15, ఆగస్టు 2026, శనివారం

ఉచితంగా.. దంత వైద్య సేవలు..

 ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అని అంటారు.. అయిన వారికి దూరమై, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న పిల్లలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మేమున్నాం అంటూ " లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్" సంస్థ భరోసా ఇస్తోంది. 

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్, ఐ కే ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయిన్ పల్లి , బాపూజీ నగర్ లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో " ఉచిత దంత వైద్య సేవలు" అందుబాటులోకి తెచ్చింది. 

ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ సభ్యులు ఆర్. నారాయణ, ఆర్గొండ నర్సింలు, బచ్చు లక్ష్మణ్, కే. లింగయ్య లు అతిథులుగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 180 మందికి సేవలు అందించినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వారు తెలిపారు. 

14, ఆగస్టు 2026, శుక్రవారం

మెడి కవర్ ఆసుపత్రిలో ప్రతినెలా ఫ్రీ క్యాన్సర్ క్యాంప్

క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సతో వ్యాధి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందని హైదరాబాద్ మెడి కవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆంకాలజిస్టులు సూచించారు.

 కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో "ప్రతి నెల రెండో గురువారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని"  నిర్వహించనున్నట్లు మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డాక్టర్లు.. డాక్టర్ అన్వేష్, డాక్టర్ నీలేష్ ,డాక్టర్ స్నేహ తెలిపారు. గురువారం హాస్పిటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్లతో కలిసి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ పాల్గొని మాట్లాడారు. 

కరీంనగర్ మెడి కవర్ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన మొదటి ఉచిత క్యాన్సర్ శిబిరంలో 186 మందికి పరీక్షలు చేయగా అందులో 26 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. క్యాన్సర్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇకపై" ప్రతినెలా రెండో గురువారం"  కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో" ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని "నిర్వహించాలని నిర్ణయించినట్లు డాక్టర్లు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి అన్నారు. హాస్పిటల్ లో కల్పించిన ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ముందస్తు ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్యులు మాట్లాడుతూ కరీంనగర్లో ముఖ్యంగా "బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా " నమోదు అవుతున్నాయని తెలిపారు. మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తుందన్నారు. అయితే క్యాన్సర్ లక్షణాలు స్పష్టంగా బయటపడకముందే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని తొలి దశలో గుర్తించి తగిన చికిత్స అందించవచ్చు  అన్నారు.

 క్యాన్సర్ బారిన పడకుండా కొంతమంది నైనా కాపాడాలనే ఉద్దేశంతో మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం" ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలని " నిర్వహిస్తోందని వైద్యులు తెలిపారు. ముందస్తు గుర్తింపు, సరైన సమయంలో చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా క్యాన్సర్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.

మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ సంపత్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, పిఆర్ అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు. 



ఉచిత చేనేత శిక్షణ @ దోమకొండ

 దోమకొండలో చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకు రావడానికి దోమకొండ గడికోట ట్రస్ట్ వారి సహకారంతో "ఉచిత చేనేత శిక్షణ తరగతులు"నిర్వహిస్తున్నట్లు హైద్రాబాద్ చేనేత సేవా సంస్థ ప్రతినిధులు పవన్, సంతోష్ లు తెలిపారు. 

గురువారం దోమకొండ మండల కేంద్రంలోని ఉమా బాగ్ లో చేనేత శిక్షణ తరగతులు ప్రారంభించి ,మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నర్సయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్ధరాములు, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, గడికోట ట్రస్ట్ సీనియర్ మేనేజర్ బాబ్జీ, ప్రతినిధులు పాల్గొన్నారు. 

పోలీస్ అభ్యర్థినులకు .. ఉచిత శిక్షణ

 రెండు దశాబ్దాలుగా ఉచిత సేవలు..అభయ ఫౌండేషన్

పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న నిరుపేద మహిళా అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అభయ ఫౌండేషన్ గురువారం నాడు ప్రకటించింది. 100 రోజుల పాటు జరిగే ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో అభ్యర్థులకు "ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయం కూడా" కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఇబ్రహీం పట్నం లోని అభయ ఆనంద నిలయంలో జరిగే ఈ ఉచిత శిక్షణ కార్య క్రమానికి "రీగల్ రెక్స్ నార్డ్, వీ ఎం ఆర్ లాజిస్టిక్స్ సంస్థలు సహకరిస్తున్నట్లు ఫౌండేషన్ పేర్కొంది. 

సీనియర్ ఇన్స్పెక్టర్ పీ. జగదీశ్వర్ పర్యవేక్షణలో ఇది జరగనుంది. అభ్యర్థినులను ఎంపిక చేయడానికి ఆదివారం రాష్ట్రంలోని 12 కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్ లతో పాటు మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ముల్కనూర్, ఖమ్మం, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్, సిద్ధి పేట, సంగారెడ్డి లలో అర్హతా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 

మరిన్ని సమగ్ర వివరాలకు 9963002727,9959220450,7032813578 నంబర్ లలో సంప్రదించాలని అభయ ఫౌండేషన్ కోరింది. గత రెండు దశాబ్దాలుగా ఈ తరహా సేవలు అందిస్తున్నామని నిర్వాహకులు వివరించారు.

13, ఆగస్టు 2026, గురువారం

వాట్సాప్ లో hi.. రూ 5 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్

 భారత దేశం లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆసుపత్రి ఖర్చుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన పథకం" ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన PM JAY. ఈ పథకం ద్వారా అర్హులైన పేద మధ్య తరగతి కుటుంబాలకు సంవత్సరానికి రూ 5 లక్షల వరకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా నగదు రహిత వైద్య చికిత్స అందుతుంది. 

ఫ్రీ గా ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స పొందేందుకు ఈ ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ అత్యంత కీలకం. ఈ హెల్త్ కార్డ్ పొందడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో నుండే మీ మొబైల్ ఫోన్ లోని అధికారిక వాట్సప్ చాట్ బాట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రభుత్వ అధికారిక ఆయుష్మాన్ సారధి వాట్సాప్ నంబర్  +91 72908 23838 కు " hi" లేదా" hello" అని మెసేజ్ పంపి ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు. చాట్ బాట్ సూచనల ప్రకారం మై ఆయుష్మాన్ కార్డ్ ఆప్షన్ ను ఎంచుకుని , ఈ- కే వై సి పూర్తి చేసి నేరుగా కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

వాట్సాప్ తో పాటు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అధికారిక వెబ్ సైట్ అయిన beneficiary.nha.gov.in ను సందర్శించి మొబైల్ నెంబర్, OTP ద్వారా లాగ్ ఇన్ కావాలి. అడిగిన వివరాలు ఎంటర్ చేసి మీ పేరు, గుర్తింపు నంబర్ ఆధారంగా వివరాలు సెర్చ్ చేసి , ఫోటో అప్ లోడ్ చేసి అవసరమైన వివరాలు సబ్మిట్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. 

ఈ పథకం కింద ఎలాంటి ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు నిండిన వృద్ధులందరూ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ పొందేందుకు అర్హులే. వీరితో పాటు 2011 సామాజిక ఆర్థిక కుల గణన SECC డేటా ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల లోని ఆర్థికంగా వెనుకబడిన అనేక కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సులభ విధానాన్ని అనుసరించి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందవచ్చు. 

ఉచిత కుట్టు మిషన్ లు.. బీసీ మహిళలకు

 బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే లక్ష్యంతో కీలక స్కీంకు శ్రీకారం చుడుతున్నారు ప్రభుత్వ అధికారులు.  కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యమున్న పేద ,నిరుద్యోగ, బిసి మహిళలకు 100% ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమషన్లను ఉచితంగా అందజేయనున్నారు.

 రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 1,19000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లను బీసీ మహిళలకు అందిస్తున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టుమిషన్లను అందజేయడం ఈ స్కీం యొక్క ఉద్దేశం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కుట్టవృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మహిళల ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని అర్జించే స్వయం ఉపాధి మహిళలుగా, భవిష్యత్తు మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. పథకం విధివిధానాలు ,కేటాయించిన బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు ,దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాము వెల్లడించారు. 



ఒక్కో కుట్టు మిషన్ విలువ 12,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 15 తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు నిర్ణీత గడువులో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేసి దశల వారీగా కుట్టు మిషన్ లు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. . 

నిరుపేదలు,వితంతువులు, ఒంటరి మహిళలు,నిరాశ్రయులు,అనాథలు,దివ్యాంగులు, కుట్టు వృత్తి లో అనుభవం ఉన్న మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.

ఎంపిక ఇలా.. మండల స్థాయి కమిటీకి ఎం పీ డీ ఓ, మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ ల ప్రతినిధులు , కలెక్టర్ నామినేట్ చేసిన వ్యక్తి , డీ ఆర్ డీ ఏ ప్రతినిథి తో కలిపి మొత్తం ఏడుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో పదిమంది అధికారులు సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ ఆమోదించిన అర్హుల జాబితాను బీసీ సహకార సంస్థ ఎండి ఆమోదించిన అనంతరం కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. కుట్టు మిషన్ల కొనుగోలు ప్రక్రియను కేంద్రీకృత టెండరింగ్ విధానంలో చేపట్టనున్నారు. 

అర్హతలు ఈ విధంగా ఉన్నాయి.. బీసీ నిరుద్యోగ మహిళ అయి ఉండాలి, 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలకు మించ కూడదు. ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు .అర్హులు  https://tgobmms.chg.gov.in  వెబ్ పోర్టల్ ద్వారా మీ సేవ లేదా ఏదైనా ఆన్ లైన్ కేంద్రం ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత కమ్యూనిటీకి నిబంధనల మేరకు ప్రాధాన్యముంటుంది. 


11, ఆగస్టు 2026, మంగళవారం

వెటివర్ ఫౌండేషన్..రైతులకు ఉచిత శిక్షణ

 వట్టి వేరు వేర్లు నేల కోతను 90% వరకు తగ్గిస్తాయి. వాన నీరు 60%వరకు భూమిలోకి ఇంకుతుంది. రైతుల్లో అవగాహన పెంచేందుకు వెటివర్ ఫౌండేషన్ వేలాది మంది రైతులకు క్షేత్ర స్థాయిలో " ఉచిత ప్రాక్టికల్ శిక్షణ" ఇస్తోంది. ఒక ఎకరం పొలంలో గట్లవెంట నాటేందుకు సుమారు 2,000-3,000 వ్యాధి రహిత పిలకలు అవసరమవుతాయి. నాణ్యమైన వట్టి వేరు పిలకలను కూడా ఫౌండేషన్ రైతులకు పంపిణీ చేస్తోంది. 

వట్టివేరుపై సమగ్ర శిక్షణ ఇస్తాం..

అనేక ఔషధ,సుగంధ పంటలతో పాటు వట్టి వేరు పంట సాగు పద్ధతులు , అనువైన నేలలు,ప్రాసెసింగ్ పద్ధతులు వాణిజ్య అవకాశాలు తదితర అంశాలపై రైతులకు హైద్రాబాద్ బోడుప్పల్ లోని కార్యాలయంలో అప్పుడప్పుడు శాస్త్రీయంగా,సమగ్ర శిక్షణ ఇస్తున్నామని సైంటిస్ట్ కిరణ్ బాబు తెలిపారు.నాణ్యమైన వట్టి వేరు పిలకలను కూడా రైతులకు అందుబాటులోకి తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు.



ఆసక్తి గల రైతులు సంప్రదించాలని ఆయన సూచించారు. 

డా. జీడీ కిరణ్ బాబు, సైంటిస్ట్ ఇంచార్జ్ , కేంద్రీయ ఔషధ , సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ ( సీ ఎస్ ఐ ఆర్ సీమాప్),బోడుప్పల్ , హైద్రాబాద్ 

+91-40-27201131,27200272,

Email.. crchyd@cimap.res.in


వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...