Monday, 25 May 2026

ఆర్మూర్ లో ఉచిత శిక్షణ

 


మామూలు రోజుల్లో సెల్ ఫోన్ దొరికితే చాలు పిల్లలు పట్టుకుంటారు ఇక వేసవి సెలవుల్లో అయితే సెల్ ఫోన్ టీవీ తదితర వాటికి అతుక్కుపోతారు. ఈ వేసవి సెలవులు మాత్రమే వినూత్నంగా సాగుతున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలతో పాటు ప్రైవేటు సమ్మర్ క్యాంపులు సైతం విద్యార్థులతో కిట కిట లాడుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల బియ్యం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మోడల్ స్కూల్ కస్తూర్బా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు మొత్తం 90 మంది రోజు హాజరవుతున్నట్లు హెచ్ ఎం తెలిపారు డ్రాయింగ్ హార్ట్ అండ్ క్రాఫ్ట్ సంగీతం యోగ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు వేసవి సెలవులను పిల్లలు వృధా చేయకుండా శిక్షణ పొందడం ప తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

RIDO NGO ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం

 నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆర్ ఐ డి వో ఎన్ జి ఓ ఆధ్వర్యంలో శనివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది .దంత సమస్యలతో బాధపడుతున్న పలువురికి  " ఉచితంగా వైద్య పరీక్షలు " నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్ ముఖ్య అతిథి గా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. గౌతమ్ నగర్ కార్పొరేటర్ శివ చరణ్, నరేందర్ ,సీనియర్ న్యాయవాది మురళీధర్ రావు తదితరులు పాల్గొని నిర్వహకులను అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆర్ఐడిఓ ఎన్జీవో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అని అన్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు" ఉచిత వైద్య సేవలు " అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించే కార్యక్రమాలు" ఉచిత వైద్య శిబిరాలు " మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమం విజయానికి సహకరిస్తున్న వైద్యులు, అతిథులు మరియు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్మూర్ లో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం

 వేసవి సెలవులను కొందరు చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. నచ్చిన ఆటలలో నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో యువత కోసం ఆర్మూర్ లో" ఉచిత క్రికెట్ శిక్షణ" శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 13వ తారీఖున మామిడిపల్లి సెయింట్ పాల్ పాఠశాల గ్రౌండ్లో ప్రారంభమైన శిక్షణ జూన్ 1వ తేదీ వరకు కొనసాగుతుంది. చాలామంది ఒత్సాహికులు శిక్షణ పొందడానికి తరలివస్తున్నారు. బ్యాట్ పట్టి క్రికెట్ ఆట పై పట్టు సాధిస్తున్నారు. అవసరమైన మెలకువలను నేర్చుకుంటున్నారు.. తమ ఆటకు పదును పెట్టుకుంటున్నారు.

Sunday, 24 May 2026

ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు పొడిగింపు

 భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI మై ఆధార్ పోర్టల్ లో ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్ డేట్ గడువు ను పొడిగించింది. ఆధార్ కార్డు దారులు ఇప్పుడు తమ గుర్తింపు,చిరునామా ఆధార పత్రాలను ఎలాంటి ఫీజు లేకుండా 2027 జూన్ 14 వరకు అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకుంటున్న ఆధార్ కార్డు దరుల నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో ఉంచుకొని ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

ఆధార్ కార్డుదారులు కొత్త ఆధార్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ కొత్త యాప్ లో సురక్షితమైన ఆధార్ క్యూఆర్ ఆధారిత   ఆధార్ షేరింగ్, మెరుగైన ప్రైవసీ నియంత్రణలు, ఆధార్ సేవలకు సులభమైన యాక్సెస్ వంటి ఫీచర్లు ఉన్నాయని UIDAI వివరించింది. 

5-17 ఏళ్ల వారికి ఆధార్ సవరణ ఉచితం

 ఐదు నుంచి 17 ఏళ్ల వయసు గల వారికి మొదటిసారి ఆధార్ కార్డులో వివరాలను ఆధార్ కేంద్రాలలో సవరణ చేసుకుంటే ఎటువంటి రుసుము చెల్లించే అవసరం లేదని UIDAI హైదరాబాద్ రీజినల్ అధికారులు తెలిపారు.

ఐదేళ్లు నిండిన తర్వాత చేసే సవరణలో పిల్లల బయోమెట్రిక్, ఐరిస్ తీసుకుంటారని తెలిపారు. సాధారణంగా ఐదు నుంచి ఏడు ఏళ్లు మరియు 15 నుంచి 17 ఏళ్లు మధ్య వయసు గల వారికి మాత్రమే నమోదు కేంద్రాలలో మొదటిసారి వివరాల సవరణలను ఉచితంగా చేస్తారు .కానీ ఈసారి ఐదు నుంచి 17 ఏళ్ల వయసు గల వారందరికీ సెప్టెంబర్  30 వరకు ఉచితంగా సవరణ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఆధార్ కార్డులో చిరునామా తదితర వివరాలను ఆన్లైన్లో ఉచితంగా సవరించుకునే అవకాశం ఈ ఏడాది జూన్ 14 వరకు ఉండగా దీనిని మరొక ఏడాది పొడిగించినట్లు తెలిపారు.

పాయల్ ఫౌండేషన్.. ఉచిత అన్న దానం

 పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత అన్నదానం ..

బేల సబ్ మార్కెట్ యార్డులో పంటలను అమ్ముకోవడానికి వస్తున్న రైతులకు పాయల్ ఫౌండేషన్ ఉచితంగా అన్నదానం చేస్తూ ఆదుకుంటుంది. మార్కెట్ యార్డ్ కి వచ్చిన రైతులకు అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమని పాయల్ శంకర్ ఫౌండేషన్ నిర్వాహకులు అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వారు తెలిపారు. మార్కెట్ యార్డ్ అధికారులు రైతులకు గన్ని బ్యాగులు, చల్లటి మంచినీటి వసతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు  ఇంద్రశేఖర్, భూపతి రెడ్డి ,నవీన్ ,దత్త నిక్కం,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 19 May 2026

21 నుండి ఏఐపై ఉచిత శిక్షణ

 21 నుండి ఏఐపై ,ఎమర్జింగ్ టెక్నాలజీ పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోని యువతకు ఏఐ ,ఎమర్జింగ్ టెక్నాలజీలు, స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలలో నాలుగు రోజుల పటు సదస్సులు నిర్వహించనున్నట్లు బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.

ఈనెల 21 నుండి జూన్ 11 వరకు జిల్లాలలో కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. సైదాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ ప్రధాన కార్యాలయంలో ఈనెల 21 నుంచి 26 వరకు సదస్సు ఉంటుందని ఆయన వివరించారు. జిల్లాల వారీగా షెడ్యూల్ను ప్రకటించామని 12 జిల్లాల్లోని స్టడీ సర్కిల్లోఇవి కొనసాగుతాయన్నారు.

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...