9, ఆగస్టు 2026, ఆదివారం

ఉచిత మధుమేహ చికిత్స@ డా. మోహన్స్ డైరెక్ట్

 మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు మాత్రమే పెరుగుతాయి.. అనుకుంటాము కానీ కాళ్లకు పుండ్లు , కంటి సమస్యలు ,మూత్రపిండాల సమస్యలు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఎదురవుతుంటాయి. అవగాహన ఉన్న వ్యక్తులు అయితే వాటన్నింటినీ గమనించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటారు. మరి పేదవాళ్లు, అవగాహన లేని వారు.. మధుమేహం గురించి సరిగా తెలియక, ఖరీదైన వైద్యం చేయించుకోలేక మరెన్నో సమస్యల బారిన పడుతుంటారు. అలాంటి వారికి ఉచిత మధుమేహ వైద్యాన్ని అందించేందుకు డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ వారు " డైరెక్ట్" ను ప్రారంభించారు. 

షుగర్ రోగులు ఎక్కువగా వెళ్ళే ఆసుపత్రులలో డాక్టర్ మోహన్స్ ఆసుపత్రి ఒకటి. భారతదేశవ్యాప్తంగా 50 కి పైగా శాఖలు ఉన్న ఈ సెంటర్ కు వచ్చే రోగులలో పేదలూ ఉంటారు .అయితే వారు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే ఇక్కడ జీవితాంతం ఉచితంగా చికిత్స చేయించుకునే వీలు ఉంది. ఒకవేళ షుగర్ వ్యాధి ముదిరి కంటి ఆపరేషన్ తప్పనిసరి అయినా, ఫుట్ అల్సర్ కారణంగా పాదాలకు ఆపరేషన్ చేయాల్సి వచ్చినా అది కూడా ఫ్రీగానే నిర్వహిస్తారు ఇక్కడ. ఆరోగ్యం పైన కాస్త అవగాహన ఉన్నవారు లేదా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారితో పోలిస్తే.. రోజు కూలీలు, పేదలు, గ్రామాల్లో ఉండే వారికి మధుమేహం గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ ఆ లక్షణాలు కనిపించినా వైద్యం కోసం ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది కనుక నిర్లక్ష్యంగా ఉంటుంటారు, అలాంటివారికి మధుమేహ చికిత్సను ఉచితంగా అందించేందుకు" డాక్టర్ మోహన్స్"  2006 లో "డైరెక్ట్"  డయాబెటిస్ ఇంటర్నేషనల్ రీసర్చ్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించింది. మధుమేహం గురించి అవగాహన కల్పిస్తూనే పరీక్షలు చేయడం, చికిత్స అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు, కౌన్సిలింగ్ ఇలా అన్ని రకాల సేవలను ఆ రోగులకు జీవితాంతం అందిస్తుంది ఈ డైరెక్ట్.

మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. కొందరికి జన్మతః వస్తుంది. దానిని టైప్ వన్ డయాబెటిస్ అంటారు. మరొకటి టైప్ టు డయాబెటిస్ ..ఇది ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, వేళకు నిద్రపోకపోవడం, ఒత్తిడి తదితర కారణాలతో మొదలవుతుంది .రెండింటిలో టైప్ వన్ మధుమేహం చికిత్స కాస్త ఖర్చుతో కూడుకుంది. వారు జీవితాంతం ఇన్సులిన్ తీసుకుంటూ, నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. అదే టైప్ టు ని తీసుకుంటే వైద్యులు సూచించిన మందులు వాడుతూ, జీవనశైలిలో మార్పులు చేసుకుని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఈ రెండింటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కళ్ళతో పాటు మూత్రపిండాల పైన కూడా ప్రభావం పడుతుంది. కాళ్లకు దెబ్బ తగిలి చిన్న గాయమైనా పుండుగా మారి ఒక పట్టాన తగ్గక ఆపరేషన్ వరకు వెళ్లాల్సి రావచ్చు. పేదలకు, పల్లె ప్రజలకు ఇవన్నీ పెద్దగా తెలియవు కనుక" డైరెక్ట్ " మధుమేహం గురించి తెలియజేస్తూనే వారికి ఉచిత పరీక్షలను నిర్వహిస్తుంది. సమస్య ఉందని తేలితే మందులను లేదా ఇన్సులిన్ కిట్ ను అందిస్తుంది. షుగర్ లెవెల్స్ ను అంచనా వేసే గ్లూకోజ్ సెల్ఫ్ మానిటరింగ్ మిషన్ తో పాటు అవసరమైన వారికి ఇన్సులిన్ పంప్స్ ను ఇస్తారు. ఇప్పటివరకు తమిళనాడులోని కాంచీపురం లో ఐదు గ్రామాలు ,చూనంపేట్ చుట్టుపక్కల 14 గ్రామాలు కలిపి దాదాపు 15 వేల మంది మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉచిత చికిత్సను అందించే ప్రయత్నం చేస్తోంది" డైరెక్ట్" . 

అదే సమయంలో టైప్ వన్ డయాబెటిస్ బారిన పడిన 600 మందికి పైగా బాల నేరస్తులకు ఉచిత ఇన్సులిన్ కిట్స్ పంపిణీ చేసింది. హైదరాబాదులోనూ టైప్ వన్ బాధితులను గుర్తించి ఇన్సులిన్ అందిస్తోంది .వీటితో పాటు  చికిత్స విషయంలో సందేహాలు ఉన్నవారు తరచు ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా మొబైల్ టెలి మెడిసిన్ సేవలను ప్రారంభించింది. అంటే" డైరెక్ట్"  సిబ్బంది రోగులకు నిత్యం అందుబాటులో ఉంటారు. అదే సమయంలో ఆ నిర్వాహకులు స్థానిక స్వయం సహాయక బృందాలలోని మహిళలను, యువతను వాలంటీర్లుగా మార్చి వారి ద్వారా మధుమేహ బాధితులు తీసుకోవలసిన పోషకాహారం ,జీవన విధానంలో చేసుకోవలసిన మార్పుల పైన అవగాహన కల్పించేలా ప్రోత్సహిస్తున్నారు.

 మధుమేహానికి ఆర్థిక పరిస్థితులు అడ్డు రాకూడదన్న ఆలోచనతోనే డైరెక్ట్ ను ప్రారంభించాము, మధుమేహం కారణంగా కళ్ళూ లేదా పాదాలకు ఆపరేషన్లను ఆసుపత్రుల్లోనే ఉచితంగా చేస్తూ, వారు పూర్తిగా కోలుకునే వరకు మేము పర్యవేక్షిస్తాం అనే డాక్టర్ వి మోహన్ ఇందుకోసం డయాబెటాలజిస్టులు, నర్సులు, డైటీషియన్లు, టెక్నీషియన్లు, సర్జన్లు, కౌన్సిలర్లతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక పేదల ఆరోగ్య పరిస్థితి, కుటుంబ వివరాలు, నెలసరి ఆదాయం వంటివన్నీ అంచనా వేశాకే ఉచిత చికిత్సను అందించే " డైరెక్ట్ "  టెలీ మెడిసిన్ తో పాటు తమిళనాడులోని డాక్టర్ మోహన్స్ ఆసుపత్రి లో "ఎం విశ్వనాథన్ ఫ్రీ డయాబెటిస్ క్లినిక్ " అనే పేరుతో ఒక క్లినిక్ ను ప్రారంభించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థతో కలిసి ఈ సేవలను అందిస్తున్న" డైరెక్ట్"  కర్ణాటక, కేరళ, ఒడిశా ,పుదుచ్చేరి.. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. 



8, ఆగస్టు 2026, శనివారం

సాధారణ ప్రజలకు.. యూ పీ ఐ సేవలు ఉచితమే

 చిన్న వ్యాపారులు, సాధారణ ప్రజానీకం పై ఎలాంటి భారం పడదని , యూపీఐ చెల్లింపులు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రజల సందేహాలకు స్పష్టత ఇస్తూ.. చెల్లింపుల చట్టంలోని సెక్షన్ 10 ఏ ను సవరించి మర్చంట్ డిస్కౌంట్ రేట్ నిబంధనలకు చట్ట బద్ధత కల్పిస్తున్నామన్నారు. 

ఈ  ఎం డీ ఆర్ ఛార్జీలు కేవలం రూ 1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారులకు , అది కూడా రూ. 2000 పై బడిన లావాదేవీలపై 0.3% నుండి 0.5% వరకు మాత్రమే విధించే ఆలోచన ఉందని ఆమె తెలిపారు. 

అగ్నివీర్ ఉత్తీర్ణులకు "ఉచిత ఫిజికల్ కోచింగ్"

 తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో తాడ్వాయి మండలం తోపాటు కామారెడ్డి జిల్లా కు చెందిన అగ్నివీర్ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణులైన యువతకు ఫిజికల్ ట్రైనింగ్ కోసం అరుదైన అవకాశం కల్పిస్తున్నట్లు " సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ (ఎస్ వై ఎం ఎస్) కామారెడ్డి జిల్లా ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేమె రాజిరెడ్డి గారు తెలిపారు . అగ్నివీర్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి జరిగే ఫిజికల్ పరీక్షలకు మెరుగైన శిక్షణ పొందేందుకు ఎస్ వై ఎం ఎస్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందించ నున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 

హన్మకొండ లోని రామప్ప డిఫెన్స్ & జూనియర్ కళాశాల యాజమాన్యం , సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ చేస్తున్న సేవలను గుర్తించి ,తమ సంస్థ ద్వారా ఇప్పటివరకు 70 మంది అగ్నివీర్ ఉత్తీర్ణులకు" ఉచితంగా ఫిజికల్ కోచింగ్ " అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన యువత తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 94942 60214 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ శ్రీ దేమె రాజిరెడ్డి గారు పేర్కొన్నారు.

6, ఆగస్టు 2026, గురువారం

మైనారిటీ స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణ లు

 తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అర్హులైన మైనారిటీ లకు వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతం పోలీస్ శాఖ లోని వివిధ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు MD యాకూబ్ పాషా తెలిపారు. 

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల  చేశారు.SI పోస్టులకు 50 మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 100 మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. 

పూర్తి సమగ్ర వివరాలకు..

85208 60785, 040-23236112, 90590 50062 నంబర్ లలో సంప్రదించాలని ఆయన సూచించారు. 

పేద పిల్లలకు ఉచిత విమాన యానం

 ఆకాశ యానం అందరికీ అందదు. ఆ అందని ఆకాశ ప్రయాణాన్ని పేద పిల్లలకు ఉచితంగా అందించేందుకు ఉత్తరాఖండ్ లో ఉన్న హల్ద్వానీ నగరంలోని పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ లోని విమానం బయలుదేరి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగింది. ఆదివారం జరిగిన ఈ విమాన ప్రయాణం లో 30 మందికి పైగా నిరుపేద కుటుంబాల పిల్లలు ప్రయాణించారు. ఆ పిల్లల కోసం విమాన టికెట్లను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు వ్లాగర్ సౌరభ్ జోషి, ఆయన సతీమణి అవంతికా భట్ లు బుక్ చేశారు. ఆ పిల్లల తో పాటు వారూ ప్రయాణించారు. నోయిడా లోని గేమింగ్ జోన్ లో పిల్లలను ఆడిస్తూ రోజంతా సరదాగా గడిపారు. 

రెస్టారెంట్ లో పిల్లలకు ఇష్టమైన పిజ్జాలు, బర్గర్ లు ఆర్డర్ చేశారు. ఆ పిల్లల సందడి, అల్లరి, సంతోషాలను వీడియో తీసి సౌరభ్ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేశాడు. అవంతిక తన ఇన్స్టా గ్రామ్ హ్యాండిల్ లో పోస్టు చేసింది. 

పేద పిల్లల సంతోషం కోసం ఒక రోజు చేసిన ఖర్చు కన్నా వారి సంతోషం కోసం శ్రద్ధ చూపినందుకు సోషల్ మీడియాలో ఎంతో మంది అవంతిక జోడీ ని ప్రశంసించారు. కొన్ని నెలల క్రితం అవంతిక, సౌరభ్ లు విడిపోతున్నారని, అందుకే వారిద్దరూ వీడియోల్లో కనిపించడం లేదని పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లకు తాజాగా వారి వీడియోలు సమాధానం ఇస్తున్నాయి. పురాతన కాలంలో పావురాలతో సందేశం పంపినట్లు, ఈ జోడీ వీడియో తో నెటిజన్ లకు సందేశం పంపింది .

పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ .. ఉచిత శిక్షణలు

 తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ తెలిపింది.

ప్రస్తుతం  ఎస్ ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు " ఉచిత శిక్షణ తో పాటు వసతి సౌకర్యం" కల్పించాలని పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ నిర్ణయించింది. 300 మంది అభ్యర్థులకు ప్రత్యక్షంగా .. మరో 300 మందికి ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. లయన్స్ క్లబ్ మరియు రాంకీ గ్రూప్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ప్రొ. లక్ష్మీ కుమారి తెలిపారు. 

 సెప్టెంబర్ 15 నుంచి మొదలయ్యే శిక్షణ ఎస్ ఐ మెయిన్స్ పరీక్షలు ముగిసే వరకు కొనసాగుతుంది.

ఆసక్తి గల అభ్యర్థులు 95424 33427 ఫోన్ నెంబర్ లేదా https://paravasthucreativefoundation.net వెబ్ సైట్ ను సందర్శించాల్సిందిగా కోరారు. 

5, ఆగస్టు 2026, బుధవారం

యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి

 తెలంగాణ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు కామారెడ్డి జోన్ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతలో ఉపాధి పొందడానికి కావలసిన వివిధ నైపుణ్యాలను పెంపొందించడానికి సంస్థ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఇందుకోసం 45 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇతర సమగ్ర వివరాలకు 63000 57052 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. 

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...