తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అర్హులైన మైనారిటీ లకు వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ప్రస్తుతం పోలీస్ శాఖ లోని వివిధ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు MD యాకూబ్ పాషా తెలిపారు.
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.SI పోస్టులకు 50 మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 100 మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నామని ఆయన తెలిపారు.
పూర్తి సమగ్ర వివరాలకు..
85208 60785, 040-23236112, 90590 50062 నంబర్ లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి