11, ఆగస్టు 2026, మంగళవారం

వెటివర్ ఫౌండేషన్..రైతులకు ఉచిత శిక్షణ

 వట్టి వేరు వేర్లు నేల కోతను 90% వరకు తగ్గిస్తాయి. వాన నీరు 60%వరకు భూమిలోకి ఇంకుతుంది. రైతుల్లో అవగాహన పెంచేందుకు వెటివర్ ఫౌండేషన్ వేలాది మంది రైతులకు క్షేత్ర స్థాయిలో " ఉచిత ప్రాక్టికల్ శిక్షణ" ఇస్తోంది. ఒక ఎకరం పొలంలో గట్లవెంట నాటేందుకు సుమారు 2,000-3,000 వ్యాధి రహిత పిలకలు అవసరమవుతాయి. నాణ్యమైన వట్టి వేరు పిలకలను కూడా ఫౌండేషన్ రైతులకు పంపిణీ చేస్తోంది. 

వట్టివేరుపై సమగ్ర శిక్షణ ఇస్తాం..

అనేక ఔషధ,సుగంధ పంటలతో పాటు వట్టి వేరు పంట సాగు పద్ధతులు , అనువైన నేలలు,ప్రాసెసింగ్ పద్ధతులు వాణిజ్య అవకాశాలు తదితర అంశాలపై రైతులకు హైద్రాబాద్ బోడుప్పల్ లోని కార్యాలయంలో అప్పుడప్పుడు శాస్త్రీయంగా,సమగ్ర శిక్షణ ఇస్తున్నామని సైంటిస్ట్ కిరణ్ బాబు తెలిపారు.నాణ్యమైన వట్టి వేరు పిలకలను కూడా రైతులకు అందుబాటులోకి తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు.



ఆసక్తి గల రైతులు సంప్రదించాలని ఆయన సూచించారు. 

డా. జీడీ కిరణ్ బాబు, సైంటిస్ట్ ఇంచార్జ్ , కేంద్రీయ ఔషధ , సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ ( సీ ఎస్ ఐ ఆర్ సీమాప్),బోడుప్పల్ , హైద్రాబాద్ 

+91-40-27201131,27200272,

Email.. crchyd@cimap.res.in


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...