3, ఆగస్టు 2026, సోమవారం

సాలార్జంగ్ మ్యూజియంలో ఫ్రీ ఎంట్రీ

 ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు హైదరాబాదులోని సాలార్జంగ్ మ్యూజియంలో ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ . ఈ మేరకు అన్ని జిల్లాల డిఈఓ లకు ఆదేశాలు జారీ చేశారు .విద్యార్థులకు మన దేశ సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన కల్పించేందుకు ఈ విహారయాత్రలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యాత్ర డిసెంబర్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు .ప్రభుత్వ బడులతో పాటు ప్రైవేటు ,ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులు కూడా ఈ ఉచిత సందర్శన కు అర్హులు అని ఆయన తెలిపారు. 

ఉచిత ఆర్చరీ శిక్షణ @దోమకొండ

 ఆర్చరీ క్రీడల్లో జోరుగా పతకాలు సాధిస్తున్న క్రీడాకారులు... 

దోమకొండ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తూ కఠోర సాధన తో విజయాలు సాధిస్తున్నారు .వరుస విజయాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కఠోర సాధన, లక్ష్యంపై అచంచలమైన ఏకాగ్రతతో దోమకొండ ప్రాంతానికి చెందిన యువ ఆర్చర్లు జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభను ప్రదర్శిస్తూ పతకాలు సాధిస్తున్నారు .ఆర్చరీ ఆటకు దోమకొండ కేరాఫ్ అడ్రస్ గా మారింది. 

దోమకొండ గడికోట మైదానంలో సంస్థాన వారసులైన కామినేని అనిల్ కుమార్ 2007లో ఆర్చరీ అకాడమీ ఏర్పాటుచేసి విలువిద్యకు సంబంధించిన మెలకువలను అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడి ఉచిత శిక్షణతో విలువిద్య క్రీడలో దోమకొండ విద్యార్థులు రాణిస్తున్నారు .పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆర్చరీ శిక్షకుడు ప్రతాప్ దాస్ శిక్షణలో మెలకువలు నేర్చుకొని రాష్ట్ర ,జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ పతకాలు సాధిస్తున్నారు. 

ఒకవైపు చదువుతూనే నిత్యం 4 గంటల సాధన చేస్తున్నారు. 19 ఏళ్లుగా ఇక్కడ ఎంతో మంది ఆర్చరీ లో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చారు. దోమకొండ తో పాటు బిక్నూర్ ,బీబీపేట ,మాచారెడ్డి మండలాలకు చెందిన పలు గ్రామాల విద్యార్థులతో పాటు కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు సైతం ఇక్కడికి వచ్చి విలువిద్య నేర్చుకుంటున్నారు. 

2007లో ఇక్కడ 40 మంది విద్యార్థులతో మొదలైన ఆర్చరీ శిక్షణ ప్రస్తుతం 550 మందికి చేరిందని ఆర్చరీ కోచ్ ప్రతాప్ దాస్ గారు తెలిపారు. కామినేని అనిల్ కుమార్ గారు ఉచితంగా సొంత డబ్బులతో ఆర్చరీ మెటీరియల్  అందించి వారికి పూర్తి శిక్షణ ఇప్పిస్తున్నారు. దోమకొండ, కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి, బిబిపేట, ఫరీద్ పేట, పాల్వంచ, భిక్కనూరు, రామేశ్వర పల్లి, జంగంపల్లి, కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు కొన్నేళ్లుగా ఇక్కడికి ఆర్చరీ శిక్షణ కోసం వస్తున్నారు. దీనితో ఆర్చరీ ఆట  అంటేనే దోమకొండ అనే విధంగా తయారయింది. 

దోమకొండకు చెందిన కదిరె సింధుజ పదేళ్ల నుంచి ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఇప్పటివరకు 38 సార్లు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో పాల్గొన్నది. జాతీయస్థాయిలో రెండు సిల్వర్, రాష్ట్రస్థాయిలో ఓవరాల్ గా 44 బంగారు, ఐదు సిల్వర్ పతకాలు సాధించింది. ఒలింపిక్ పతకం సాధించడమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తోంది.

భిక్కనూరుకు చెందిన నిరుపేద కూలి కుటుంబానికి చెందిన అనుదీప్ 8 ఏళ్లుగా ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ జైపూర్లో నిర్వహించిన జాతీయ  పోటీలలో సిల్వర్ మెడల్ సాధించాడు.

19 ఏళ్లుగా కోచ్ గా ప్రతాప్ దాసు గారు.. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రతాప్ దాస్ గారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. మొదట విజయవాడలో కోచ్ గా చేరారు. అనంతరం తనతో పాటు ఆర్చరీ ఆటలో పాల్గొన్న దోమకొండ గడికోట వారసులు కామినేని అనిల్ కుమార్ దోమకొండకు తీసుకు రావడంతో 19 ఏళ్లుగా ఇక్కడి విద్యార్థులకు కోచ్ గా ఉంటూ జాతీయ స్థాయిలో విద్యార్థులు పతకాలు సాధించేలా తీర్చిదిద్దారు. 

విలువిద్య శిక్షకుడు.. ప్రతాప్ దాస్..97051 41241

ఉచిత చేపలు, రొయ్యల పంపిణీ

 ఉచిత చేపలు రొయ్య పిల్లల పంపిణీ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 116 కోట్ల రూపాయల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని చెరువులు రిజర్వాయర్లు ఇతర జల వనరులలో భారీ ఎత్తున చేపలను రొయ్య పిల్లలను ఉచితంగా వదిలి ఎందుకు మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్ల చేస్తున్నారు. అతి త్వరగా టెండర్లు పిలిచి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయనున్నారు .అనంతరం జిల్లాల వారీగా చేపలు రొయ్య పిల్లలను సరఫరా చేసి చెరువులలో విడుదల చేయనున్నారు .ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వేలాది చెరువులు జలాశయాలు పూర్తిస్థాయిలో నీటితో నిండాయి. చేపల పెంపకానికి ఇదే సరైన సమయం అని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం వేగవంతం కానున్నది. 

25, జులై 2026, శనివారం

ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం

 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి..


ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్ని కాపాడడం, పర్యావరణాన్ని రక్షించడం కోసం హైదరాబాద్ హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నడుం బిగించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఇందులో మూడు పండ్ల మొక్కలు, రెండు ఔషధ మొక్కలు లేదా అలంకరణ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మొక్కలను పొందడం కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మరియు మొబైల్ నెంబర్ సమర్పించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలోని 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకువెళ్లాలని ప్రజలకు సూచించింది.

ఈ సంవత్సరం లక్ష కుటుంబాలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ గోపిడి రోహిత్ తెలిపారు.

18, జులై 2026, శనివారం

ఉచితంగా.. న్యాయ సహాయం

 న్యాయ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఎవరి సలహాలు,సూచనలు తీసుకోవాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. న్యాయ వాదులను సంపాదించాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు న్యాయ పరమైన సలహాలు,సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం " టెలీ లా"విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా ఎలాంటి ఫీజు చెల్లించకుండానే హైకోర్టు న్యాయ వాదుల నుంచి " ఉచితంగా న్యాయ సలహాలు, సూచనలు మాతృ భాష లోనే పొందే అవకాశం ఉంటుంది.

అపాయింట్ మెంట్.. 

దరఖాస్తుదారుడు ముందుగా ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ మీ సేవా, కామన్ సర్వీస్, డిజిటల్ సేవా కేంద్రాల్లో ఏదైనా ఒక దానిని సంప్రదించాలి. హైకోర్టు లాయర్ లతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉచితంగా అపాయింట్మెంట్ నమోదు చేస్తారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన సమయానికే హై కోర్టు న్యాయవాది స్వయంగా దరఖాస్తుదారుడి ఫోన్ నెంబర్ కు కాల్ చేసి మాట్లాడతారు.

అందే సేవలు ఇవే..

వరకట్న వేధింపులు, లైంగిక నేరాలు, గృహ హింస,ఉపాధి,మహిళలు,పిల్లలు, వృద్ధుల మౌలిక హక్కులు, ప్రసూతి ప్రయోజనాలు, భూ తగాదాలు, వాహన చట్టాలు,FIR నమోదు, అరెస్ట్ చేసిన వ్యక్తిని నిర్బంధించడం, RTI, CAA, NRC, అట్రాసిటీ కేసులు, ఆస్తి గొడవలు, ప్రభుత్వ పథకాలు పొందడంలో అవరోధాలు తదితర సమస్యల గురించి న్యాయ వాదుల నుంచి "ఉచితంగా" సలహాలు,సూచనలు పొందవచ్చు.

2, జులై 2026, గురువారం

ఒడిశా లో ఉచిత విద్య

 కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ గతంలో ప్రకటించారు .బుధవారం రాత్రి ఆయన అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడింది. కార్యక్రమం తర్వాత మోహన్ స్వయంగా విలేకరులకు ఈ విషయం చెప్పారు .ఏడాదిలో 38 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ,రుసుములు ఉండవని స్పష్టం చేశారు. డ్రాప్ ఔట్లు తగ్గించడం, గుణాత్మకమైన విద్యా బోధనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

డిగ్రీ విద్యార్థులకు ఉచిత ఆర్ష విద్య ప్రశిక్షణ

 దేశభక్తి దైవభక్తి గల డిగ్రీ విద్యార్థులకు ఉచిత వసతితో ఆర్ష విద్య ప్రశిక్షణ ఇవ్వనున్నట్లు కామారెడ్డి ఆర్య సమాజం ప్రతినిధి ఆచార్య సత్య మిత్ర తెలిపారు. వివిధ కళాశాలలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు యధావిధిగా తమ కోర్సులతో పాటు ఆర్ష విద్యా ప్రశిక్షణ పొందవచ్చని పేర్కొన్నారు .

ప్రశిక్షణలో వాల్మీకి రామాయణం ,మహాభారతం, భగవద్గీత, ఉపనిషత్తులు ,షోడశ సంస్కారాలు, సత్యార్థ ప్రకాశం, ఋగ్వేదాది భాష్య భూమిక ,సంస్కృత భాష, వేదాంగ ప్రకాశ నేర్పిస్తారని ఆయన తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ప్రవేశాల కొరకు 79895 13668 మరియు 93475 91380 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...