నిజామాబాద్ జిల్లా లోని బోధన్ పట్టణం లోని నర్సి రోడ్డు మారుతీ మందిరం వద్ద భక్తుల సౌకర్యార్థం " ఉచిత అన్న దాన భవనం" నిర్మాణం చేయడం అభినందనీయమని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి గారు అన్నారు.
శనివారం భవనంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం భవన నిర్మాణం చేపట్టిన కృష్ణ సైకిల్ స్టోర్స్ యజమాని వి. నరసింహ రావు గారి ని ఆలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్ రావు, శివాలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి