14, ఆగస్టు 2026, శుక్రవారం

పోలీస్ అభ్యర్థినులకు .. ఉచిత శిక్షణ

 రెండు దశాబ్దాలుగా ఉచిత సేవలు..అభయ ఫౌండేషన్

పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న నిరుపేద మహిళా అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అభయ ఫౌండేషన్ గురువారం నాడు ప్రకటించింది. 100 రోజుల పాటు జరిగే ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో అభ్యర్థులకు "ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయం కూడా" కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఇబ్రహీం పట్నం లోని అభయ ఆనంద నిలయంలో జరిగే ఈ ఉచిత శిక్షణ కార్య క్రమానికి "రీగల్ రెక్స్ నార్డ్, వీ ఎం ఆర్ లాజిస్టిక్స్ సంస్థలు సహకరిస్తున్నట్లు ఫౌండేషన్ పేర్కొంది. 

సీనియర్ ఇన్స్పెక్టర్ పీ. జగదీశ్వర్ పర్యవేక్షణలో ఇది జరగనుంది. అభ్యర్థినులను ఎంపిక చేయడానికి ఆదివారం రాష్ట్రంలోని 12 కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్ లతో పాటు మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ముల్కనూర్, ఖమ్మం, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్, సిద్ధి పేట, సంగారెడ్డి లలో అర్హతా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 

మరిన్ని సమగ్ర వివరాలకు 9963002727,9959220450,7032813578 నంబర్ లలో సంప్రదించాలని అభయ ఫౌండేషన్ కోరింది. గత రెండు దశాబ్దాలుగా ఈ తరహా సేవలు అందిస్తున్నామని నిర్వాహకులు వివరించారు.

13, ఆగస్టు 2026, గురువారం

వాట్సాప్ లో hi.. రూ 5 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్

 భారత దేశం లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆసుపత్రి ఖర్చుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన పథకం" ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన PM JAY. ఈ పథకం ద్వారా అర్హులైన పేద మధ్య తరగతి కుటుంబాలకు సంవత్సరానికి రూ 5 లక్షల వరకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా నగదు రహిత వైద్య చికిత్స అందుతుంది. 

ఫ్రీ గా ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స పొందేందుకు ఈ ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ అత్యంత కీలకం. ఈ హెల్త్ కార్డ్ పొందడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో నుండే మీ మొబైల్ ఫోన్ లోని అధికారిక వాట్సప్ చాట్ బాట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రభుత్వ అధికారిక ఆయుష్మాన్ సారధి వాట్సాప్ నంబర్  +91 72908 23838 కు " hi" లేదా" hello" అని మెసేజ్ పంపి ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు. చాట్ బాట్ సూచనల ప్రకారం మై ఆయుష్మాన్ కార్డ్ ఆప్షన్ ను ఎంచుకుని , ఈ- కే వై సి పూర్తి చేసి నేరుగా కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

వాట్సాప్ తో పాటు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అధికారిక వెబ్ సైట్ అయిన beneficiary.nha.gov.in ను సందర్శించి మొబైల్ నెంబర్, OTP ద్వారా లాగ్ ఇన్ కావాలి. అడిగిన వివరాలు ఎంటర్ చేసి మీ పేరు, గుర్తింపు నంబర్ ఆధారంగా వివరాలు సెర్చ్ చేసి , ఫోటో అప్ లోడ్ చేసి అవసరమైన వివరాలు సబ్మిట్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. 

ఈ పథకం కింద ఎలాంటి ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు నిండిన వృద్ధులందరూ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ పొందేందుకు అర్హులే. వీరితో పాటు 2011 సామాజిక ఆర్థిక కుల గణన SECC డేటా ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల లోని ఆర్థికంగా వెనుకబడిన అనేక కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సులభ విధానాన్ని అనుసరించి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందవచ్చు. 

ఉచిత కుట్టు మిషన్ లు.. బీసీ మహిళలకు

 బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే లక్ష్యంతో కీలక స్కీంకు శ్రీకారం చుడుతున్నారు ప్రభుత్వ అధికారులు.  కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యమున్న పేద ,నిరుద్యోగ, బిసి మహిళలకు 100% ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమషన్లను ఉచితంగా అందజేయనున్నారు.

 రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 1,19000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లను బీసీ మహిళలకు అందిస్తున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టుమిషన్లను అందజేయడం ఈ స్కీం యొక్క ఉద్దేశం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కుట్టవృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మహిళల ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని అర్జించే స్వయం ఉపాధి మహిళలుగా, భవిష్యత్తు మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. పథకం విధివిధానాలు ,కేటాయించిన బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు ,దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాము వెల్లడించారు. 



ఒక్కో కుట్టు మిషన్ విలువ 12,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 15 తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు నిర్ణీత గడువులో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేసి దశల వారీగా కుట్టు మిషన్ లు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. . 

నిరుపేదలు,వితంతువులు, ఒంటరి మహిళలు,నిరాశ్రయులు,అనాథలు,దివ్యాంగులు, కుట్టు వృత్తి లో అనుభవం ఉన్న మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.

ఎంపిక ఇలా.. మండల స్థాయి కమిటీకి ఎం పీ డీ ఓ, మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ ల ప్రతినిధులు , కలెక్టర్ నామినేట్ చేసిన వ్యక్తి , డీ ఆర్ డీ ఏ ప్రతినిథి తో కలిపి మొత్తం ఏడుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో పదిమంది అధికారులు సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ ఆమోదించిన అర్హుల జాబితాను బీసీ సహకార సంస్థ ఎండి ఆమోదించిన అనంతరం కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. కుట్టు మిషన్ల కొనుగోలు ప్రక్రియను కేంద్రీకృత టెండరింగ్ విధానంలో చేపట్టనున్నారు. 

అర్హతలు ఈ విధంగా ఉన్నాయి.. బీసీ నిరుద్యోగ మహిళ అయి ఉండాలి, 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలకు మించ కూడదు. ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు .అర్హులు  https://tgobmms.chg.gov.in  వెబ్ పోర్టల్ ద్వారా మీ సేవ లేదా ఏదైనా ఆన్ లైన్ కేంద్రం ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత కమ్యూనిటీకి నిబంధనల మేరకు ప్రాధాన్యముంటుంది. 


11, ఆగస్టు 2026, మంగళవారం

వెటివర్ ఫౌండేషన్..రైతులకు ఉచిత శిక్షణ

 వట్టి వేరు వేర్లు నేల కోతను 90% వరకు తగ్గిస్తాయి. వాన నీరు 60%వరకు భూమిలోకి ఇంకుతుంది. రైతుల్లో అవగాహన పెంచేందుకు వెటివర్ ఫౌండేషన్ వేలాది మంది రైతులకు క్షేత్ర స్థాయిలో " ఉచిత ప్రాక్టికల్ శిక్షణ" ఇస్తోంది. ఒక ఎకరం పొలంలో గట్లవెంట నాటేందుకు సుమారు 2,000-3,000 వ్యాధి రహిత పిలకలు అవసరమవుతాయి. నాణ్యమైన వట్టి వేరు పిలకలను కూడా ఫౌండేషన్ రైతులకు పంపిణీ చేస్తోంది. 

వట్టివేరుపై సమగ్ర శిక్షణ ఇస్తాం..

అనేక ఔషధ,సుగంధ పంటలతో పాటు వట్టి వేరు పంట సాగు పద్ధతులు , అనువైన నేలలు,ప్రాసెసింగ్ పద్ధతులు వాణిజ్య అవకాశాలు తదితర అంశాలపై రైతులకు హైద్రాబాద్ బోడుప్పల్ లోని కార్యాలయంలో అప్పుడప్పుడు శాస్త్రీయంగా,సమగ్ర శిక్షణ ఇస్తున్నామని సైంటిస్ట్ కిరణ్ బాబు తెలిపారు.నాణ్యమైన వట్టి వేరు పిలకలను కూడా రైతులకు అందుబాటులోకి తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు.



ఆసక్తి గల రైతులు సంప్రదించాలని ఆయన సూచించారు. 

డా. జీడీ కిరణ్ బాబు, సైంటిస్ట్ ఇంచార్జ్ , కేంద్రీయ ఔషధ , సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ ( సీ ఎస్ ఐ ఆర్ సీమాప్),బోడుప్పల్ , హైద్రాబాద్ 

+91-40-27201131,27200272,

Email.. crchyd@cimap.res.in


ఉచితంగా HPV టీకాల పంపిణీ..

 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలన లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్ల కిశోర బాలికల కు" HPV టీకాను ఉచితంగా"  అందిస్తోంది. దేశంలోని అన్ని  జిల్లాల లోని అన్ని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సరైన అవగాహన లేకుండా ఎంతో మంది స్త్రీలు కాన్సర్ బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారని, ఈ అకాల మరణాలను నివారించడానికి, భారత దేశం నుండి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ను తరిమి కొట్టడానికి , ఆరోగ్య భారతాన్ని నెలకొల్పడానికి " ఉచిత వాక్సినేషన్ " అద్భుత మార్గమని పేర్కొన్నారు.

కావున ప్రజలు విస్తృత ప్రచారం కల్పించి ,అవగాహన పెంచి " ఉచిత వాక్సినేషన్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఉచిత గుండె శస్త్ర చికిత్స @నిమ్స్, హైద్రాబాద్

 గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్ లో పూర్తిగా ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా . రమణ దన్నపనేని , సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో నిమ్స్ కార్డియో థోరాసిక్ సర్జరీ విభాగం అధిపతి ప్రొఫెసర్ అమరేశ్వర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శస్త్ర చికిత్సలు చేపట్టనున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 13 నుంచి శస్త్ర చికిత్సలు ప్రారంభం కానున్నాయి. వాక్ ఇన్ విధానంలో చిన్నారులను పరీక్షించి , అవసరమైన వైద్య పరీక్షల అనంతరం సర్జరీ అవసరమున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం , సీ ఎం ఆర్ ఎఫ్ ద్వారా ఉచితంగా చికిత్స అందించనున్నారు. ఐదేళ్లుగా ఏటా ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నిమ్స్ తన వార్షిక సోషల్ హెల్త్ ప్రోగ్రామ్ లో భాగంగా పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలను అందించనుంది.పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ లు చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ తెలిపారు.

అర్హత గల చిన్నారుల తల్లి దండ్రులు సోమ వారం నుంచి శని వారం వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్ పాత బ్లాక్ మొదటి అంతస్తు లోని సీటీ సర్జరీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.

ఎలాంటి ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండానే చిన్నారులతో నిమ్స్ కు రావచ్చని తెలిపారు.

గతంలో చేయించిన వైద్య పరీక్షల రిపోర్టులు , సంబంధిత పత్రాలు ఉంటే వెంట తీసుకుని రావాలని, మరిన్ని సమగ్ర వివరాలకు 040-23489025 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్.. ఉచిత శిక్షణ

 గ్రామీణ ప్రాంత యువతి యువకులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంతోపాటు , సొంత కాళ్లపై నిలబడాలని ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ అన్నారు. సోమవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు అందించనున్న ఉచిత వృత్తి విద్యా, నైపుణ్య శిక్షణ కోర్సులకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతి యువకులకు "ఉచితంగా సాంకేతిక, వృత్తి నైపుణ్య శిక్షణ " అందిస్తూ వారిని ఉపాధి వైపు నడిపించేందుకు ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమన్నారు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు .

శిక్షణ కాలంలో  అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించడంతోపాటు యూనిఫారం, షూస్ ,బ్యాగ్ తదితర మెటీరియల్ ను ఉచితంగా అందజేస్తారని ఆయన తెలిపారు. కోర్స్ ను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఎన్ ఎస్ డి సి గుర్తింపు పొందిన సర్టిఫికెట్ అందించడంతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు .గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కోరారు. 

18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతి యువకులు శిక్షణకు అర్హులని ఆదిలాబాద్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్ తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారితో పాటు ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంఓఏ కంప్యూటర్ ట్రైనింగ్, సోలార్ టెక్నీషియన్, ఆటోమోటివ్- టూ వీలర్, ఫోర్ వీలర్ మెకానిక్, హోటల్ మేనేజ్మెంట్ ,హాస్పిటాలిటీ, ఎలక్ట్రికల్ అండ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, హెల్త్ కేర్- జి డి ఏ, నర్సింగ్ అసిస్టెంట్, బ్యూటీ అండ్ వెల్ నెస్ తదితర కోర్సులలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

 మరిన్ని సమగ్ర వివరాలకు 63036 03145 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్, తుక్కారెడ్డి రాజేందర్ రెడ్డి ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 



వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...