16, ఆగస్టు 2026, ఆదివారం

దో ఘంటే దేశ్ కే నామ్.. ఢిల్లీ వైద్యుల ఉచిత సేవ

 దేశం కోసం రెండు గంటలు.. 2 ఘంటే దేశ్ కే నామ్.. అనే ఆరోగ్య సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములం అవుతామంటూ ఢిల్లీ వ్యాప్తంగా పలువురు వైద్య నిపుణులు ముందుకు వస్తున్నారు. 

పేద, నిరుపేద వర్గాలకు చెందిన రోగులకు ప్రతి వారం " 2 గంటల ఉచిత కన్సల్టేషన్ సేవలు " అందించనున్నట్లు శని వారం ప్రకటించారు.కార్డియాలజీ, ఎండో క్రైనాలజీ,పీడియాట్రిక్ ,గైనకాలజీ, జనరల్ మెడిసిన్ సహా ఇతర స్పెషలిస్టులు క్రమంగా దీంట్లో నమోదు చేసుకుంటున్నారు.

మారుమూల ప్రాంతాల్లోని రోగుల కోసం " వర్చువల్ కన్సల్టేషన్ స్లాట్" లను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పిల్లల ఆరోగ్యం నుంచి మానసిక ఆరోగ్యం వరకు .. వైద్య నిపుణుల సేవలు అందిస్తామని డాక్టర్ ఇకేదా తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...