దోమకొండలో చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకు రావడానికి దోమకొండ గడికోట ట్రస్ట్ వారి సహకారంతో "ఉచిత చేనేత శిక్షణ తరగతులు"నిర్వహిస్తున్నట్లు హైద్రాబాద్ చేనేత సేవా సంస్థ ప్రతినిధులు పవన్, సంతోష్ లు తెలిపారు.
గురువారం దోమకొండ మండల కేంద్రంలోని ఉమా బాగ్ లో చేనేత శిక్షణ తరగతులు ప్రారంభించి ,మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నర్సయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్ధరాములు, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, గడికోట ట్రస్ట్ సీనియర్ మేనేజర్ బాబ్జీ, ప్రతినిధులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి