16, ఆగస్టు 2026, ఆదివారం

ఉచిత కోచింగ్ కు కేంద్రం శ్రీకారం

 పేద మధ్యతరగతి కుటుంబాలకు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోవడం అనేది పెద్ద భారంగా మారిందని,  ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను  కోచింగ్ తరగతులకు పంపకపోతే తాము గౌరవనీయమైన కుటుంబం  కాదని భావిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 

ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశానికి ఇచ్చిన సందేశంలో ప్రధాని మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని వారు కోచింగ్ కోసం ఖర్చు చేస్తున్న వేలాది కోట్ల రూపాయలను ఆదా చేయించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. మన యువత తమ కుటుంబాల దగ్గరే ఉండి వారి సంరక్షణ పొందాలి అదనపు ఆర్థిక భారం పడకూడదు కాబట్టి దేశ యువతకు వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించాలని నిర్ణయించుకున్నామని ప్రధాని తెలిపారు. మన వద్ద ఉన్న అద్భుతమైన ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు, అందుబాటులో ఉన్న డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు కలిపి "దేశ యువతకు ఉచిత కోచింగ్ అందించే సమగ్ర వ్యవస్థను"  నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చర్య ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు ఆదా చేసుకోగలుగుతాయి. వారి పిల్లలు ఇంటి దగ్గరే ఉండే సిద్ధం కావచ్చు, తల్లిదండ్రులు వారిని సంరక్షించుకోవచ్చు అని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. 

వచ్చే ఏడాది లో ఒక కోటి మంది యువతకు ఏ ఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని సంకల్పం తీసుకున్నామని ,వారు ఏ ఐ ప్రపంచానికి నాయకత్వం వహించాలని ప్రధాని ఆకాంక్షించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...