ఇన్ఫోసిస్ సహకారంతో లెర్నెట్ స్కిల్స్ వారి ఆధ్వర్యంలో ఖమ్మం లోని వైరా రోడ్ లో గల స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్లో యువతకు ఉచితంగా శిక్షణ అందజేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు లార్నెట్ స్కిల్స్ ఖమ్మం కోఆర్డినేటర్ బి నరసింహరావు తెలిపారు. 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల వయసు లోపు గల యువత ఇంటర్ ఆపై చదివిన వారు అర్హులని తెలిపారు. శిక్షణ రోజుకు నాలుగు గంటల పాటు 25 రోజులు ఇవ్వబడును ని శిక్షణ అనంతరం ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడతాయని తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుండి శిక్షణ ప్రారంభమవుతుందని వివరాలకు 9652711 341 ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
Sunday, 28 June 2026
Saturday, 27 June 2026
ఉచిత రెసిడెన్షియల్ నీట్ కోచింగ్
క్వాలిటీ థాట్, అన్ అకాడమీ సెంటర్ ల సంయుక్త నిర్వహణలో..
క్వాలిటీ థాట్ , అన్ అకాడమీ సెంటర్ మాదాపూర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న" క్యూటీ యూ ఎన్ ఏ నీట్ మిషన్ 100 ఉచిత రెసిడెన్షియల్ నీట్ కోచింగ్ " కార్యక్రమాన్ని శుక్రవారం మాదాపూర్ లోని అన్నకాడమీ సెంటర్లో ప్రారంభించారు . క్వాలిటీ థాట్ ఫౌండర్, అన్ అకాడమీ సెంటర్ ఫ్రాంచైజీ భాగస్వామి రమణ భూపతి కార్యక్రమాన్ని ప్రారంభించగా ,ఫౌండేషన్ వ్యవస్థాపకుడు క్రిష్ చింతలూరు ,జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ వెంకట్ పవన్ ,అనస్తీసియ విభాగాధిపతి డాక్టర్ వేణుగోపాల్, సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మడాల ,ఎయిమ్స్ ట్రామా సర్జన్ డాక్టర్ దామోదర్ కాకుమాను పాల్గొన్నారు. జులై 1 నుండి 14వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో 150 మంది రెసిడెన్షియల్ విద్యార్థులకు ఉచిత కోచింగ్ ,వసతి, భోజనం అలాగే 500 మంది డే స్కాలర్ లకు ఉచిత తరగతులు అందిస్తామని రమణ భూపతి తెలిపారు .ఆసక్తిగల విద్యార్థులు 9160 9341 49 నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.
Friday, 26 June 2026
సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శి
జగిత్యాల జిల్లాలో డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులకు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ అందించేందుకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వహించనున్న పది నెలల ఉచిత రెసిడెన్షియల్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత భోజన మరియు వసతి సదుపాయాలతో పాటు స్టడీ మెటీరియల్ ,ప్యాకెట్ మనీ, డిజిటల్ లైబ్రరీ తదితర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు వికలాంగ అభ్యర్థులు ఆన్లైన్ వెబ్సైట్ https://tsstudycircle.co.in ద్వారా జూలై 12 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే రాజకుమార్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Monday, 15 June 2026
పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్
పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్.. గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ ఐ కానిస్టేబుల్ ఆర్ ఆర్ బి.ఎస్ ఎస్.సి డిఎస్సి వంటి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రామగుండం మేయర్ మహంకాళి స్వామి హైదరాబాద్ క చెందిన పి జె ఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. గోదావరిఖనిలోని సింగరేణి హై స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు, అర్హులైన అభ్యర్థులకు శుక్రవారం నుండి ఈ నెల 25వ తారీకు వరకు రామగుండం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను అందజేస్తామని చెప్పారు. జులై మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Saturday, 13 June 2026
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ పాషా తెలిపారు. పదేళ్లుగా అకాడమీలో ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులు వివిధ సర్వీసులలో ఉద్యోగాలు సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను ఈనెల 20వ తేదీలోగా www.mseducationacademy.in వెబ్సైట్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.
హైద్రాబాద్, నిజామాబాద్,నిర్మల్, మహబూబ్ నగర్, హన్మకొండ, సదా శివ పేట, ఆదిలాబాద్, బోధన్ ప్రాంతాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేస్తామని , టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తామని తెలిపారు.
మరిన్ని వివరాలకు 85208 60785 ,90300 45422 ఫోన్ నెంబర్ లలో సంప్రదించాలని సూచించారు.
Wednesday, 10 June 2026
ఉచిత నైపుణ్య అభివృద్ధి శిక్షణ .. మైనారిటీ వర్గాలకు
తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆదేశాల మేరకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం కోసం ప్రభుత్వ ప్రైవేటు శిక్షణ సంస్థల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శశి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ముస్లింలు, బౌద్ధులు ,పార్సలు, సిక్కులు ,జైనులు తదితర మైనార్టీ వర్గాలకు చెందిన విద్యావంతులు నిరుద్యోగ మైనారిటీ యువతకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ అనుబంధమైన ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణ సంస్థల ద్వారా ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ,డిజిటల్ బిజినెస్ మొదలగు వాటిల్లో" నైపుణ్యాభివృద్ధికి ఉచిత శిక్షణ "అందిస్తామని తెలిపారు. ఎంపికైన సంస్థలు శిక్షణ ఇవ్వడమే కాకుండా, శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించవలసి ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న శిక్షణ సంస్థ లు మూడేళ్ల పనితీరుకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రాజెక్టు రిపోర్ట్ తో జత చేసి హార్డ్ కాపీలను ఈనెల 15 సాయంత్రం 5 గంటలకు లోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం కామారెడ్డి లోని రూమ్ నెబర్ 222, కలెక్టరేట్లోని రెండో అంతస్తులో సమర్పించాలని సూచించారు.
వందమందికి ఉచిత హెల్మెట్లు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గద్వాల సీఐ శ్రీను సూచించారు రహదారి భద్రత పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన అలా కార్యక్రమంలో భాగంగా బుధవారం గద్వాల మండలంలోని పూడూరు గ్రామంలో 100 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి సిఐటి శ్రీను రూరల్ ఎస్సై శ్రీకాంత్ నాయకత్వం వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని అది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా మన రక్షణ కవచమని అన్నారు ప్రధాన సమయంలో సెల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించే రహదారిపై పూర్తి అప్రమత్త తత్వం ఉండాలని సూచించారు అలాగే నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్టు ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో తీవ్ర గాయాలు ప్రారంభించడం నుంచి ఆయన నష్టం నుంచి రక్షణ పొందవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పెద్దలు యువకులు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం
44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...