44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి..
ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్ని కాపాడడం, పర్యావరణాన్ని రక్షించడం కోసం హైదరాబాద్ హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నడుం బిగించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఇందులో మూడు పండ్ల మొక్కలు, రెండు ఔషధ మొక్కలు లేదా అలంకరణ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మొక్కలను పొందడం కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మరియు మొబైల్ నెంబర్ సమర్పించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలోని 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకువెళ్లాలని ప్రజలకు సూచించింది.
ఈ సంవత్సరం లక్ష కుటుంబాలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ గోపిడి రోహిత్ తెలిపారు.

