న్యాయ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఎవరి సలహాలు,సూచనలు తీసుకోవాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. న్యాయ వాదులను సంపాదించాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు న్యాయ పరమైన సలహాలు,సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం " టెలీ లా"విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా ఎలాంటి ఫీజు చెల్లించకుండానే హైకోర్టు న్యాయ వాదుల నుంచి " ఉచితంగా న్యాయ సలహాలు, సూచనలు మాతృ భాష లోనే పొందే అవకాశం ఉంటుంది.
అపాయింట్ మెంట్..
దరఖాస్తుదారుడు ముందుగా ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ మీ సేవా, కామన్ సర్వీస్, డిజిటల్ సేవా కేంద్రాల్లో ఏదైనా ఒక దానిని సంప్రదించాలి. హైకోర్టు లాయర్ లతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉచితంగా అపాయింట్మెంట్ నమోదు చేస్తారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన సమయానికే హై కోర్టు న్యాయవాది స్వయంగా దరఖాస్తుదారుడి ఫోన్ నెంబర్ కు కాల్ చేసి మాట్లాడతారు.
అందే సేవలు ఇవే..
వరకట్న వేధింపులు, లైంగిక నేరాలు, గృహ హింస,ఉపాధి,మహిళలు,పిల్లలు, వృద్ధుల మౌలిక హక్కులు, ప్రసూతి ప్రయోజనాలు, భూ తగాదాలు, వాహన చట్టాలు,FIR నమోదు, అరెస్ట్ చేసిన వ్యక్తిని నిర్బంధించడం, RTI, CAA, NRC, అట్రాసిటీ కేసులు, ఆస్తి గొడవలు, ప్రభుత్వ పథకాలు పొందడంలో అవరోధాలు తదితర సమస్యల గురించి న్యాయ వాదుల నుంచి "ఉచితంగా" సలహాలు,సూచనలు పొందవచ్చు.
No comments:
Post a Comment