Wednesday, 29 April 2026

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాలలో నాట్య ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సొంతంగా నాట్య శిక్షణ సంస్థను స్థాపించారు .ఆ సంస్థ ద్వారా వందలాది మంది చిన్నారులను ఉత్తమ కళాకారులుగా తీర్చి దిద్దు తున్నారు. 

వేసవి   సెలవులను వృధా చేయకుండా పేద విద్యార్థినలకు నాట్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు .

 నాట్య శిక్షణ ద్వారా పేరు తెచ్చుకున్న రవళి స్నాతకోత్ర స్థాయిలో గణితంలో బంగారు పతకం సాధించారు. తెలుగు విశ్వవిద్యాలయ  లలిత కళా పీఠంలో ఎంపీ ఎ పూర్తి చేశారు. ఇలా ఉన్నత విద్య అభ్యసించిన రవళి తాను చిన్నప్పటి నుంచి ఇష్టంగా నేర్చుకున్న శాస్త్రీయ నృత్య రంగంలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నేలకల్ రోడ్డులో సాయి రవళి సొంతంగా ..అందెల రవళి ..పేరిట నాట్య శిక్షణాలయాన్ని స్థాపించారు. ఆ సంస్థ ద్వారా అమ్మానాన్నలు, అమ్మమ్మ ప్రోత్సాహంతో చిన్నారులకు భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ నృత్యాన్ని నేర్పిస్తున్నారు .

శిష్యులతో ప్రదర్శనలు..

 రాష్ట్ర జాతీయ స్థాయి వేదికలపై రవళి తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించారు .ఇప్పటివరకు 300కు పైగా పిల్లలను ఉత్తమ నృత్య కారుణులుగా తీర్చిదిద్దారు. నాట్య మయూరి ,నాట్య విశారద.. కేంద్ర ప్రభుత్వం ద్వారా వారు ఉపకార వేతనాలు, బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకునేలా చేశారు .ఇటీవల దుబాయిలో జరిగిన నాట్య సమ్మేళనం కార్య శాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై అక్కడి భారతీయ పిల్లలకు నృత్యం పై ప్రత్యేక కార్యాశాల నిర్వహించారు. వచ్చే నెల 1 వ తేదీన కేరళలో జరిగే నాట్య సదస్సులో తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. తనకు నాట్యం ప్రాణమని ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా నృత్య శిక్షణ ఇస్తున్నానని సాయిరవళి  తెలిపారు.

Tuesday, 28 April 2026

పాలిటెక్నిక్ ఉచిత మెటీరియల్ పంపిణీ

 అక్షర కోచింగ్ విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. 

మద్నూర్ మండల కేంద్రంలో విజన్ జూనియర్ కళాశాలలో ఇటీవలే పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం అక్షర పాలిటెక్నిక్  కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పరీక్షకు అవసరమైన మెటీరియల్ను సంస్థ డైరెక్టర్ డాక్టర్ బాలు ఉచితంగా అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విద్యార్థులు సరైన ప్రణాళికా పరమైన అభ్యసనతోనే పాలిటెక్నిక్ లో సీటు సాధించడం జరుగుతుందని, దానికి కావాల్సన శిక్షణను అక్షర పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ లో అందజస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

ఉచిత వీసాలకు ఇంటర్వ్యూ మేళ

 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో క్లీనింగ్ విభాగంలో విస్తృతమైన ఉపాధి కల్పిస్తున్న ఏడీఎన్ హెచ, మరియు జిటిఎం సంస్థలు మరొకసారి ఉచిత వీసాలు జారీ చేయడానికి విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నాయి. ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపాధికి అవసరమైన మీసాలను ఉచితంగా జారీ చేస్తారు.

ఇప్పటివరకు తెలంగాణ జిల్లాల వలస కార్మికుల వారికి అవకాశం కల్పించిన ఈ సంస్థలు ఇప్పుడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ యువత కూడా అవకాశం కల్పించడానికి నిర్వహించాయి.

ఏప్రిల్ 30 , మే ఒకటవ తేదీన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఐదు చోట్ల ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. మన భారతీయ కరెన్సీలో నెలకు 24 వేల రూపాయల జీతంతో పాటు ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పిస్తాయి.

ఉచిత వేశారు కల్పి జారీ చేయడంతో పాటు ఎంపికైన వారిని యూఏఈ తరలించడానికి విమాన చార్జీలను కూడా ఈ సంస్థలే భరించనున్నాయి.

ఈ నెల 30న సిరిసిల్ల జగిత్యాల సికింద్రాబాద్ లలో, మే 1 న నిజామాబాద్ ఆర్మూర్లతో పాటు సికింద్రాబాద్లోని జిటిఏ సంస్థ కార్యాలయంలో ఇంటర్వ్యూలో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ సతీష్ వెల్లడించారు. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కలిగిన అభ్యర్థులు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలి అన్నారు. 

ఇతర వివరాల కోసం జిటిఎం సంస్థ బ్రాంచీలైన 

సిరిసిల్ల..83320 17122 ,జగిత్యాల..83320 42299, ఆర్మూర్..83320 13999, నిజామాబాద్ .. 86868 60999, సికింద్రాబాద్..83320 52299 నంబర్ల లో సంప్రదించాలని సూచించారు.


విద్యార్థులకు పోలీసుల ఉచిత సమాఖ్య

 నార్నూర్ మండలంలోని విద్యార్థుల కోసం పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మే నాలుగవ తేదీ నుండి 30వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు నార్నూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు రెండు నుండి పదవ తరగతి విద్యార్థులకు యోగ కరాటే కబడ్డీ వాలీబాల్ అంశాలలో "  ఉచిత శిక్షణ " ఇస్తారు. 

ఆసక్తి గలవారు ఈనెల 30వ తేదీ లోపు నార్నూర్ పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలి వివరాల కోసం 8712659942 లేదా 8712659961 నెంబర్లను సంప్రదించాలని ఎస్సై కోరారు.

ఉచిత మజ్జిగ కేంద్రం ప్రారంభం

 బోధన్ కోర్టు ప్రాంగణంలో సోమవారం న్యాయ సేవా సంస్థ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రము మరియు మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కాంచన రెడ్డి ప్రథమ శ్రేణి జూనియర్ సివిల్ జడ్జి మార్కెల్ పూజిత అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివ సాయి బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

కడుపారా పులిహోర ఉపశమనం ఇచ్చే అంబలి

 నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే వారికి దాతలు ఉచితంగా పులిహోర తాగునీరు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అధికారులకు సమస్యలను చెప్పుకోవాలని వచ్చే వారికి సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు గత పది సంవత్సరాలుగా పులిహోర అందిస్తూ ఆకలి తీర్చుతు న్నారు .తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సభ్యులు 15 ఏళ్లుగా చల్లని నీరు అంబలి పంపిణీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 

ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించి స్వయంగా ఉచిత పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వచ్చేవారికి సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఇకపై నిరంతరంగా కొనసాగిస్తామని ఫోరం ప్రతినిధులు తెలిపారు. 

ఇక రాజస్థానీ వాకర్స్ గ్రూప్ సౌజన్యంతో చల్లటి తాగునీటిని కూడా అందజేశారు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన అదనపు కలెక్టర్ ఫోరం ప్రతినిధులు మరియు వాకర్స్ గ్రూపు సభ్యులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ రెడ్డి ఏవో ప్రశాంత్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వాకర్స్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



సహారా హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

 మారుమూల తండాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ముకుంద తాండా సర్పంచ్ ప్రకాష్ అన్నారు. 

సోమవారం ఆ తండాలో సహారా హెల్త్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభించి మాట్లాడారు వైద్యం పట్టణ ప్రజలకు కాకుండా మారుమూల ప్రాంతంలోని తండాలలో నివసించే గిరిజనుల ఇంటింటికి వచ్చి వైద్యం అందించడం అభినందనీయం అన్నారు. 

గిరిజన ప్రాంతాలలో సిఎస్ఆర బాధ్యతతో ఆరోగ్యం పై అవగాహన కలిగించడం గొప్ప విషయం అన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా 100 గిరిజన తండాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సహారా హెల్త్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు సర్పంచ్ ప్రకాష్ లక్ష్మణ్ నాయక్ మహిపతి సర్దార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

 ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్సుం సి ఓ ఓ S .రాఘవేందర్ రెడ్డి మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గం లో పలు కార్యక్రమాలలో హాజరు కానున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కల్వకుర్తి పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ బస్టాండ్ సమీపంలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన నాలుగవ సంకిరెడ్డి ఉచిత ఎస్సై కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నార.


Monday, 27 April 2026

బ్యాంకింగ్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

 బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే ఎస్సీ ఎస్టీ యువతకు ఐబీపీఎస్ పరీక్షలకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

డిగ్రీలో మెరిట్ ఆధారంగా ఎస్టిలకు 75 , ఎస్ సీ లకు 15, బీసీ లకు 10 మంది చొప్పున మొత్తం 100 మంది ని ఎంపిక చేసి " ఉచిత శిక్షణ" ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది .

ఆసక్తి గల అభ్యర్థులు 28 వ తేదీ లోపు https:://study circle.cgg.gov.in 

వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

Wednesday, 22 April 2026

ఏప్రిల్ 25న ఉచిత జాబ్ మేళా

 పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు మేడ్ప్లస్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు ఏప్రిల్ 25న శనివారం రూమ్ నెంబర్ 233 నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు.

 మెడిప్లస్ కంపెనీలో 45 ఫార్మసిస్ట్ జాబ్స్, 50 ఆడిట్ అసిస్టెంట్ ,201 సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 25న ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో రూమ్ నెంబర్ 233లో నూతన కలెక్టర్ భవన సముదాయంలో పెద్దపల్లి మొదటి అంతస్తులో వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని మరిన్ని వివరాలకు 8985 336947 మరియు 8121262441 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

అన్నపూర్ణ స్వచ్ఛంద సేవా సంస్థ

 వేములవాడ నాలుగవ వార్డు మహాలక్ష్మి వీధికి చెందిన పెంట మల్లేశం మరణించగా అంత్యక్రియల అనంతరం వారి కుటుంబానికి అన్నపూర్ణా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్ పర్సన్ తోటలహరి ద్వారా ఉచితంగా భోజనం అందించారు.

 పెంట స్వరూప్ ,రవి ప్రిన్స్ అందించిన సమాచారం మేరకు సకాలంలో భోజనం పంపించినట్లు చైర్పర్సన్ తోటలహరి తెలిపారు. వేములవాడ పట్టణంలో ఎవరైనా మరణించిన సందర్భంలో ట్రస్ట్ నంబర్ 8919376459 కు సమాచారం ఇస్తే బాధిత కుటుంబాలకు ఉచితంగా భోజనం అందిస్తామని అని తెలిపారు.

Saturday, 18 April 2026

100%ఉచిత సీట్ గెల్చుకోండి

 ఐఐటియన్స్ హౌస్..శ్రీ అభిద IIT-JEE / neet / foundations 

జూనియర్ కళాశాల..ఒలింపియాడ్ స్కూల్

రెసిడెన్షియల్ మరియు డే స్కాలర్


స్కాలర్ షిప్ టెస్ట్ 2026..


10 వ తరగతి పాసైన విద్యార్థులకు..100% ఉచిత సీట్ గెలుచుకునే అవకాశం..

5 మంది విద్యార్థులకు ..100% స్కాలర్ షిప్ 

10 మంది విద్యార్థులకు..50% స్కాలర్ షిప్ 

25 మంది విద్యార్థులకు..25% స్కాలర్ షిప్ 

పరీక్ష జరిగే స్థలం..

భవిత హై స్కూల్,

ఈస్ట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ,

నియర్ సత్య గార్డెన్,

IMA బిల్డింగ్ పక్కన,

కామారెడ్డి.503111

పరీక్ష తేదీ..19 -4-2026 ,ఉదయం 10 గంటల నుంచి 11-30 గంటల వరకు 

పరీక్షా విధానం.. గణితం మరియు IQ నుండి 30 ప్రశ్నలు, ఫిజిక్స్ నుండి 15,కెమిస్ట్రీ నుండి 15,బయాలజీ నుండి 15 ప్రశ్నలు ఉంటాయి.

సరైన జవాబు కీ 4 మార్కులు, రాంగ్ ఆన్సర్ కు ..మైనస్ 1 మార్క్ ఉంటుంది.

మరిన్ని వివరాలు..96666 09858,94931 77772 నంబర్లలో సంప్రదించండి.

Mr. భూపతి రాజ్, కో ఆర్డినేటర్, కామారెడ్డి.

Mr.A.Srinivas Rao,IIT Bombay..founder and chairman.

Register now  www.sriabhida.com 





Friday, 17 April 2026

రేపు ఉచిత సందర్శన@తెలంగాణ మ్యూజియంలు

 ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా తెలంగాణ హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలోని అన్ని మ్యూజియం లలో,మరియు చారిత్రక కట్టడాలను సందర్శించడానికి ఈ నెల 18 వ తేదీన "ఉచితంగా "ప్రవేశం కల్పిస్తున్నట్లు సంబంధిత వర్గాలు/ సాంస్కృతిక శాఖ వర్గాలు తెలిపాయి.

నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని "స్టేట్ మ్యూజియం " లో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సాంస్కృతిక శాఖ వర్గాలు తెలిపాయి 

18 న ఉచిత జాబ్ మేళా @ రామాయంపేట

 మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 18 తేదీ న ఉచిత జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ హిమజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. MSN కెమికల్ కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో జాబ్ మేళా కొనసాగుతుందని ఆమె చెప్పారు.

ఇంటర్ MPC,ఇంటర్ BI PC,ఒకేషనల్ MLT కోర్సులు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

కళాశాల లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత జాబ్ మేళా కొనసాగుతుందని ఆమె చెప్పారు.విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.

17 నుండి 21 ఏళ్ల వయసు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంపెనీ ఆకర్షణీయమైన వేతనం చెల్లిస్తుందని ఆమె తెలిపారు.

18 న ఉచిత జాబ్ మేళా @ కామారెడ్డి కలెక్టరేట్

 కామారెడ్డి జిల్లా లోని నిరుద్యోగ యువతి యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 18 తేదీన ఉచిత జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనీ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ కంపెనీ అయిన గూగుల్ పే  లో ఉద్యోగాలు ఉన్నాయన్నారు.18-35 ఏళ్ల వయసు ఉన్న యువతీ యువకులు కామారెడ్డి కలెక్టరేట్ లోని రూమ్ నంబర్ 121 లో ఉదయం 10.30 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మౌఖిక పరీక్షలకు హాజరు కావాలని కోరారు.

అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికెట్ ల నకలు తీసుకొని రావాలని సూచించారు.

Tuesday, 14 April 2026

ప్రకృతి సేద్యం పై 3 రోజుల ఉచిత శిక్షణ

 సేంద్రీయ/ ప్రకృతి సేద్యం పై ఎన్టీర్ జిల్లా లోని నూజివీడు వద్ద గల కొండపర్వలోని కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రో ఎకాలజి సంస్థ లో ఈ నెల 28 నుండి 30 తేదీ వరకు 3 రోజులపాటు రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రైతులతో కలిసి పని చేసే క్షేత్రస్థాయి విస్తరణ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు ,రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, రైతు సంక్షేమ సంఘాలు, సహకార సంఘాలు ,బ్యాంకులు, ఉద్యాన, వ్యవసాయ, పశు విశ్వవిద్యాలయాల సిబ్బంది ఈ శిక్షణకు అర్హులని తెలిపారు .

పూర్తి వివరాలకు 8500283300 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

పుట్టగొడుగుల పెంపకం పై ఉచిత శిక్షణ

 నసురుల్లాబాద్ కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ లో ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు పుట్ట గొడుగుల పెంపకం పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పుట్టగొడుగుల పెంపకం పై ఆసక్తి ఉన్న 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తులు జిల్లా కలెక్టరేట్ లోని DRDO ఆఫీస్ లో లేదా నసురుల్లాబాద్ లోని సంస్థ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు.

శిక్షణ సమయంలో ఉచిత వసతి, ఉచిత భోజనం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పూర్తి వివరాలకు..

92475 40478 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

Monday, 13 April 2026

వేస్ట్ ఆప్టిమైజేషన్ ప్రొఫెషనల్ కోర్స్.. ఉచిత శిక్షణ

 పర్యావరణ హిత కార్య క్రమాల్లో నైపుణ్యం పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో గచ్చిబౌలి లోని EPTRI సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశ పెట్టింది.

ఇందులో ఒకటి 90 రోజుల ఉచిత శిక్షణ.. వేస్ట్ ఆప్టిమైజేషన్ ప్రొఫెషనల్ కోర్స్ అని నిర్వహిస్తున్నారు.

అర్హులైన వారికి ఉచిత బస, క్షేత్ర స్థాయి పర్యటనల అనంతరం సర్టిఫికెట్ ఇస్తున్నారు.దీంతో రీసైక్లింగ్ కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు తెలిపారు.

స్కిల్ ఇండియా మిషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ స్కిల్ ఇండియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. పర్యావరణ హిత కార్య క్రమాల్లో శ్రామిక శక్తిని పెంపొందించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.ఇందులో భాగంగా పలు ఉచిత కోర్సులు నిర్వహిస్తున్నారు.

ఇందులొ భాగంగా థియరీ,ప్రాక్టికల్ తరగతులతో ప్రాథమిక భావనలపై పరిజ్ఞానం అందించడం తో పాటు క్షేత్ర స్థాయి పర్యటనల కు భాగస్వామ్యం కల్పిస్తున్నారు.

ఇందులో పొందిన నైపుణ్యాలతో పరిశ్రమలు , రీసైక్లింగ్ కేంద్రాలు,మున్సిపల్ కార్పొరేషన్ లలో ఉద్యోగాలు పొందవచ్చునని ప్రతినిధులు తెలిపారు.

ఇంటర్, డిగ్రీ,బీటెక్ లతోపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారు అర్హులు.



Saturday, 11 April 2026

ఉచిత కంటి వైద్య శిబిరం@మాక్లూర్

 మాకూర్ మండల పరిధిలోని ఆర్టీసీ కాలనీలోని మాక్లూర్ పోలీస్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఆటో డ్రైవర్లు మరియు పదవి విరమణ పొందిన ఉద్యోగుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటి చూపు అత్యంత కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యం పై ముఖ్యంగా కంటిచూపుపై దృష్టి పెట్టడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతను కాపాడవచ్చును సూచించారు. ఈ శిబిరంలో ఆటో డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఐ డ్రాప్స్ అందించినట్లు పేర్కొన్నారు .

ఇందులో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ మాక్లోర్ ఎస్సై 2 మొగులయ్య నవీపేట్ ఎస్సై టు యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Friday, 10 April 2026

15 న ఉచిత జాబ్ మేళా @ బాన్సువాడ

 ఏప్రిల్ 15 తేదీన ఉచిత మెగా జాబ్ మేళా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎటువంటి కన్సల్టెన్సీ ఫీజులు లేకుండా ఉచితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ వారి సహకారంతో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పదవ తరగతి,ఇంటర్,డిగ్రీ, ఎంబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్, హోటల్ మేనేజ్ మెంట్ చదివిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

18 నుండి 30 ఏళ్ల లోపు వయసు గల వారు అర్హులనీ ,బ్యాంకింగ్, హోటల్ మేనేజ్ మెంట్, ఐటిఐ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫార్మా తదితర రంగాలలో ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.

ఇతర వివరాలకు 94933 10781,98484 30111 ఫోన్ నంబర్ లలో సంప్రదించాలని సూచించారు.

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...