Saturday, 13 June 2026

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ పాషా  తెలిపారు. పదేళ్లుగా అకాడమీలో ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులు వివిధ సర్వీసులలో ఉద్యోగాలు సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను ఈనెల 20వ తేదీలోగా www.mseducationacademy.in  వెబ్సైట్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.

హైద్రాబాద్, నిజామాబాద్,నిర్మల్, మహబూబ్ నగర్, హన్మకొండ, సదా శివ పేట, ఆదిలాబాద్, బోధన్ ప్రాంతాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేస్తామని , టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తామని తెలిపారు.

మరిన్ని వివరాలకు 85208 60785 ,90300 45422 ఫోన్ నెంబర్ లలో సంప్రదించాలని సూచించారు.

Wednesday, 10 June 2026

ఉచిత నైపుణ్య అభివృద్ధి శిక్షణ .. మైనారిటీ వర్గాలకు

 తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆదేశాల మేరకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం కోసం ప్రభుత్వ ప్రైవేటు శిక్షణ సంస్థల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శశి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ముస్లింలు, బౌద్ధులు ,పార్సలు, సిక్కులు ,జైనులు తదితర మైనార్టీ వర్గాలకు చెందిన విద్యావంతులు నిరుద్యోగ మైనారిటీ యువతకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ అనుబంధమైన ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణ సంస్థల ద్వారా ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ,డిజిటల్ బిజినెస్ మొదలగు వాటిల్లో" నైపుణ్యాభివృద్ధికి ఉచిత శిక్షణ "అందిస్తామని తెలిపారు. ఎంపికైన సంస్థలు శిక్షణ ఇవ్వడమే కాకుండా, శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించవలసి ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న శిక్షణ సంస్థ లు మూడేళ్ల పనితీరుకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రాజెక్టు రిపోర్ట్ తో జత చేసి హార్డ్ కాపీలను ఈనెల 15 సాయంత్రం 5 గంటలకు లోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం కామారెడ్డి లోని రూమ్ నెబర్ 222, కలెక్టరేట్లోని రెండో అంతస్తులో సమర్పించాలని సూచించారు.

వందమందికి ఉచిత హెల్మెట్లు

 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గద్వాల సీఐ శ్రీను సూచించారు రహదారి భద్రత పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన అలా కార్యక్రమంలో భాగంగా బుధవారం గద్వాల మండలంలోని పూడూరు గ్రామంలో 100 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి సిఐటి శ్రీను రూరల్ ఎస్సై శ్రీకాంత్ నాయకత్వం వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని అది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా మన రక్షణ కవచమని అన్నారు ప్రధాన సమయంలో సెల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించే రహదారిపై పూర్తి అప్రమత్త తత్వం ఉండాలని సూచించారు అలాగే నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్టు ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో తీవ్ర గాయాలు ప్రారంభించడం నుంచి ఆయన నష్టం నుంచి రక్షణ పొందవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పెద్దలు యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

జర్మన్ భాషా శిక్షణ ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు

 నిరుద్యోగ యువతీ యువకులకు జర్మన్ భాష లో శిక్షణ ఇప్పించడం ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం టాస్క్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి చంద్రయ్య, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, టాస్క్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ,  టామ్ కామ్ మేనేజర్ నాగభారతిలతో కలిసి ఆయన మాట్లాడారు.  అవకాశాలను పొందడంలో, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహిస్తామని అన్నారు . ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపాధి అవకాశాలు ఉన్నా యని ముఖ్యంగా జర్మనీలో నైపుణ్యం కలిగిన యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్న జర్మనీలో నర్సింగ్, సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో లక్షలాది ఉద్యోగాలలో ఖాళీలు ఉన్నాయని ,తెలంగాణ యువత అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ అందిస్తుందని తెలిపారు. ఉద్యోగం ఎక్కడ లభిస్తే అక్కడికి వెళ్లి పని చేసే దృక్పథం యువత అలవర్చుకోవాలని అన్నారు. పారిశ్రామికవేత్తగా పనిచేసిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ మార్కెట్ ఉన్న ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించడం వలన వేలాది మందికి ఉపాధి కల్పించగలిగామని అన్నారు. స్థానికతకే పరిమితం కాకుండా అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్లాలని యువతకు సూచించారు. జర్మనీలో వారానికి కేవలం 32 నుంచి 35 గంటల పని సమయం మాత్రమే ఉంటుందని మిగతా సమయంలో ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, జర్మనీలో నెలకు రెండు లక్షల 50 వేల రూపాయలు ఆపైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు ఏజెన్సీల మోసాలకు గురి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన టాస్క్ ద్వారా శిక్షణ పొంది విదేశీ ఉద్యోగాలను పొందాలని తెలిపారు .ఇప్పటికే ఈ కార్యక్రమానికి 112 మంది యువత నమోదు చేసుకున్నారని, వారందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ  అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం టామ్ కామ్ సంస్థకు 90 కోట్ల రూపాయలు అందించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రెండువేల రూపాయల స్టయిఫండ్ అందిస్తుందని, అదేవిధంగా జర్మన్ భాష శిక్షణ పొందుతున్న అభ్యర్థులలో 80 శాతం హాజర నమోదు చేసుకున్న వారికి కాకా వెంకటస్వామి ట్రస్ట్ తరఫున అదనంగా నెలకు ₹1000  స్టైపండ్ అందజేస్తామని తెలిపారు .యువతలో క్రమశిక్షణ, పట్టుదల , లక్ష్య సాధన పై దృష్టి ఉండాలని, జర్మన్ భాష నేర్చుకోవడానికి  ప్రతిరోజు సాధన చేయాలని సూచించారు. మందమర్రిలో ప్రారంభమైన ఈ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రతివారం తాను స్వయంగా శిక్షణ కేంద్రాన్ని సందర్శించి అభ్యర్థులతో కలిసి జర్మనీ భాష నేర్చుకుంటానని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. అంతకుముందు క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జర్మన్ భాషా శిక్షణలో బి2 సర్టిఫికేషన్ పూర్తి చేసిన మరియన్ పాసల్, హుబా ఫాతిమా లకు ఆఫర్ లెటర్లు అందజేశారు.

మన దేశానికి ఏడాదికి 90 వేల వీసాలు ఇచ్చేందుకు జర్మనీ సిద్ధంగా ఉందనీ, జర్మనీ వీసా లో 50% సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. శిక్షణ కేంద్రంలో 4 నెలల్లో జర్మనీ భాష నేర్పిస్తారని చెప్పారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాలలో అవకాశాలకు భాషా పరిజ్ఞానం తప్పనిసరి అని ,జర్మనీలో పనిచేయాలనుకునే వారికి ఆ భాష ఒక శక్తివంతమైన సాధనం అని తెలిపారు..



Monday, 8 June 2026

ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ

 రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ చేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించమని ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వల్ల ప్లాస్టిక్ తో నిర్మితమైన వస్తువులు వాడడం వల్ల ఆరోగ్యం పాడవాడమే కాకుండా భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నామని ఆయన తెలిపారు ఏ రూపంలో కూడా ప్లాస్టిక్  నిర్మితమైన వస్తువులు వాడకూడదని అలాగే మనకు రోజు వారి కార్యక్రమంలో ఉపయోగించే బస్తాలు వాడాలని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకుండా కాటన్ తో తయారు చేసిన బ్యాగులు వాడడం వల్ల పర్యావరణాన్ని రక్షించడమే కాదు మనతోపాటు జీవిస్తున్న పశువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు మనం ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటే ఇలాంటి కాటన్ బ్యాగులను ఉపయోగించి మనకు అవసరమైన కూరగాయలు ఇతర వస్తువులను గాని తీసుకెళ్లాలని ఆయన కోరారు ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని గంజిలో గల కూరగాయల సంతలో రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచితంగా కాటన్ బ్యాగులు వినియోగదారులకు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు తప్పకుండా అందరూ ఈ చిన్న మార్పుతో నిత్యజీవితంలో కాటన్ బ్యాగు ల వాడి భవిష్యత్ తరానికి ఆరోగ్యకరమైన పర్యావరణం అందించాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్ గిరీష్ కుమార్  గంగుల విజయ్ రమేష్ సుధాకర్ సంపత్ రాజశేఖర్  శిరీష్ కుమార్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు

ఉచిత జర్మనీ శిక్షణ తరగతులు

 యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు విస్తరించేదుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉచిత జర్మనీ భాష శిక్షణ క్యాంపును నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికా రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈనెల 10న ఉదయం మందమర్రిలోని సింగరేణి ఇల్లందు క్లబ్లో శిక్షణ తరగతులను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి తిధి వెంకటస్వామి ప్రారంభించనున్నట్లు చెప్పారు మంత్రి ఆదేశాలతో జర్మనీతో పాటు యూరోపియన్ దేశాల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన భాషా నైపుణ్యాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు విదేశీ ఉపాధి అవకాశాలపై ఆసక్తి కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సేంద్రీయ సేద్యంపై తొమ్మిది నెలల ఉచిత శిక్షణ

 వ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్షయ కల్ప రైన్ మ్యాటర్ ఫెలోషిప్ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నది పాడి పశువుల పెంపకం బయోగ్యాస్ ఉత్పత్తి బయోడైజేష్టర్ ద్వారా తయారు చేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక వ్యవసాయ పద్ధతి ప పై పై 19 నుంచి 27 మధ్యన వయసుగల యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని ఈదులపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ పరిశోధన శిక్షణ కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి మూడు నెలలు రెసిడెన్షియల్ శిక్షణ తర్వాత ఆరు నెలలు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది ఉచిత భోజనము వసతి తో పాటు ఉపకార వేతనం కూడా ఇస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది మరిన్ని వివరాలకు 70222 77155 నంబర్లో సంప్రదించవచ్చు

తాళ్ల రాంపూర్ లో ఉచిత చేప మందు పంపిణీ

 నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండలంలోని తాళ్ళ  రాంపూర్ గ్రామంలో మృగశిర కార్తె సందర్భంగా సోమవారం చేపమందు పంపిణీ చేస్తున్నట్లు బెజ్జారపు లింబాద్రి తెలిపారు .గత 60 ఏళ్లుగా ఈ చేప మందు కోసం జిల్లాతో పాటు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని ఆయన తెలిపారు. ఆస్తమా, దగ్గు ,దమ్ము వంటి శ్వాస కోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చేప ముందు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతున్నారని తెలిపారు. చేప మందు పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని లింబాద్రి పేర్కొన్నారు.

నేటి నుంచి ఉచిత చేప ప్రసాదం పంపిణీ

 మృగశిర కార్తి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు ఉచితంగా చేప మందు పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. సాధారణంగా ప్రతి ఏటా మృగశిర కార్తి ఉదయం పూట ప్రవేశిస్తుంది. అయితే ఈసారి ఈనెల 8వ తేదీ రాత్రి మృగశిర కార్తె వస్తుండడంతో సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు రాత్రి వరకు చేప ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని బత్తిని  గౌరీ శంకర్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు దూద్బౌలి లోని బత్తిన గౌరీ శంకర్ గౌడ్ నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దూద్బౌలిలోని స్వగృహంలో బత్తిని కుటుంబ సభ్యులంతా దాన్ని తీసుకున్నాక ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో  పంపిణీ ప్రారంభమవుతుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఉబ్బస రోగులకు వారి సహాయకులకు మూడు రోజుల పాటు వసతి, భోజనం, మంచినీళ్లు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

సదాశివ నగర్ లో ఉచిత వేసవి శిక్షణ శిబిరం

 సదా శివనగర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సమ్మర్ యాక్టివ్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ యోసెఫ్ తెలిపారు. ఈ శిబిరం లో విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కంప్యూటర్ బేసిక్స్, ఇండోర్ గేమ్స్, డాన్స్ వంటి కార్యక్రమాలు నేర్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సోను సూద్ ఉచితం అంబులెన్స్ సేవలు

 సోనూ సూద్ ఉచిత అంబులెన్స్ ల పంపిణీ, ఉచిత ఆటోల పంపిణీ, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులలో ఉచిత నిత్యాన్నదానం.


అంబులెన్స్ ని స్వచ్ఛందంగా ప్రధానం చేయడం అంటే ప్రాణాలను రక్షించడం లాంటిదేనని నటుడు సోనుసూదన్నారు. ఆదివారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద సోను సూద్ మరియు మాల్యవీ కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు" ఉచితంగా ఆటోలను "పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి ,అమ్మడవాకుల గ్రామాలకు ఉచితంగా అంబులెన్స్ ,నగరంలోని దమ్మాయిగూడ, చిలుకానగర్ ప్రాంతాల నిరుపేద ఆటో కార్మికులకు ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన అంబులెన్స్ను స్వయంగా నడిపి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ సంకిరెడ్డిపల్లి, మరియు అమ్మడవాకుల గ్రామ ప్రజలు సోనుసూద్" ఉచిత అంబులెన్స్ ను "వినియోగించుకొని సురక్షితంగా ఉండాలని కోరారు .జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఆటో కార్మికులకు "ఉచితంగా ఆటోలను" అందించడం అంటే కుటుంబాలను నిలబెట్టడం వంటిదని సొసైటీ వ్యవస్థాపకులు కొండ కృష్ణమ్మను  అభినందించారు సోనూ సూద్. కొండ కృష్ణమ్మ మాట్లాడుతూ 2004లో ప్రారంభించిన ఈ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికీ గాంధీ, నిలోఫర్ ఆసుపత్రి లలో నిత్యాన్నదానం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

వన్ హెల్త్ ఫార్మసీ వారి ఉచిత ఆరోగ్య పరీక్షలు

 వన్ హెల్త్ ఫార్మసీ మల్లారెడ్డి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అనుబంధ సంస్థ ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది హెల్త్ ఎసెన్షియల్స్ మరియు ఔషధాలపై 20 శాతం నుండి 70 శాతం వరకు డిస్కౌంట్. 

వెయ్యి రూపాయల కంటే ఎక్కువ కొనుగోళ్లపై 10000 రూపాయల విలువైన" ఆరోగ్య పరీక్షలు ఉచితంగా" నిర్వహిస్తారు లేదా" ఉచిత పిల్ బాక్స్" అందజేస్తారు 



హౌస్ నెంబర్ 5-3-113 

నిజాంసాగర్ చౌరస్తా

Nh 44 రోడ్డు

 కామారెడ్డి జిల్లా

 తెలంగాణ 

9121812181 ,8309867689



పార్థ డెంటల్ వారి ఫ్రీ ఆఫర్

 డెంటల్ హాస్పిటల్స్ లో ప్రముఖ సంస్థ అయిన పార్థ డెంటల్స్ వారు ఈ నెల అంటే జూన్ 2026 మొత్తం ఒక ఉచిత చికిత్స ఆఫర్ ప్రకటించింది.

అది invisalign open day  ఆఫర్. ఈ ఆఫర్ లో ఫ్రీ కన్సల్టేషన్ ,ఫుల్ మౌత్ ఎక్స్ రే, రూ.15000 విలువైన డిజిటల్ స్కాన్ ను ఫ్రీ గా ఇస్తున్నారు.

పార్థ డెంటల్ లో aligners మీద 50000 నుండి 90000 డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కని దంత ఆరోగ్యాన్ని పొందండి.

అపాయింట్మెంట్ కొరకు..040-41420000 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.

పార్థ డెంటల్.. స్కిన్..హెయిర్....

4 రాష్ట్రాలలో.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక / బెంగళూరు, తమిళనాడు /చెన్నై ..

గో వైర్లెస్ , గో ఫర్ అలైనార్స్ ..పెద్దలకు,యువకులకు,పిల్లలకు .. మెటల్ బ్రెసెస్ లేకుండా అలైనార్స్ తో మీ చిరునవ్వును తీర్చిదిద్దుకోండి.

వాట్సప్ 85007 79000 .. 

Sunday, 7 June 2026

స్పోకెన్ ఇంగ్లీష్ 7 రోజుల ఫ్రీ ట్రయల్

 స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి 7 రోజులు ఉచితంగా క్లాసులు వినే అవకాశం .7 రోజులు ఉచితంగా విన్న తర్వాత నచ్చితేనే కోర్స్ లో చేరవచ్చు.

స్పోకెన్ ఇంగ్లీష్ నిపుణురాలు ఐన భూక్యా గౌతమి గారు " జీరో టు హీరో " అనే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ను రూపొందించారు.దీనిని gyan tv యాప్ లో అందుబాటులో ఉంచారు. కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకునే వారికి 7 రోజులు ఉచితంగా క్లాసులు వినే అవకాశం కల్పించారు. కోర్స్ నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు.లేకపోతే మానేయవచ్చు.

Saturday, 6 June 2026

ఉచిత కేన్సర్ పరీక్షలు@ కదిలే బస్ లో

 కేన్సర్ స్క్రీనింగ్ టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు, మహిళల కోసం ఉచితంగా 20వేల రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు, కేన్సర్ ఉన్నట్టు తెలిస్తే 50% ఖర్చు తగ్గించే వైద్యము, రేపటి నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి ప్రారంభం. 



మనకు తెలియకుండానే చెప్పకుండా నీరులా వ్యాపిస్తున్న వ్యాధులలో క్యాన్సర్ ప్రధానమైనది శరీరంలో కణ వ్యవస్థ పనితీరు అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది అయితే కేన్సర్ వస్తే ఇక అంతేనా అని దీనికి మందు లేదని చాలామంది భయపడుతుంటారు. కానీ క్యాన్సర్ ను ప్రారంభంలోనే గుర్తిస్తే నియంత్రించొచ్చు, ప్రారంభ దశలోనే గుర్తించేందుకు వైద్య పరికరాలతో ప్రత్యేక బస్సును అందుబాటులోకి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు తీసుకొచ్చారు ఈ బస్సు ద్వారా పల్లెలలో పట్టణాల్లో మహిళలకు స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు కేన్సర్ ఉన్నట్టు తెలిస్తే ప్రముఖ కేన్సర్ ఆసుపత్రుల్లో 50% మేరా ఖర్చు రాయితీతో వైద్యం చేయించాను అన్నారు అందులో భాగంగా ఆదివారం నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలు ఉన్నారు 

ఉచితంగా వైద్య పరీక్షలు.. బీడీఎల్ వారి సౌజన్యంతో బస్సు శిశిర ఆస్పత్రి వారి సహకారంతో వైద్య పరీక్షల సామాగ్రిని సమకూర్చారు ఆ తర్వాత ఉచిత కాన్సర్  స్క్రీనింగ్ టెస్టింగ్ సెంటర్ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చారు ఇటీవల ఈ బస్సును లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారు ప్రారంభించారు హైదరాబాద్ కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సింధు, ఆంకో సర్జన్ డాక్టర్ స్రవం తేజ నేతృత్వంలో పరీక్షలు నిర్వహించనున్నారు ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు నుంచి 20వేల రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు ఉచితంగా అందించనున్నారు మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 45 మండలాలు 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి లోని 9 డివిజ డివిజన్ లలో క్యాన్సర్ టెస్టింగ్ బస్ సంచరించనున్నది. ఎక్కడికి వెళ్లినా ముందుగా అక్కడ ప్రజలకు సమాచారం అందిస్తారు మహిళలకు బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ టెస్టులు ఉచితంగా చేస్తారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కేన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరగా కోలుకుంటారని మహిళలు ఎక్కువగా బ్రష్టు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఈ బస్సు లోక్ లోక్భ సభ నియోజకవర్గంలో అంతటా సంచరిస్తుందని అక్కడే టెస్టు నిర్వహించే రిపోర్టులు అందజేస్తారని మహిళలందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఎంపీ మాధవిని రఘునందన్ రావు గారు కోరారు.

ముగిసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం

 కామారెడ్డి జిల్లాలోని గర్గోలు గ్రామంలో పీపుల్ ఫర్ ఇండియా ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది శిక్షణ పొందిన వారికి ద్రోపత్రాలను సంస్థ ఉపాధ్యక్షుడు అరవింద్ అందించారు విద్యార్థినిలకు ఐదు కుట్టుమిషన్లు మగ్గం పరికరాలు దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిడిపిఓ స్రవంతి ఎన్జీవో అందిస్తున్న సేవలను అభినందించాలి కార్యక్రమంలో ఏసీజీ బలరాం ఎంఈవోలు ఎల్లయ్య ఆనందరావు శిక్షకులు నవీన్ చైతన్య లావణ్య తదితరులు పాల్గొన్నారు.

ఉచిత స్టీల్ ప్లేట్ల పంపిణీ

 బాన్స్వాడ మండలంలోని దేశాయిపేట గ్రామానికి చెందిన తపస్సు జిల్లా అధ్యక్షుడు బోనీకర్ సంతోష్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా గ్రామానికి ఉపయోగపడేలా 100 స్టీల్ ప్లేట్లను గ్రామ సర్పంచ్ భూమిక జ్యోతి కి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో జరిగే శుభకార్యాలు సామాజిక కార్యక్రమాలకు ఈ ఉచిత స్టీల్ ప్లేట్లను వినియోగించాలన్నారు అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ దోహదపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలను సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు సేవా కార్యక్రమాలు మరిన్ని మున్ముందు చేపట్టాలని కోరారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామస్వామి జయ వీరప్ప డాక్టర్ రవి కమార్ సంతోష్ పటేల్ గాండ్ల శ్రీనివాస్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

కరక్ వాడిలో మెడికవర్ హాస్పిటల్స్ ఉచిత మెగా వైద్య శిబిరం

 గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలని లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో కరక్ వాడి అనే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో మెడికవర్ వైద్య బృందం గ్రామ ప్రజలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మరియు ఆరోగ్య సమస్యలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందించింది. రక్తపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు ,కీళ్ల నొప్పులు, నరాల సంబంధిత సమస్యలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. అవసరమైన వారికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మెరుగైన చికిత్స అవసరమైన రోగులను మెడికవర్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనారోగ్యాలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేద మరియు గ్రామీణ ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీష్ చంద్రబోస్, పలమనాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్, నర్సింగ్ సిబ్బంది, గ్రామపంచాయతీ ప్రతినిధులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ఉచిత  వైద్య శిబిరంలో 300 మందికి పైగా గ్రామస్తులు వైద్య సేవలను వినియోగించుకుని లబ్ధి పొందారు.

సంస్కృత భాష పై ఉచిత అవగాహన శిబిరం

 సంస్కృత భాష పై ప్రాథమిక పరిజ్ఞానం కల్పించడానికి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు వారి ఆధ్వర్యంలో ఈ నెల 9 10 మరియు 11 తేదీలలో సరళ సంస్కృత భాష అవగాహన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షులు శశికాంత్ పులకరిని కార్యదర్శి రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు సంస్కృత భాష నేర్చుకోవడానికి అవసరమైన పుస్తకాలు నోట్ బుక్స్ పెన్నులు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు శిక్షణ శిబిరం బోర్గాలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుందని విద్యార్థులు మహిళలు భాషాభిమానులు ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9494 392393 ఫోన్ నెంబర్లో సంప్రదించాల్సిన సూచించారు.

మరోసారి 300 మందికి ఉచిత వీసాలు

 యూఏఈ లోని ADNH, స్థానిక GTM సంస్థల ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ మేళా.. జూన్ 12 న సిరిసిల్ల, జగిత్యాలల్లో,13 న నిజామాబాద్, ఆర్మూర్ లలో ఇంటర్వ్యూ ల నిర్వహణ.

యూఏఈ లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు మరోసారి ఉచిత వీసాలను ఇప్పించేందుకు యూఏఈ కి చెందిన ADNH, మన దేశానికి చెందిన GTM సంస్థలు ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ మెంట్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.క్లీనింగ్ విభాగంలో 300 మందికి ఉచిత వీసాలు ఇచ్చేందుకు ఈ నెల 12 తేదీ న సిరిసిల్ల, జగిత్యాలల్లో,13 న నిజామాబాద్ ఆర్మూర్ లలో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.21 ఏళ్ల వయసు నిండి 40 సంవత్సరాలలోపు వారు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు.

ఎంపికైన వారికి "ఉచితంగా వీసాలు "ఇచ్చి విమానం ఛార్జీలను సైతం కంపెనీ యే భరించనుంది. భారత కరెన్సీలో నెలకు 24 వేల రూపాయలు వేతనం చెల్లిస్తూ,నివాసం,భోజనం సదుపాయాలను ADNH కంపెనీ కల్పిస్తుంది.

వివరాల కోసం .. క్రింది ఫోన్ నెంబర్లలో సంప్రదించాలి.

సిరిసిల్ల 83320 17122, జగిత్యాల 83320 42299, నిజామాబాద్ 86868 60999 , ఆర్మూర్ 83320 13999 నంబర్ లలో సంప్రదించాలని తెలిపారు.

ఈ సందర్భంగా GTM సంస్థ చైర్మన్ సతీష్ రావు మాట్లాడుతూ ఉచిత వీసాలు అందించే అవకాశం తమకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వలస వెళ్ళే వారిపై నయాపైసా భారం పడకుండా అన్ని వసతులు ఉచితంగా కల్పించడం తమ ప్రత్యేకత అని అన్నారు.నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...