Saturday, 25 July 2026

ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం

 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి..


ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్ని కాపాడడం, పర్యావరణాన్ని రక్షించడం కోసం హైదరాబాద్ హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నడుం బిగించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఇందులో మూడు పండ్ల మొక్కలు, రెండు ఔషధ మొక్కలు లేదా అలంకరణ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మొక్కలను పొందడం కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మరియు మొబైల్ నెంబర్ సమర్పించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలోని 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకువెళ్లాలని ప్రజలకు సూచించింది.

ఈ సంవత్సరం లక్ష కుటుంబాలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ గోపిడి రోహిత్ తెలిపారు.

Thursday, 23 July 2026

ఉచిత సంతాన సాఫల్య శిబిరం

 జూలై 24 ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహించనున్నట్లు మాతృశ్రీ హాస్పిటల్ యాజమాన్యం కామారెడ్డి వారు తెలిపారు ఆర్ట్ ఫెర్టిలిటీ క్లినిక్స్ మరియు మాతృశ్రీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కన్సల్టేషన్ ఉచిత కౌన్సిలింగ్ ఉచిత టెస్టులు థైరాయిడ్ పరీక్ష రక్తపరీక్ష షుగర్ టెస్ట్ టి ఎఫ్ టి ఎఫ్ ఎస్ హెచ్ ప్రోలాక్టింగ్ సిమెంట్ అనలైసిస్ వారి వారి అవసరాలను బట్టి ఉచితంగా చేయబడును చాలా రోజుల నుండి పిల్లలు పుట్టని వారు తప్పకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి రావాలని సూచించారు

 గంజి గట్ ఎదురుగా రామారెడ్డి రోడ్డు కామారెడ్డి.

సంప్రదించవలసిన నెంబర్లు 89850 39634 మరియు 92203 15983.

రామానంద తీర్థ లో ఉచిత శిక్షణ

 రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలు తెలుగు రాష్ట్రాల యువతకు వివిధ కోర్సులలో ఉచిత భోజన వసతితో కూడిన శిక్షణ అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని తెలిపింది అకౌంట్స్ అసిస్టెంట్స్ డైలీ ప్రైమ్ బేసిక్ కంప్యూటర్ హార్డ్వేర్ కంప్యూటర్ అడ్వాన్స్ వెల్డింగ్ ఆటోమొబైల్ టీవీ టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నది ఈనెల 27న ఒరిజినల్ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు ఆధార్ కార్డు కుల దృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంస్థకు నేరుగా హాజరు కావాలని సూచించింది పూర్తి వివరాలకు 9133 908000 మరియు 9133 90 811 1మరియు 9133 908222 మరియు 9948 466 11 1 నెంబర్ లలో సంప్రదించాలని కోరింది

Saturday, 18 July 2026

150 మందికి ఉచిత శిక్షణ

 యూపీఎస్సీ పరీక్షలు 2027 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అందించనున్నది. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన 150 మందికి నిపుణులతో కోచింగ్, స్టడీ మెటీరియల్, మాక్ టెస్ట్ లతో పాటు నెలకు 5000 రూపాయల స్టయిఫండ్ ,5 వేల రూపాయలు పుస్తక భృతిని ప్రభుత్వం అందించనుంది.

డిగ్రీ ఉత్తీర్ణులై నిర్దేశిత ఆదాయ పరిమితిలో ఉన్న తెలంగాణ అభ్యర్థులు జూలై నెల 17వ తేదీ నుంచి ఆగస్టు నెల ఏడవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్  16వ తేదీన జరిగే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి అదే నెల 24 నుండి తరగతులు ప్రారంభించనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.

ఉచితంగా.. న్యాయ సహాయం

 న్యాయ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఎవరి సలహాలు,సూచనలు తీసుకోవాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. న్యాయ వాదులను సంపాదించాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు న్యాయ పరమైన సలహాలు,సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం " టెలీ లా"విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా ఎలాంటి ఫీజు చెల్లించకుండానే హైకోర్టు న్యాయ వాదుల నుంచి " ఉచితంగా న్యాయ సలహాలు, సూచనలు మాతృ భాష లోనే పొందే అవకాశం ఉంటుంది.

అపాయింట్ మెంట్.. 

దరఖాస్తుదారుడు ముందుగా ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ మీ సేవా, కామన్ సర్వీస్, డిజిటల్ సేవా కేంద్రాల్లో ఏదైనా ఒక దానిని సంప్రదించాలి. హైకోర్టు లాయర్ లతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉచితంగా అపాయింట్మెంట్ నమోదు చేస్తారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన సమయానికే హై కోర్టు న్యాయవాది స్వయంగా దరఖాస్తుదారుడి ఫోన్ నెంబర్ కు కాల్ చేసి మాట్లాడతారు.

అందే సేవలు ఇవే..

వరకట్న వేధింపులు, లైంగిక నేరాలు, గృహ హింస,ఉపాధి,మహిళలు,పిల్లలు, వృద్ధుల మౌలిక హక్కులు, ప్రసూతి ప్రయోజనాలు, భూ తగాదాలు, వాహన చట్టాలు,FIR నమోదు, అరెస్ట్ చేసిన వ్యక్తిని నిర్బంధించడం, RTI, CAA, NRC, అట్రాసిటీ కేసులు, ఆస్తి గొడవలు, ప్రభుత్వ పథకాలు పొందడంలో అవరోధాలు తదితర సమస్యల గురించి న్యాయ వాదుల నుంచి "ఉచితంగా" సలహాలు,సూచనలు పొందవచ్చు.

Sunday, 5 July 2026

కీర్తి హాస్పిటల్ లో ఉచిత కన్సల్టేషన్

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాంతంలో గల కీర్తి హాస్పిటల్ లో జూలై 4 5 6 వ తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున ఉదయం 10 గటల నుండి రాత్రి 8 గంటల వరకు రోగులకు ఉచితంగా కన్సల్టేషన్ నిర్వహిస్తున్నామని ఆసుపత్రి నిర్వహకులు తెలిపారు కావున కామారెడ్డి పరిసర ప్రాంత ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని కోరారు.




Thursday, 2 July 2026

ఒడిశా లో ఉచిత విద్య

 కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ గతంలో ప్రకటించారు .బుధవారం రాత్రి ఆయన అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడింది. కార్యక్రమం తర్వాత మోహన్ స్వయంగా విలేకరులకు ఈ విషయం చెప్పారు .ఏడాదిలో 38 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ,రుసుములు ఉండవని స్పష్టం చేశారు. డ్రాప్ ఔట్లు తగ్గించడం, గుణాత్మకమైన విద్యా బోధనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

డిగ్రీ విద్యార్థులకు ఉచిత ఆర్ష విద్య ప్రశిక్షణ

 దేశభక్తి దైవభక్తి గల డిగ్రీ విద్యార్థులకు ఉచిత వసతితో ఆర్ష విద్య ప్రశిక్షణ ఇవ్వనున్నట్లు కామారెడ్డి ఆర్య సమాజం ప్రతినిధి ఆచార్య సత్య మిత్ర తెలిపారు. వివిధ కళాశాలలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు యధావిధిగా తమ కోర్సులతో పాటు ఆర్ష విద్యా ప్రశిక్షణ పొందవచ్చని పేర్కొన్నారు .

ప్రశిక్షణలో వాల్మీకి రామాయణం ,మహాభారతం, భగవద్గీత, ఉపనిషత్తులు ,షోడశ సంస్కారాలు, సత్యార్థ ప్రకాశం, ఋగ్వేదాది భాష్య భూమిక ,సంస్కృత భాష, వేదాంగ ప్రకాశ నేర్పిస్తారని ఆయన తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ప్రవేశాల కొరకు 79895 13668 మరియు 93475 91380 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Sunday, 28 June 2026

ఇన్ఫోసిస్ సహకారంతో ఉచిత శిక్షణ

 ఇన్ఫోసిస్ సహకారంతో లెర్నెట్ స్కిల్స్ వారి ఆధ్వర్యంలో ఖమ్మం లోని వైరా రోడ్ లో గల స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్లో యువతకు ఉచితంగా శిక్షణ అందజేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు లార్నెట్ స్కిల్స్ ఖమ్మం కోఆర్డినేటర్ బి నరసింహరావు తెలిపారు. 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల వయసు లోపు గల యువత ఇంటర్ ఆపై చదివిన వారు అర్హులని తెలిపారు. శిక్షణ రోజుకు నాలుగు గంటల పాటు 25 రోజులు ఇవ్వబడును ని శిక్షణ అనంతరం ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడతాయని తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుండి శిక్షణ ప్రారంభమవుతుందని వివరాలకు 9652711 341 ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు.

Saturday, 27 June 2026

ఉచిత రెసిడెన్షియల్ నీట్ కోచింగ్

 క్వాలిటీ థాట్, అన్ అకాడమీ సెంటర్ ల సంయుక్త నిర్వహణలో..

 క్వాలిటీ థాట్ , అన్ అకాడమీ సెంటర్ మాదాపూర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న" క్యూటీ యూ ఎన్ ఏ నీట్ మిషన్ 100 ఉచిత రెసిడెన్షియల్ నీట్ కోచింగ్ " కార్యక్రమాన్ని శుక్రవారం మాదాపూర్ లోని అన్నకాడమీ  సెంటర్లో ప్రారంభించారు . క్వాలిటీ థాట్ ఫౌండర్, అన్ అకాడమీ సెంటర్ ఫ్రాంచైజీ భాగస్వామి రమణ భూపతి కార్యక్రమాన్ని ప్రారంభించగా ,ఫౌండేషన్ వ్యవస్థాపకుడు క్రిష్ చింతలూరు ,జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ వెంకట్ పవన్ ,అనస్తీసియ విభాగాధిపతి డాక్టర్ వేణుగోపాల్, సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మడాల ,ఎయిమ్స్ ట్రామా సర్జన్ డాక్టర్ దామోదర్ కాకుమాను పాల్గొన్నారు. జులై 1 నుండి 14వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో 150 మంది రెసిడెన్షియల్ విద్యార్థులకు ఉచిత కోచింగ్ ,వసతి, భోజనం అలాగే 500 మంది డే స్కాలర్ లకు ఉచిత తరగతులు అందిస్తామని రమణ భూపతి తెలిపారు .ఆసక్తిగల విద్యార్థులు 9160 9341 49 నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.

Friday, 26 June 2026

సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శి

 జగిత్యాల జిల్లాలో డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులకు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత  సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ అందించేందుకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వహించనున్న పది నెలల ఉచిత రెసిడెన్షియల్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత భోజన మరియు వసతి సదుపాయాలతో పాటు స్టడీ మెటీరియల్ ,ప్యాకెట్ మనీ, డిజిటల్ లైబ్రరీ తదితర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు వికలాంగ అభ్యర్థులు ఆన్లైన్ వెబ్సైట్ https://tsstudycircle.co.in ద్వారా జూలై 12 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే రాజకుమార్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Monday, 15 June 2026

పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

 పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్.. గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ ఐ కానిస్టేబుల్ ఆర్ ఆర్ బి.ఎస్ ఎస్.సి డిఎస్సి వంటి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రామగుండం మేయర్ మహంకాళి స్వామి హైదరాబాద్ క చెందిన పి జె ఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. గోదావరిఖనిలోని సింగరేణి హై స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు, అర్హులైన అభ్యర్థులకు శుక్రవారం నుండి ఈ నెల 25వ తారీకు వరకు రామగుండం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను అందజేస్తామని చెప్పారు. జులై మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Saturday, 13 June 2026

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ పాషా  తెలిపారు. పదేళ్లుగా అకాడమీలో ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులు వివిధ సర్వీసులలో ఉద్యోగాలు సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను ఈనెల 20వ తేదీలోగా www.mseducationacademy.in  వెబ్సైట్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.

హైద్రాబాద్, నిజామాబాద్,నిర్మల్, మహబూబ్ నగర్, హన్మకొండ, సదా శివ పేట, ఆదిలాబాద్, బోధన్ ప్రాంతాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేస్తామని , టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తామని తెలిపారు.

మరిన్ని వివరాలకు 85208 60785 ,90300 45422 ఫోన్ నెంబర్ లలో సంప్రదించాలని సూచించారు.

Wednesday, 10 June 2026

ఉచిత నైపుణ్య అభివృద్ధి శిక్షణ .. మైనారిటీ వర్గాలకు

 తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆదేశాల మేరకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం కోసం ప్రభుత్వ ప్రైవేటు శిక్షణ సంస్థల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శశి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ముస్లింలు, బౌద్ధులు ,పార్సలు, సిక్కులు ,జైనులు తదితర మైనార్టీ వర్గాలకు చెందిన విద్యావంతులు నిరుద్యోగ మైనారిటీ యువతకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ అనుబంధమైన ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణ సంస్థల ద్వారా ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ,డిజిటల్ బిజినెస్ మొదలగు వాటిల్లో" నైపుణ్యాభివృద్ధికి ఉచిత శిక్షణ "అందిస్తామని తెలిపారు. ఎంపికైన సంస్థలు శిక్షణ ఇవ్వడమే కాకుండా, శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించవలసి ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న శిక్షణ సంస్థ లు మూడేళ్ల పనితీరుకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రాజెక్టు రిపోర్ట్ తో జత చేసి హార్డ్ కాపీలను ఈనెల 15 సాయంత్రం 5 గంటలకు లోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం కామారెడ్డి లోని రూమ్ నెబర్ 222, కలెక్టరేట్లోని రెండో అంతస్తులో సమర్పించాలని సూచించారు.

వందమందికి ఉచిత హెల్మెట్లు

 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గద్వాల సీఐ శ్రీను సూచించారు రహదారి భద్రత పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన అలా కార్యక్రమంలో భాగంగా బుధవారం గద్వాల మండలంలోని పూడూరు గ్రామంలో 100 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి సిఐటి శ్రీను రూరల్ ఎస్సై శ్రీకాంత్ నాయకత్వం వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని అది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా మన రక్షణ కవచమని అన్నారు ప్రధాన సమయంలో సెల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించే రహదారిపై పూర్తి అప్రమత్త తత్వం ఉండాలని సూచించారు అలాగే నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్టు ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో తీవ్ర గాయాలు ప్రారంభించడం నుంచి ఆయన నష్టం నుంచి రక్షణ పొందవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పెద్దలు యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

జర్మన్ భాషా శిక్షణ ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు

 నిరుద్యోగ యువతీ యువకులకు జర్మన్ భాష లో శిక్షణ ఇప్పించడం ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం టాస్క్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి చంద్రయ్య, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, టాస్క్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ,  టామ్ కామ్ మేనేజర్ నాగభారతిలతో కలిసి ఆయన మాట్లాడారు.  అవకాశాలను పొందడంలో, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహిస్తామని అన్నారు . ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపాధి అవకాశాలు ఉన్నా యని ముఖ్యంగా జర్మనీలో నైపుణ్యం కలిగిన యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్న జర్మనీలో నర్సింగ్, సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో లక్షలాది ఉద్యోగాలలో ఖాళీలు ఉన్నాయని ,తెలంగాణ యువత అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ అందిస్తుందని తెలిపారు. ఉద్యోగం ఎక్కడ లభిస్తే అక్కడికి వెళ్లి పని చేసే దృక్పథం యువత అలవర్చుకోవాలని అన్నారు. పారిశ్రామికవేత్తగా పనిచేసిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ మార్కెట్ ఉన్న ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించడం వలన వేలాది మందికి ఉపాధి కల్పించగలిగామని అన్నారు. స్థానికతకే పరిమితం కాకుండా అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్లాలని యువతకు సూచించారు. జర్మనీలో వారానికి కేవలం 32 నుంచి 35 గంటల పని సమయం మాత్రమే ఉంటుందని మిగతా సమయంలో ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, జర్మనీలో నెలకు రెండు లక్షల 50 వేల రూపాయలు ఆపైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు ఏజెన్సీల మోసాలకు గురి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన టాస్క్ ద్వారా శిక్షణ పొంది విదేశీ ఉద్యోగాలను పొందాలని తెలిపారు .ఇప్పటికే ఈ కార్యక్రమానికి 112 మంది యువత నమోదు చేసుకున్నారని, వారందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ  అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం టామ్ కామ్ సంస్థకు 90 కోట్ల రూపాయలు అందించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రెండువేల రూపాయల స్టయిఫండ్ అందిస్తుందని, అదేవిధంగా జర్మన్ భాష శిక్షణ పొందుతున్న అభ్యర్థులలో 80 శాతం హాజర నమోదు చేసుకున్న వారికి కాకా వెంకటస్వామి ట్రస్ట్ తరఫున అదనంగా నెలకు ₹1000  స్టైపండ్ అందజేస్తామని తెలిపారు .యువతలో క్రమశిక్షణ, పట్టుదల , లక్ష్య సాధన పై దృష్టి ఉండాలని, జర్మన్ భాష నేర్చుకోవడానికి  ప్రతిరోజు సాధన చేయాలని సూచించారు. మందమర్రిలో ప్రారంభమైన ఈ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రతివారం తాను స్వయంగా శిక్షణ కేంద్రాన్ని సందర్శించి అభ్యర్థులతో కలిసి జర్మనీ భాష నేర్చుకుంటానని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. అంతకుముందు క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జర్మన్ భాషా శిక్షణలో బి2 సర్టిఫికేషన్ పూర్తి చేసిన మరియన్ పాసల్, హుబా ఫాతిమా లకు ఆఫర్ లెటర్లు అందజేశారు.

మన దేశానికి ఏడాదికి 90 వేల వీసాలు ఇచ్చేందుకు జర్మనీ సిద్ధంగా ఉందనీ, జర్మనీ వీసా లో 50% సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. శిక్షణ కేంద్రంలో 4 నెలల్లో జర్మనీ భాష నేర్పిస్తారని చెప్పారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాలలో అవకాశాలకు భాషా పరిజ్ఞానం తప్పనిసరి అని ,జర్మనీలో పనిచేయాలనుకునే వారికి ఆ భాష ఒక శక్తివంతమైన సాధనం అని తెలిపారు..



Monday, 8 June 2026

ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ

 రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ చేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించమని ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వల్ల ప్లాస్టిక్ తో నిర్మితమైన వస్తువులు వాడడం వల్ల ఆరోగ్యం పాడవాడమే కాకుండా భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నామని ఆయన తెలిపారు ఏ రూపంలో కూడా ప్లాస్టిక్  నిర్మితమైన వస్తువులు వాడకూడదని అలాగే మనకు రోజు వారి కార్యక్రమంలో ఉపయోగించే బస్తాలు వాడాలని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకుండా కాటన్ తో తయారు చేసిన బ్యాగులు వాడడం వల్ల పర్యావరణాన్ని రక్షించడమే కాదు మనతోపాటు జీవిస్తున్న పశువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు మనం ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటే ఇలాంటి కాటన్ బ్యాగులను ఉపయోగించి మనకు అవసరమైన కూరగాయలు ఇతర వస్తువులను గాని తీసుకెళ్లాలని ఆయన కోరారు ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని గంజిలో గల కూరగాయల సంతలో రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచితంగా కాటన్ బ్యాగులు వినియోగదారులకు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు తప్పకుండా అందరూ ఈ చిన్న మార్పుతో నిత్యజీవితంలో కాటన్ బ్యాగు ల వాడి భవిష్యత్ తరానికి ఆరోగ్యకరమైన పర్యావరణం అందించాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్ గిరీష్ కుమార్  గంగుల విజయ్ రమేష్ సుధాకర్ సంపత్ రాజశేఖర్  శిరీష్ కుమార్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు

ఉచిత జర్మనీ శిక్షణ తరగతులు

 యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు విస్తరించేదుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉచిత జర్మనీ భాష శిక్షణ క్యాంపును నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికా రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈనెల 10న ఉదయం మందమర్రిలోని సింగరేణి ఇల్లందు క్లబ్లో శిక్షణ తరగతులను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి తిధి వెంకటస్వామి ప్రారంభించనున్నట్లు చెప్పారు మంత్రి ఆదేశాలతో జర్మనీతో పాటు యూరోపియన్ దేశాల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన భాషా నైపుణ్యాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు విదేశీ ఉపాధి అవకాశాలపై ఆసక్తి కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సేంద్రీయ సేద్యంపై తొమ్మిది నెలల ఉచిత శిక్షణ

 వ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్షయ కల్ప రైన్ మ్యాటర్ ఫెలోషిప్ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నది పాడి పశువుల పెంపకం బయోగ్యాస్ ఉత్పత్తి బయోడైజేష్టర్ ద్వారా తయారు చేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక వ్యవసాయ పద్ధతి ప పై పై 19 నుంచి 27 మధ్యన వయసుగల యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని ఈదులపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ పరిశోధన శిక్షణ కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి మూడు నెలలు రెసిడెన్షియల్ శిక్షణ తర్వాత ఆరు నెలలు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది ఉచిత భోజనము వసతి తో పాటు ఉపకార వేతనం కూడా ఇస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది మరిన్ని వివరాలకు 70222 77155 నంబర్లో సంప్రదించవచ్చు

తాళ్ల రాంపూర్ లో ఉచిత చేప మందు పంపిణీ

 నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండలంలోని తాళ్ళ  రాంపూర్ గ్రామంలో మృగశిర కార్తె సందర్భంగా సోమవారం చేపమందు పంపిణీ చేస్తున్నట్లు బెజ్జారపు లింబాద్రి తెలిపారు .గత 60 ఏళ్లుగా ఈ చేప మందు కోసం జిల్లాతో పాటు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని ఆయన తెలిపారు. ఆస్తమా, దగ్గు ,దమ్ము వంటి శ్వాస కోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చేప ముందు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతున్నారని తెలిపారు. చేప మందు పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని లింబాద్రి పేర్కొన్నారు.

ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం

 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...