు చేశామని తెలిపారు.

నిజామాబాద్ నగరంలో మంగళ వారం 168 పోస్టులకు( నర్సులు,రిసెప్షనిస్ట్, ఫార్మసిస్ట్ , షోరూం మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ,మెకానిక్) ఉచిత  జాబ్ మేళా నిర్వహించగా 52 మంది సెలెక్ట్ అయ్యారని ,వారికి ప్రూండెన్స్ హాస్పిటల్, అపోలో ఫార్మసీ, మహీంద్రా షోరూం ల నుండి వచ్చిన ప్రతినిధులు జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అపాయింట్మెంట్ లెటర్స్ అందచేశారని తెలిపారు. 

ఇకనుంచి ప్రతి నెలా నిరుద్యోగుల కోసం " ఉచిత జాబ్ మేళా" నిర్వహించనున్నట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

18, ఆగస్టు 2026, మంగళవారం

కృత్రిమ మేధ నుండి.. కుట్లు అల్లికల వరకు.. ఉచిత శిక్షణ

 నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ శాఖలతో పాటు , స్వచ్ఛంద సంస్థలు, గురుకులాలు, బ్యాంకులు, ఏ టి సి లు తదితర ఎన్నో సంస్థలలో యువతకు ఉపాధి అవకాశాలు పొందేందుకు, ఉద్యోగాలు పొందేందుకు , ఉన్నత విద్య లో ప్రవేశం పొందేందుకు .. ప్రవేశ పరీక్ష లకు " ఉచిత శిక్షణ లు " అందుబాటు లోనికి వచ్చాయి.. 

జీవితంలో ఎదగాలి,ఏదైనా సాధించాలి అనే తపన ఉన్న విద్యార్థులే కాకుండా నిరుద్యోగ యువత కు,మహిళలకు,కార్మికులకు ఇవి ఎంతో సహాయకారిగా ఉంటున్నాయి. చదువు పై శ్రద్ధ, నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆసక్తి గలవారు ఉన్నత స్థాయి కి వెళ్లేందుకు ఈ ఉచిత శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయా సంస్థల నిర్వాహకులు పేర్కొంటారు..అలాంటి సంస్థల సంక్షిప్త వివరాలు ఇవి..

టాస్క్ లో నైపుణ్య అభివృద్ధి..

చదువుతో పాటు భవిష్యత్ లో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి " టాస్క్" శిక్షణలు ఉపయోగపడతాయి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వివిధ కోర్సులు చదవొచ్చు. ప్రవేశాలకు ఈ నెల 31 వరకు గడువు ఉంది. కంప్యూటర్ కోడింగ్, లాంగ్వేజెస్, ఏ ఐ టూల్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. 

ప్రైవేట్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ముఖాముఖి, బృంద చర్చ నైపుణ్యాలు నేర్పుతారు.

పూర్తి సమగ్ర వివరాలకు 91542 52588 , 7013675052 జిల్లా మేనేజర్ రఘుతేజ్ ను సంప్రదించవచ్చు.

భవన నిర్మాణ రంగంలో..

కార్మిక సంక్షేమ శాఖ, న్యాక్ ఆధ్వర్యంలో ప్లంబింగ్,శానిటేషన్,పెయింటింగ్,డెకొరేషన్, తాపీ మేస్త్రి, ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్ పనులపై 15 రోజుల పాటు నైపుణ్యాలు నేర్పుతారు.

పూర్తి సమగ్ర వివరాలకు 98663 50200,99597 73079 నిజామాబాద్, 97045 87655 భీమ్ గల్.. ఫోన్ నెంబర్ లలో సంప్రదించాలని సూచిస్తున్నారు.. 

స్వయం ఉపాధి కోసం భరోసా..

డిచ్ పల్లిలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 19-45 ఏళ్ల వయసు గల గ్రామీణ మహిళలు ,యువతకు స్వయం ఉపాధి కోర్సులు నేర్పిస్తున్నారు.

మగ్గం వర్క్స్, హోం నీడ్స్ తయారీ,ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్,సర్వీస్,రిటైల్, కుట్టు మిషన్,కుట్లు అల్లికల లో నైపుణ్యం పొందవచ్చు.

పూర్తి సమగ్ర వివరాలకు..08461-222428 నంబరులో సంప్రదించాలి.

నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు పొందేందుకు..

పదో తరగతి పాసైన నిరుద్యోగ యువత కు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవసరమైన శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము ను జిల్లాలోని 7  అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ( ఏ టీ సీ) లలో నేర్పిస్తున్నారు. 

ఇక్కడ అందించే కోర్సుల వివరాలు తెలుసుకునేందుకు నిజామాబాద్ లోని ప్రభుత్వ ఐటిఐ లో గానీ,94417 07536 నంబరును గానీ సంప్రదించవచ్చు. 

నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలకు..

నీట్, జేఈఈ మెయిన్స్ ఉన్నత విద్య పోటీ పరీక్షలకు ప్రైవేటులో శిక్షణ కు భారీగా ఖర్చు అవుతుంది.అందుకే జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, కేజీబీవీ సీ వో ఈ లలో వంద మంది విద్యార్థుల చొప్పున ఉచిత శిక్షణ ఇస్తున్నాయి.ఇటీవలే ఇంటర్ పాసైన వారికి లాంగ్ టర్మ్ శిక్షణ కు ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.సాంఘిక, బీసీ సంక్షేమ గురుకులాల ఆర్ సీ వో కార్యాలయాలలో సంప్రదించాలి.

బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఫౌండేషన్ శిక్షణ..

టీ జీ పీ ఎస్ సి గ్రూప్స్ తో పాటు బ్యాంకింగ్, ఆర్ ఆర్ బి , స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగార్థులకు .. నిజామాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ లో 125 రోజులపాటు ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇస్తున్నారు . ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు అర్హులు.

పూర్తి సమగ్ర వివరాలకు 08462-241055 నంబరులో సంప్రదించాలి.

ఇవే కాకుండా వ్యవసాయ, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో " రైతు శిక్షణ", "పశు వైద్యం","పాల ఉత్పత్తి"  పై శిక్షణ లు అందుబాటు లో ఉన్నాయి. 

ఉచిత "అర్జంట్ కేర్ సెంటర్" @ జగిత్యాల

 గ్రామీణ ప్రాంత ప్రజలకు" ఉచితంగా అత్యవసర వైద్య సేవలు"  అందించడమే ప్రధాన లక్ష్యంగా" శ్రీ సత్య సాయి సుజల స్రవంతి ట్రస్ట్"  ఆధ్వర్యంలో జగిత్యాల గ్రామీణ టీ ఆర్ నగర్, రాజారాం గ్రామం వద్ద ఏర్పాటుచేసిన" సాయి స్వస్థ షా హ్యాపీనెస్ అర్జెంట్ కేర్ సెంటర్" ను ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, మునిసిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి సోమవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల, మల్యాల నియోజకవర్గాల పరిధిలోని గ్రామీణ ప్రజలకు ఈ కేంద్రం ద్వారా" ఉచితంగా అత్యవసర వైద్య సేవలు"  అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు సకాలంలో వైద్యం అందించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలకు తోడుగా ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలను విరివిగా విస్తరింప చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు. 

17, ఆగస్టు 2026, సోమవారం

ఉచిత కరాటే శిక్షణ @ ఇబ్రహీం పేట్, బాన్సువాడ

 కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీం పేట్ గ్రామంలో చిన్నారులకు గ్రామీణ స్థాయిలో" ఉచితంగా కరాటే శిక్షణ శిబిరం"  ఆదివారం ప్రారంభించారు. 



ఈ సందర్భంగా కరాటే మాస్టర్ లు శివరాం, ఫణీందర్ గౌడ్ లు మాట్లాడుతూ .. "ప్రతి ఆదివారం" స్థానిక వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో కరాటే మాస్టర్ వినీల్ ఆధ్వర్యంలో ఉచితంగా కరాటే శిక్షణ నిర్వహించనున్నామని అన్నారు. 

చిన్నారుల్లో ఆత్మ విశ్వాసం, క్రమ శిక్షణ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంతో పాటుగా ఆత్మ రక్షణ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో శిక్షణ ప్రారంభించామన్నారు. ఈ అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఉచిత శిక్షణ @ ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్

 ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణంలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన "ఉచిత పోటీ పరీక్షల శిక్షణ శిబిరాన్ని"  తెలంగాణ ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం ఆదివారము ప్రారంభించారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు" మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ"  అందించనున్నామని ఆయన తెలిపారు .ఈ సమావేశంలో ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం మాట్లాడుతూ ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 2015 లో ప్రారంభించామని అప్పటినుండి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు, నకిరేకల్ పట్టణంలో "ఉద్దీపన పాఠశాల" ఏర్పాటు చేసి" ఉచిత విద్య"  అందిస్తున్నామని పేర్కొన్నారు. 

కరోనా సమయంలో కషాయ కేంద్రాలు, అవసరమైన కిట్ల పంపిణీ చేశామని, మృతుల అంత్యక్రియలలో కూడా దగ్గరుండి మానవతా సేవలు అందించామని గుర్తు చేశారు. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, నకిరేకల్ పట్టణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఉచిత శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతకు అండగా నిలిచి లక్ష్య సాధనకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.



 ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, సీనియర్ నాయకులు పూజర్ల శంభయ్య ,చామల శ్రీనివాస్, నాగులవంచ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ బెల్లి యాదయ్య, ఆర్సి రెడ్డి కోచింగ్ అధ్యాపకులు వేముల సైదులు, మండల పార్టీ అధ్యక్షుడు గాధగోని కొండయ్య, టౌన్ అధ్యక్షులు లింగాల వెంకన్న , ఉద్దీపన కోఆర్డినేటర్ చెరుకు సతీష్, మాజీ కౌన్సిలర్లు ,నాయకులు ,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

16, ఆగస్టు 2026, ఆదివారం

కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఉచిత సేవలు

 నిరుపేద విద్యార్థుల ముఖాలలో చిరునవ్వులు పూయిస్తూ వారి ఉన్నత చదువులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ ప్రణీత్ గ్రూప్ అధినేత నరేంద్ర కుమార్ కామరాజు ఆదర్శంగా నిలుస్తున్నారు. జీవితంలో రాణించాలంటే చదివే కీలకమని నమ్మిన వ్యక్తి ఆయన .ఆర్థిక సమస్యతో ఆ చదువు నిరుపేద విద్యార్థుల నుంచి దూరం కావద్దని తపన పడే మనిషి. అందుకే తన చిన్నప్పుడు మనకు ఉన్నంతలో ఇతరులకు సాయం చేయాలని నాయనమ్మ చెప్పిన మాటలు ఇప్పుడు అతని సేవా కార్యక్రమానికి ప్రేరణ నిస్తున్నాయి .ఇప్పటివరకు నగరంలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులకు స్పోర్ట్స్ షూస్, స్కూల్ బ్యాగులు ,వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. పదో తరగతిలో 500 మార్కులు దాటిన ఆయా  స్కూళ్లకు చెందిన 43 మంది విద్యార్థులకు తన నాయనమ్మ పేరు మీద ఏర్పాటు చేసిన" కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్"  ద్వారా ఒక్కొక్కరికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ మొత్తంగా 21 లక్షల రూపాయలు ప్రకటించారు. అయితే ఈ స్కాలర్షిప్ సహాయం ప్రతి ఏడాది కొనసాగనున్నది. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్న ప్రణీత గ్రూప్ అధినేత నరేంద్ర కుమార్ కామరాజు ట్రస్ట్ కార్యక్రమాల గురించి ఈ విధంగా వివరించారు. 



2007లో ప్రణీత్ గ్రూప్ కంపెనీ ఏర్పాటు చేసిన నరేంద్ర కుమార్ గారు అంచలంచలుగా సాగిన తన ప్రస్థానంలో వారి నాయనమ్మ గారు తరచూ చెప్పిన మాటలు తనను చాలా ప్రభావితం చేశాయన్నారు. తన తొలి జీతం మూడు వేల రూపాయలు వచ్చినప్పుడు కూడా అందులో 300 రూపాయలు సహాయం చేసే వాడిని .అన్నపూర్ణమ్మ ట్రస్ట్ తో స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా ఇప్పటివరకు 250 మంది విద్యార్థులను ఇంజనీరింగ్ ,ఎంబీఏ, ఎంసీఏ చదివించానని, ఇలా సహాయం అందుకున్న విద్యార్థులు చాలా గొప్ప స్థానాలలో ఉన్నారని.. ఒక విద్యార్థి అమెరికాలో స్థిరపడి తన ట్రస్ట్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని తనవంతు సహాయం అందించాడని తెలిపారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా టీచర్లు ఉండకుండా ఉన్న సమస్యతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులలో సాధ్యమైనంత వరకు సంబంధిత పాఠశాలలో మంచి టీచర్లను నియమించే బాధ్యత ట్రస్ట్ తరఫున తీసుకుంటున్నామని ఆయన తెలిపారు .వారికి ట్రస్ట్ జీతాలు చెల్లిస్తుందని ,చాలామంది హెచ్ఎంలు తమ పాఠశాలలో టీచర్లను నియమించే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు .అందుకే మేము సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని వారి సూచనల మేరకు టీచర్ల నియామకానికి ప్రణాళికలు వేశామన్నారు. ఒక వ్యక్తి చదువుకొని బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది .చదువు లేకున్న సాధించే వారు చాలామంది ఉన్నారు, కానీ చదువు ఆయుధం లాంటిదని నేను బలంగా నమ్ముతున్నాను. మహా అయితే 15 ఏళ్లు చదువుతాము, ఆ తర్వాత అంతా జీవిత పోరాటమే. అందుకే ఆ చదువు ఫౌండేషన్ బలంగా ఉంటే విద్యార్థులు గొప్పగా  రాణిస్తారు .

నాయనమ్మ ఆదర్శం..

 సాయం, సేవ చేయాలని ఆలోచన నేను మా నాయనమ్మ నుంచే నేర్చుకున్నాను. నాయనమ్మ పేరు అన్నపూర్ణమ్మ. ఆమెది తన వద్ద ఉన్నదాంట్లో కొంత సహాయం చేసే మనస్తత్వం. సహాయం చేయాలనే మనస్తత్వం ఉంటే డబ్బే కాదు ,ఏ రూపంలోనైనా సహాయం అందించగలను అని చెబుతుండేది. పది మందికి సహాయం చేసే ఆలోచనలు నాటుకు పోయేలా చిన్నప్పటి నుంచి నూరి పోసింది .ఏడో తరగతి వరకు నన్ను ఎత్తుకొని ముద్దాడేది. నీ గురించే కాదు నీ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించమని చెబుతూ ఉండేది. ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మా ట్రస్ట్ కార్య కలాపాలకు ప్రేరణ మా నాయనమ్మ .ఈ సేవలు మరింత విస్తృతంగా చేయాలని ఆలోచనతో ఉన్నాము.ఇందుకు తగ్గ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుంది ఆయన తెలిపారు.  

ఒక స్కూల్లో, ఒక కాలేజీలో చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చాక, మళ్లీ ఆ స్కూల్ ,కాలేజీలో అడుగుపెట్టిన వారు ఎంతమంది ఉంటారు? మనం ప్రతిదీ ప్రభుత్వం నుంచి పొందాము. మరి మనం ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను వినియోగించుకొని ఎదిగాము కదా.. మరి మనం ప్రభుత్వ పాఠశాలకు ఏం చేయగలుగుతున్నాము అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అంటారు నరేంద్ర కుమార్ కామరాజు .

తమ ట్రస్ట్ ను సంప్రదించాలి అనుకుంటే 7337252627 నెంబర్ కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. 



వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...